అమెరికాలో శ్రీవారికి సహస్ర కలశాభిషేకం

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు నక్షత్రశాంతి ఆగమోక్త ఆచారాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. 25 మంది అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్ర

Updated : 17 Aug 2022 05:44 IST

ఈనాడు, అమరావతి: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు నక్షత్రశాంతి ఆగమోక్త ఆచారాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. 25 మంది అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్ర పఠనం, శాంతిమంత్ర జపాలు చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో దేవస్థానం ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గోమాతను పూజించారు. అమెరికాలో తొలి దేవాలయంగా పేరొందిన ఇక్కడ 47 ఏళ్లుగా ఉత్సవాలు, కుంభాభిషేకాలు నిర్వహిస్తున్నారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌ నాగబండి, కార్యదర్శి చంద్రశేఖర్‌, ప్రెసిడెంట్‌ శర్వన, కోశాధికారి రాజి శ్రీనివాసన్‌, కల్యాణ్‌ శీలంనేని, శ్రావణ్‌ చిన్నల, చంద్ర భోనగిరి తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని