Radhe Shyam: ప్రభాస్‌ సినిమాల కోసంబడ్జెట్‌ కేటాయించాల్సిందే:నవీన్‌ పొలిశెట్టి

సాధారణంగా సినిమాలకు ఫైనాన్సర్స్‌ ఉంటారు. ప్రభాస్‌ చిత్రాలకు మాత్రం ఫైనాన్స్‌ మినిస్టర్స్‌ ఉంటారని యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి అన్నారు.

Published : 24 Dec 2021 01:10 IST

హైదరాబాద్‌: సాధారణంగా సినిమాలకు ఫైనాన్సర్స్‌ ఉంటారని, ప్రభాస్‌ చిత్రాలకు మాత్రం ఫైనాన్స్‌ మినిస్టర్స్‌ ఉంటారని యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి అన్నారు. ‘రాధేశ్యామ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హోస్ట్‌గా హాజరైన ఆయన ప్రభాస్‌ సినిమాల బడ్జెట్‌ గురించి మాట్లాడారు. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక నటించిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీలో అభిమానులే అతిథులుగా ముందస్తు విడుదల వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా నవీన్‌.. ప్రభాస్‌ సినిమాలు, బడ్జెట్‌ గురించి సరదాగా సంభాషించారు. ‘‘హెల్త్‌ కోసం రూ.500 కోట్లు, ఎడ్యుకేషన్‌కు రూ.500 కోట్లను కేటాయించినట్టే ఇకపై పార్లమెంట్‌లో ప్రభాస్‌ అన్న సినిమా కోసం రూ.2000 కోట్లు కేటాయించండి సర్‌’ అంటూ సందడి చేశారు. ‘రాధేశ్యామ్‌’తోపాటు ప్రభాస్‌ నటిస్తున్న ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతుండటంతో నవీన్‌ ఇలా స్పందించారు. ఈ మాటలకు ప్రభాస్‌ సహా ఆయా చిత్రాల దర్శకులు నవ్వులు చిందించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని