Tollywood: ఆఖర్లో ఆకర్షణలెన్నో!
సినిమాకి మంచి ఆరంభమే కాదు... ముగింపు కూడా అంతే కీలకం. ‘మా సినిమా ఆద్యంతం అలరిస్తుంది’ అనే మాటని చిత్రబృందాలు ఎక్కువగా వాడుతుంటాయంటే కారణం అదే!
సినిమాకి మంచి ఆరంభమే కాదు... ముగింపు కూడా అంతే కీలకం. ‘మా సినిమా ఆద్యంతం అలరిస్తుంది’ అనే మాటని చిత్రబృందాలు ఎక్కువగా వాడుతుంటాయంటే కారణం అదే! సినిమా చివర్లోనూ తెరపై వినోదం వెల్లివిరిసిందంటే ప్రేక్షకుడు తృప్తిగా బయటికొస్తాడు. చివరి మూడు నెలలపై అదే తరహాలోనే చిత్రసీమకి అంచనాలు ఉంటాయి. మంచి క్లైమాక్స్లాగే... చివర్లో వచ్చే మన సినిమాలు సత్తా చాటాయంటే ఇక ఆ ఏడాదికి సంతృప్తిగా వీడ్కోలు పలకొచ్చని వ్యాపార వర్గాలు భావిస్తుంటాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా దసరా, దీపావళి, క్రిస్మస్ సందర్భంగా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకూ దాదాపు 175కిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఇవన్నీ తెలుగులో నేరుగా తెరకెక్కినవే. అనువాద చిత్రాలు 55కిపైగానే వచ్చాయి. రానున్న కీలకమైన సీజన్లలోనూ పోటాపోటీగా చిత్రాలు విడుదల కానున్నాయి. ఇప్పటిదాకా గడిచిన సీజన్లలో సంక్రాంతి మినహా ఏదీ అనుకున్న స్థాయిలో సద్వినియోగం కాలేదు. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈసారి వేసవి అగ్ర తారల సందడి లేకుండానే గడిచిపోయింది. వినాయక చవితికీ సరైన సినిమాలు రాలేదు. ఏడాది ఆఖరి మూడు నెలల్లో మాత్రం తారల సినిమాల జోరు ఎక్కువగానే కనిపించనుంది. బాలకృష్ణ, రవితేజ, ప్రభాస్, నాని, కల్యాణ్రామ్, వరుణ్తేజ్, నితిన్ తదితర కథానాయకుల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీరికితోడుగా అన్నట్టు అనువాదాలతో పొరుగు భాషల నుంచీ అగ్ర తారలు దూసుకు రానున్నారు. 2023 క్లైమాక్స్లో మెరుపులే అన్నమాట.
దసరా నుంచే...
అసలు సిసలైన ఆఖరి వరుస సినిమాలు దసరా సీజన్ నుంచే షురూ అవుతున్నాయి. అక్టోబరు 6నే ఓ స్థాయి అంచనాలున్న అరడజను సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కానీ, 19న బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘భగవంత్ కేసరి’ విడుదలవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కాజల్ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయని ఇటీవల బాలకృష్ణ స్వయంగా చెప్పారు. ‘దంచవే మేనత్త కూతురా...’ అనే పాట రీమిక్స్ ఉంటుందని సమాచారం. పండగంటే మన దగ్గర రెండు మూడు సినిమాలైనా విడుదల కావల్సిందే. అందుకే 20న ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ హంగామా మొదలవుతుంది. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. వంశీ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రమిది. వీరికితోడు తమిళ కథానాయకుడు విజయ్ నటించిన ‘లియో’ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. హిందీ నుంచి టైగర్ ష్రాఫ్ నటించిన ‘గణపథ్’ కూడా 20న విడుదలవుతోంది. దసరా తర్వాత సీజన్ అంటే దీపావళినే. అయితే మధ్యలోనూ ‘కీడాకోలా’ తరహా కొన్ని కీలక చిత్రాలు విడుదలవుతున్నాయి. దీపావళికి సందర్భంగా వైష్ణవ్తేజ్ ‘ఆదికేశవ’తోపాటు తమిళం నుంచి కార్తి ‘జపాన్’, లారెన్స్ ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ తదితర చిత్రాలు విడుదల కానున్నాయి. నవంబరు 24న కల్యాణ్రామ్ ‘డెవిల్’ విడుదల కానుంది.
ప్రభాస్... షారుక్
డిసెంబరులో బాక్సాఫీస్ దగ్గర హంగామా మామూలుగా ఉండదు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సలార్’, షారుక్ ‘డంకీ’ చిత్రాలు ఒకే రోజున డిసెంబరు 22న విడుదల కానున్నాయి. నెల ఆరంభం నుంచే చిత్రాలు వరుస కడుతున్నాయి. రణ్బీర్ కపూర్ కథానాయకుడిగా, తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ డిసెంబరు 1న విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలున్న చిత్రమిది. డిసెంబరు 8న నితిన్ ‘ఎక్స్ట్రా’, వరుణ్తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలు విడుదలవుతున్నాయి. వరుణ్ తెలుగు, హిందీ భాషల్లో నటించిన చిత్రమిది. అదే రోజున విష్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా విడుదల ఖరారు చేసుకుంది. ఇక డిసెంబరు 15న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ విడుదల కానుంది. నాని కథానాయకుడిగా నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబరులో వస్తుందనుకున్న ‘సలార్’ డిసెంబరు 22కి వాయిదా పడటంతో సినిమాల విడుదలల సరళి ఒక్కసారిగా మారిపోయింది. ‘హాయ్ నాన్న’ విడుదల కూడా అటూ ఇటూ మారే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రతి ఏటా దీపావళి తర్వాత సంక్రాంతే సినీ ప్రియుల్ని ఎక్కువగా ఆకర్షించేది. డిసెంబరులో అప్పుడప్పుడు కీలకమైన ఒకట్రెండు సినిమాలు వచ్చినా సంక్రాంతికే ఎక్కువ ఆకర్షణలు ఉండేవి. ఈసారి ‘సలార్’, ‘డంకీ’ సినిమాల వల్ల డిసెంబరులోనూ బాక్సాఫీస్ వసూళ్లతో కళకళలాడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్