అక్టోబరులోనే కాంగ్రెస్ తొలి జాబితా
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా అక్టోబరు మొదటి వారంలో విడుదల కానుంది. ఇప్పటికే 80కిపైగా నియోజకవర్గాలపై రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో స్పష్టత రావడంతో ప్రాథమిక జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపారు.
ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా అక్టోబరు మొదటి వారంలో విడుదల కానుంది. ఇప్పటికే 80కిపైగా నియోజకవర్గాలపై రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో స్పష్టత రావడంతో ప్రాథమిక జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ ఇతర ముఖ్యనేతలతో కూడిన సీఈసీ ఈనెల 29న భేటీ అయ్యే అవకాశముంది. అక్కడ అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేస్తారు. ఏమైనా మార్పుచేర్పులు చేయాల్సి ఉంటే, ముగించేసి, అభ్యర్థుల పేర్లను తొలి విడత జాబితాలో ప్రకటిస్తారు. మిగిలిన అభ్యర్థుల ఎంపికపై వివిధ నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కుదిరినా సామాజిక సమతౌల్యం, మహిళలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండడంతో కసరత్తును కొనసాగిస్తున్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బలమైన మహిళా నేతలు లేకపోవడంతో మంచిర్యాల స్థానంలో ప్రేమ్సాగర్రావుకు బదులు ఆయన భార్య కొక్కిరాల సురేఖ, చెన్నూరు(ఎస్సీ) స్థానంలో నల్లాల ఓదేలుకు బదులు ప్రస్తుత జడ్పీ ఛైర్పర్సన్, ఓదేలు సతీమణి భాగ్యలక్ష్మి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీల్లోని ఉపవర్గాలను గమనంలోకి తీసుకుని... వారి జనాభా, ప్రాబల్యం ఆధారంగా టికెట్లను కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీల్లోనూ బాగా వెనుకబడిన కులాలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దాదాపు 30 స్థానాలను ప్రస్తుతం పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ కసరత్తు పూర్తయ్యాక రెండో విడత జాబితాను విడుదల చేయనున్నారు.
గాంధీభవన్ వేదికగానే చేరికలు
కాంగ్రెస్లో చేరికల కార్యక్రమాన్ని దిల్లీలో కాకుండా హైదరాబాద్లోని గాంధీభవన్ వేదికగానే చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయించింది. భారాసకు రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతోపాటు భారాస, భాజపాల నుంచి చేరే వారిని రానున్న మంగళ, గురువారాల్లో గాంధీభవన్లోనే చేర్చుకోవాలని నిర్ణయించారు. పార్టీలో చేరాలనుకునే వారు దిల్లీకి వచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్లతో సమావేశమై, చర్చించాక హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఈ క్రమంలోనే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దిల్లీకి వచ్చినా హైదరాబాద్లోనే చేరిక ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వచ్చిన కొందరు అనుచరుల విన్నపంతో ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీభవన్లో చేరికలు చేపడితేనే పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రావడానికి వీలుంటుందని, ప్రజల్లోకి సానుకూల వాతావరణం పోతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇవే వివరాలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రే శనివారం సాయంత్రం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఆఖరి ప్రయత్నాల్లో ఆశావాహులు
దాదాపు 80కిపైగా స్థానాల్లో వడపోత ముగిసిందని, మిగిలిన వాటికీ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారని నాయకులు చెబుతున్నా ఆశావహులు తమ ప్రయత్నాలు మానడం లేదు. దిల్లీలో రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిల ఫ్లాట్లున్న యమున అపార్ట్మెంట్ ఎదుట, లోధి రోడ్డులోని ఉత్తమ్కుమార్రెడ్డి ఇంటి ఎదుట బారులు తీరుతున్నారు. వారికి సర్దిచెప్పేందుకు నాయకులకు శక్తికి మించిన పని అవుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు ఆశావహులు, నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు వస్తుండటంతో పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. సమీపంలోని ఫైవ్స్టార్ హోటళ్లలో గదుల లభ్యత లేకుండా పోయింది.
ఆరు గ్యారంటీలు.. కాంగ్రెస్ సిక్సర్లు
సోనియా గాంధీ తుక్కుగూడ సభలో ప్రకటించిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ కొట్టిన సిక్సర్లుగా రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ సిక్సర్ల తర్వాత కాంగ్రెస్కే ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారని, దీంతో ఇతర పార్టీల నేతలు చాలామంది కాంగ్రెస్లో చేరాలని ఉత్సాహంగా ఉన్నారన్నారు. దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఆయన శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా విడుదల కాకముందే కొందరు టికెట్లు వచ్చాయని సంతోషిస్తుండగా, మరికొందరు రాలేదని వేదనకు గురవుతున్నారని.. రెండూ సరికాదని చెప్పారు. టికెట్లు రానివారికి అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణలో భారాస గెలుపు కోసం భాజపా-భారాసలు కొత్త నాటకానికి తెరలేపాయన్నారు. దిల్లీ మద్యం కేసులో కవితను జైలుకు పంపి సానుభూతి పొందాలని భారస ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేయగానే దానిపై చర్చ జరగకుండా ఉండేందుకు కవితకు నోటీస్లు ఇవ్వాలని ఆ రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. భాజపా, భారాస, మజ్లిస్లు ఒక్కటేనని, ఈ నెల 17, 18, 19 తేదీల్లో తెలంగాణలో తాము కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. అప్పుడే ఆ పార్టీలూ పెట్టాయని మండిపడ్డారు. తనను విమర్శించే ముందు సొంత పార్టీ నేతల ప్రశ్నలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమాధానమివ్వాలని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. -
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన