Movie Ticket Rates: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ ధర ఎంతంటే..?
కరోనా కారణంగా గడిచిన రెండు సంవత్సరాల్లో సినీ ఎగ్జిబిటర్లు ఎంతో నష్టపోయారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలిపింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి తెలంగాణ ప్రభుత్వం జీవో నం:120ని...
హైదరాబాద్: కరోనా కారణంగా గడిచిన రెండు సంవత్సరాల్లో సినీ ఎగ్జిబిటర్లు ఎంతో నష్టపోయారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలిపింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి తెలంగాణ ప్రభుత్వం జీవో నం 120ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. చిన్న సినిమాలకు తక్కువ ధరలోనే థియేటర్లు టికెట్లు అమ్మాలని తెలిపారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం జీవో నం.120ని ప్రవేశపెట్టడం ఆనందించదగిన విషయం. ఎన్నో రోజులపాటు చర్చలు జరిపిన తర్వాత చిన్న, పెద్ద సినిమాలన్నీ లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఆ జీవోని ప్రవేశపెట్టారు. సినిమా టికెట్ ధరలు కూడా అందులోనే పొందుపరిచారు. చిన్న సినిమా టికెట్ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. మధ్య స్థాయి సినిమాలు విడుదలైన రెండువారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. ఇక భారీ బడ్జెట్ చిత్రమైతే గరిష్ఠ ధరలో మూడువారాల పాటు టికెట్లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి తెలిపారు.
‘ఏషియన్’ సునీల్ మాట్లాడుతూ.. ‘‘సినిమా టికెట్ ధరలు, థియేటర్ క్యాంటీన్లు ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓటీటీకే తమ ఓటంటూ పలువురు నెటిజన్లు సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్లందరికీ మేం చెప్పేది ఒక్కటే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల కంటే ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారు. మేమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా కష్టాలు అర్థం చేసుకుని మాకు కొంత అండగా ఉండేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగ్గ విషయం. కానీ, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటూ తమకు అనుగుణంగా సినిమా టికెట్ ధరలు నిర్ణయించుకున్నారని తెలిసింది. వాళ్లకు మేం ఫోన్ చేసి చెప్పాం. వాళ్లు కూడా రేపటి నుంచి ధరలు తగ్గిస్తారు. జీవో నిబంధనలకు అనుగుణంగా టికెట్ని అమ్ముతారు. ఇకపై చిన్న సినిమాలన్నింటికీ తక్కువ ధరలోనే టికెట్లు అందిస్తాం. ‘ఆర్ఆర్ఆర్’కు సింగిల్ స్క్రీన్లో రూ.175, మల్టీప్లెక్స్లో అయితే రూ.295 టికెట్ ధర ఉంటుంది. అన్ని థియేటర్లు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని మేం ఇప్పటికే చెప్పాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకపోతే ఆ థియేటర్ని సీల్ చేస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది’’ అని వివరించారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?