US Consulate Building: ఇక చకచకా అమెరికా వీసాలు
అదో మహా సౌధం.. శత్రు దుర్భేద్యం.. పచ్చదనానికి పెద్దపీట.. 12.2 ఎకరాల ప్రాంగణం. రూ. 2,251 కోట్ల నిర్మాణ వ్యయం.. హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ సొంత భవన సముదాయం
హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్కు సొంతగూడు
నవంబరులో ప్రారంభం
నిర్మాణ వ్యయం రూ. 2,251 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: అదో మహా సౌధం.. శత్రు దుర్భేద్యం.. పచ్చదనానికి పెద్దపీట.. 12.2 ఎకరాల ప్రాంగణం. రూ. 2,251 కోట్ల నిర్మాణ వ్యయం.. హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ సొంత భవన సముదాయం ప్రత్యేకతలివి. ఈ ఏడాది నవంబరు నుంచి సొంత ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల వీసా అపాయింట్మెంట్స్ సంఖ్య, ఇంటర్వ్యూ కేంద్రాల (విండోస్) సంఖ్య పెరగనుంది. వీసా ఆమోదం తరవాత పాస్పోర్టు తిరిగి ఇచ్చే వ్యవధి మరింత తగ్గనుంది. హైదరాబాద్లోని పాయిగా ప్యాలెస్లో 2008 నుంచి ఈ కాన్సులేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. నానక్రాంగూడలో సొంత భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 12.2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీని గురించి హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ అధికార ప్రతినిధి డేవిడ్ మోయర్ ‘ఈనాడు’ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
కొత్త ప్రాంగణం వల్ల వీసా దరఖాస్తుదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
ఇంటర్వ్యూ కేంద్రాలు అదనంగా 40 వరకు పెరుగుతాయి. ఇంటర్వ్యూల కోసం అనుమతించే దరఖాస్తుదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. వీసా జారీ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేందుకు 225 డెస్క్లు ఏర్పాటు చేస్తున్నాం. దరఖాస్తుదారుల కోసం సదుపాయాలు విస్తరిస్తాం.
మూడేళ్లుగా నిర్మాణం సాగుతోంది కదా?
అమెరికా నిర్మాణ రంగ ప్రమాణాల మేరకు జరుగుతోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఓవర్సీస్ బిల్డింగ్స్ ఆపరేషన్ విభాగం నమూనాల నుంచి నిర్మాణ ప్రమాణాల వరకు అన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తుంది. సాధారణ భవనం కన్నా 50 శాతం విద్యుత్తు వినియోగం తగ్గేందుకు వీలుగా మెకానికల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 81.72 శాతం మేరకు నీటి వినియోగం తగ్గుతుంది. వర్షపు నీటిని అందిపుచ్చుకునేందుకు వీలుగా జల సంరక్షణ వ్యవస్థ ఉంటుంది.
నిర్మాణ వ్యయం ఎంత?
నిర్మాణానికి అమెరికా ప్రభుత్వం రూ. 2,251 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రధాన భవనం 17,917 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రకృతి సిద్ధమైన పచ్చదనం కనిపిస్తుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఉన్న రాళ్లను (డక్కన్ రాక్ ఫార్మేషన్) యథాతథంగా పరిరక్షిస్తున్నాం.
కరోనా తరవాత వీసా ప్రక్రియను వేగవంతం చేశారా?
సాధ్యమైనంత మేరకు వేగవంతం చేస్తున్నాం. వీసా ఇంటర్వ్యూ కోసం ఎంత కాలం వేచి ఉండాలన్నది ప్రతి వారం https://travel.state.gov/content/travel/en/us-visas/visa-informationresources/ wait-times.html వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నాం. వేచి ఉండే వ్యవధిని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?