Cinema News: నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మృతి

తెలుగు సినిమా నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌65) పై గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా

Updated : 03 Dec 2021 09:29 IST

తెలుగు సినిమా నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌65) పై గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా నెప్పల్లిలోని బంధువుల ఇంటి నుంచి గుడివాడకు తన కారులో వెళ్తూ టైరుకు గాలి కొట్టించేందుకు పమిడిముక్కల మండలం తాడంకి వద్ద టైర్ల దుకాణం ఎదుట ఆగారు. ఈ క్రమంలో రహదారి పక్కన నిలబడి ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనం వేగంగా వస్తూ నాగేశ్వరరావును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన సంఘటనా స్థలంలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ‘లవ్‌జర్నీ’, ‘నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ తదితర చిత్రాల్ని నిర్మించారు నాగేశ్వరరావు.

- న్యూస్‌టుడే, తాడంకి(పమిడిముక్కల)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని