Shah Rukh Khan: ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ రాక ఆలస్యం

బాలీవుడ్‌ అగ్రకథానాయకులు షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ సినిమాలంటేనే సినీప్రియులు ఉర్రూతలూగిపోతుంటారు. మరి వీరిద్దరూ కలిసి తెరపై సందడి చేయబోతున్నారంటే ప్రేక్షకులకు పండగే.

Updated : 01 Dec 2023 10:44 IST

బాలీవుడ్‌ అగ్రకథానాయకులు షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ సినిమాలంటేనే సినీప్రియులు ఉర్రూతలూగిపోతుంటారు. మరి వీరిద్దరూ కలిసి తెరపై సందడి చేయబోతున్నారంటే ప్రేక్షకులకు పండగే. షారుక్‌, సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’. ఈ మల్టీస్టారర్‌ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ‘వచ్చే ఏడాది ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. ఆదిత్య చోప్రా ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని భారీ పోరాటాల్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. 2025లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు 2026లో ఈ సినిమా విడుదల కానుంది’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని