‘ఉప్పెన’ డైరెక్టర్‌కు ఖరీదైన కానుక

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన డైరెక్టర్‌ బుచ్చిబాబుకు ఓ ఖరీదైన కానుక లభించింది. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Updated : 26 Mar 2021 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన డైరెక్టర్‌ బుచ్చిబాబును ఓ ఖరీదైన కానుక వరించింది. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ విజయంతో ఇప్పటికే వరుస సినిమా ఆఫర్లతో సంతోషంలో మునిగి తేలుతున్న బుచ్చిబాబు ఖాతాలో మరో కానుక వచ్చి చేరింది. తమకు కలెక్షన్ల వర్షం కురిపించే సినిమా తీసినందుకు గాను.. సదరు చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఒక బెంజ్‌ కారును బుచ్చిబాబుకు కానుకగా పంపించింది. ఆ కారు విలువ దాదాపు రూ.75లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ స్వయంగా బుచ్చిబాబుకు కారు అందజేసి అభినందించారు. కాగా.. తనకు కానుక అందిన ఆ కారులో మొదటగా తన గురువు సుకుమార్‌ను ఎక్కించుకొని బుచ్చిబాబు ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు.. హీరో వైష్ణవ్‌ తేజ్‌కు రూ.కోటి, హీరోయిన్‌ కృతిశెట్టికి రూ.25లక్షలు అదనంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, బుచ్చిబాబుతో మరో రెండు సినిమాలు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని