Padma Awards: ఎస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్‌.. అవార్డు అందుకున్న చరణ్‌

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగింది.

Updated : 09 Nov 2021 19:42 IST

దిల్లీ: పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగింది. సినిమా రంగానికి సంబంధించి.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్‌ అవార్డు వరించింది. ఎస్పీబీ తరఫున ఆయన తనయుడు చరణ్‌ మంగళవారం ఈ అవార్డుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా స్వీకరించారు. గాయని చిత్ర పద్మభూషన్‌ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అవార్డుని కంగనా రనౌత్‌, అద్నాన్‌ సమీ, కరణ్‌ జోహార్, ఏక్తా కపూర్‌ సోమవారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని