vishnu vishal: ఆ సినిమా విడుదల నిర్మాతల నిర్ణయం: విష్ణు విశాల్‌

‘పొన్‌ ఒండ్రు కండేన్‌’ సినిమాపై ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Published : 16 Mar 2024 20:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటులు అశోక్‌ సెల్వన్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్‌ ఒండ్రు కండేన్‌’ (pon ondru kanden). ఈ సినిమాను కలర్స్‌ తమిళ్‌ అనే టీవీ ఛానల్‌లో విడుదల చేస్తున్నట్లు నిర్మాణసంస్థ ప్రోమో విడుదల చేసి తెలిపింది. దీంతో వసంత్‌ రవి ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘చాలా షాకింగ్‌గా ఉంది. జియో స్టూడియోస్‌ వంటి నిర్మాణసంస్థ ఈ నిర్ణయం తీసుకుంది అంటే నమ్మలేకపోతున్నా. సినిమాతో సంబంధం ఉన్న ఏ ఒక్కరికీ కనీసం సమాచారం ఇవ్వలేదు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. టీవీలో రిలీజ్‌ చేస్తుండటం బాధగా ఉంది’’ అని వసంత్‌ పేర్కొన్నారు.  దీనిపై కోలీవుడ్‌ నటుడు విష్ణు విశాల్‌ (vishnu vishal) స్పందించారు. 

‘‘నా స్నేహితులు వసంత్‌, అశోక్‌ మీరు భావోద్వేగభరితమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీ మెదడులో ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. చిత్ర బృందానికి సానుభూతి తెలియజేస్తున్నా. సినిమా చేయాలన్నా, అందరినీ ఒక గూటికి చేర్చాలన్నా కమ్యూనికేషన్‌ ఉండాలి. కానీ ఈ సినిమా విషయంలో అది నిర్మాతల నిర్ణయం. ప్రతిభ ఉన్న నిపుణులు కలిసి పనిచేసిన ఈ సినిమాను కచ్చితంగా చూస్తాను’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని