Vijayashanti: రోహిణి నటనా చాతుర్యం.. విజయశాంతే బుల్లితెరపైకి వచ్చినట్టుంది!

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో విజయశాంతిగా కనిపించిన నటి రోహిణి. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీ ప్రసారమయ్యే కార్యక్రమం ఇది.

Published : 30 Aug 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి విజయశాంతి బుల్లితెరపైకి వచ్చి, గతంలో ఆమె పోషించిన పాత్రల్ని ప్రేక్షకులకి మరోసారి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? బుల్లితెర నటి రోహిణి అలాంటి వినోదాన్నే పంచింది. విజయశాంతే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిందా? అనేంతగా మైమరపించింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఈ సందడికి వేదికైంది. సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతుంది. ఈ క్రమంలో ఆగస్టు 29న ‘స్పెషల్‌ ట్రిబ్యూట్‌ టు విజయశాంతి’ పేరుతో ప్రసారమైన ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

 ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘ప్రతి ఘటన’ ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా విజయశాంతి నటించిన ఐదు సినిమాలు ఎంపిక చేసుకుని, వాటిల్లోని డ్యాన్స్‌లు, రక్తి కట్టించే సన్నివేశాల్ని రోహిణి తనదైన శైలిలో చూపించింది. ఆమె వస్త్రధారణ, పాత్రకి తగ్గట్టు పలికించిన హావభావాలు విజయశాంతిని గుర్తుచేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘ప్రతి ఘటన’ సినిమాల్లోని హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాల్లో అవలీలగా నటించి, అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో శెభాష్‌ అనిపించుకుంది. రోహిణి నటన తనకి బాగా నచ్చడంతో ‘సినిమాలకి లేడీ సూపర్‌ స్టార్‌ అంటే విజయశాంతి గారు, టీవీకి లేడీ సూపర్‌ స్టార్‌ రోహిణి’ అని ఆది కితాబిచ్చాడు. మరి ఇప్పటి వరకు మీరు ఈ అద్భుతమైన పర్ఫామెన్స్‌ చూడకపోతే ఇప్పుడే, ఇక్కడే చూసేయండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని