బీసీల ఉద్యమానికి మద్దతు
బీసీలకు మహిళా రిజర్వేషన్లలో వాటా, చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణన చేపట్టాలన్న డిమాండ్లతో తెలంగాణలోని బీసీ సంఘాలు నిర్వహించనున్న సదస్సుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందే
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
భారాస నేతతో ఆర్.కృష్ణయ్య భేటీ
ఈనాడు, హైదరాబాద్: బీసీలకు మహిళా రిజర్వేషన్లలో వాటా, చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణన చేపట్టాలన్న డిమాండ్లతో తెలంగాణలోని బీసీ సంఘాలు నిర్వహించనున్న సదస్సుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బలహీనవర్గాలవారి సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి భారాస అండగా ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య శనివారం కవితతో ఆమె నివాసంలో సమావేశమై బీసీల డిమాండ్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ కమిషన్ అధ్యక్షుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, భారాస ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, కార్పొరేషన్ల ఛైర్మన్లు జూలూరు గౌరీశంకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆంజనేయగౌడ్, రవికుమార్గౌడ్, ప్రవీణ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై తీర్మానం చేశాం. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కులగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. బీసీ బంధు పథకం అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లలో వాటా, ప్రత్యేక రిజర్వేషన్లు, న్యాయమైన డిమాండ్ల సాధనలో బీసీలకు అండగా ఉంటాం’’ అని పేర్కొన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, జనగణన అనే మూడు డిమాండ్లతో ఈ నెల 26న జలవిహార్లో రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలు, నాయకులతో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు. మహిళా బిల్లు కోసం పోరాడినందుకు కవితను అభినందించారు. అనంతరం కవితతో భారాస బీసీ నేతలు సమావేశమై జలవిహార్ సదస్సు నిర్వహణ, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.