Acharya: ‘ఆచార్య’ ప్రత్యేక గీతం.. స్టెప్పులతో మెస్మరైజ్‌ చేస్తున్న చిరు

నటుడు చిరంజీవి- సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది.

Updated : 07 Dec 2022 20:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటుడు చిరంజీవి- సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. మణిశర్మ బీట్‌లకు చిరంజీవి స్టెప్పు కలిస్తే సినీ అభిమానులకు పండగే. చాలాకాలం తర్వాత ‘ఆచార్య’ చిత్రంతో ఆ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ పాటలు విశేషంగా అలరించాయి. ఇప్పుడా జాబితాలోకి మరో హుషారైన గీతం చేరింది. ఈ సినిమాలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే ప్రత్యేక గీతాన్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. మణిశర్మ సంగీతం, చిరంజీవి స్టెప్పులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటలో చిరుకి జోడీగా రెజీనా సందడి చేసింది. భాస్కరభట్ల రవికుమార్‌ రచించిన ఈ పాటను రేవంత్‌, గీతామాధురి ఆలపించారు.

దేవాదాయ శాఖ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌.. సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే  నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదలకానుంది.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని