Tollywood: క్యాంపస్ వినోదం.. ర్యాంకుల సందేశం...
ర్యాంకుల పరుగులో మానవత్వాన్ని మరిచిపోతున్న విద్యా సంస్థల యాజమాన్యాలు ఒకపక్క! విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్లు మరోపక్క! వీటి మధ్య నలిగిపోతూ ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఈ కాన్సెప్ట్కి క్యాంపస్ వినోదాన్ని
ర్యాంకుల పరుగులో మానవత్వాన్ని మరిచిపోతున్న విద్యా సంస్థల యాజమాన్యాలు ఒకపక్క! విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్లు మరోపక్క! వీటి మధ్య నలిగిపోతూ ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఈ కాన్సెప్ట్కి క్యాంపస్ వినోదాన్ని జోడిస్తూ... అందరినీ ఆలోచింపజేలా ‘వెల్కమ్ టు తీహార్ కాలేజ్’ (Welcome To Tihar College) చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు పి.సునీల్కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో డా.ఎల్.ఎన్.రావు, యక్కలి రవీంద్రబాబు నిర్మించిన చిత్రమిది. మనోజ్ నందం, చక్రి, మనీషా, సోనిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరకర్త. అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని పాటల్ని మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘‘విద్యార్థులతోపాటు... వాళ్ల తల్లిదండ్రులకీ, విద్యావేత్తలకీ, యాజమాన్యాలకీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సమాజంలో మార్పునకు దోహదం చేసేంతగా కథ, కథనాలు ప్రభావం చూపిస్తాయ’’న్నారు ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు, అజయ్కుమార్, జయచంద్రారెడ్డి, ఎమ్.ఎమ్.శ్రీలేఖ, సుభాష్, భార్గవ్, నికిలేష్ భరద్వాజ, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
అందాల అప్సరస
రంజిత్, సౌమ్య మేనన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లెహరాయి’ (Lehrayi). రామకృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. బెక్కం వేణుగోపాల్ సమర్పకుడు. గగన్ విహారి, రావు రమేష్, నరేష్, అలీ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రంలోని ‘అప్సరస.. అప్సరస...’ పాటని విడుదల చేస్తున్నారు. శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆలపించారు. ఘంటాడి కృష్ణ స్వరకర్త. ‘‘అనుభూతిని పంచే కథ ఇది. ఏడు పాటలున్నాయి. ఘంటాడి కృష్ణ స్వరకల్పనలోని ఆ పాటలన్నీ అలరిస్తాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి.
తెలిసినవాళ్ల కుటుంబ హత్యలు
రామ్ కార్తీక్ (Ram karthik), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా తెరకెక్కిన చిత్రం ‘తెలిసినవాళ్ళు’ (Telisinavallu). విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్ల మేళవింపు ఈ చిత్రం. కుటుంబాల ఆత్మహత్యల నేపథ్యంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించాం’’ని సినీ వర్గాలు తెలిపాయి.
‘హౌస్ హజ్బెండ్’ కథేంటి?
శ్రీకర్, అపూర్వ జంటగా హరికృష్ణ జినుకల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘హౌస్ హజ్బెండ్’ (Half Husband). భానుచందర్, సుమన్, గిరిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. చిత్ర దర్శక నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇదొక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. కొవిడ్ టైమ్లో కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో ఓ షెడ్యూల్ పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘ఇంటిపట్టునే ఉండే భర్త కావాలనుకున్న ఓ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది చిత్ర కథాంశం’’ అన్నారు హీరో శ్రీకర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ