మణిపుర్ నుంచి మహారాష్ట్ర వరకు.. భారత్ న్యాయ్ యాత్ర
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్ మరో మహాయాత్రకు సన్నద్ధమైంది. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా ‘భారత్ న్యాయ్ యాత్ర’ను చేపట్టనుంది.
జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభించనున్న రాహుల్గాంధీ
మార్చి 20న ముంబయిలో ముగింపు
14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6,200 కిలోమీటర్ల ప్రయాణం
బస్సుల్లో, కాలినడకన కొనసాగనున్న యాత్ర
ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్ మరో మహాయాత్రకు సన్నద్ధమైంది. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా ‘భారత్ న్యాయ్ యాత్ర’ను చేపట్టనుంది. పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ దీనికి నేతృత్వం వహించనున్నారు. జోడో యాత్ర రాహుల్ నాయకత్వంలో దక్షిణాది నుంచి ఉత్తరాదికి సాగింది. న్యాయ్ యాత్ర మణిపుర్ నుంచి మహారాష్ట్ర వరకు.. అంటే తూర్పు నుంచి పశ్చిమ భారత్కు సాగుతుంది. జనవరి 14న మణిపుర్ రాజధాని ఇంఫాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి దీన్ని ప్రారంభిస్తారు. మార్చి 20న ముంబయిలో ముగుస్తుంది. అరవై ఏడు రోజులపాటు మొత్తం 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా.. దాదాపు 6,200 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగుతుంది. అయితే ‘జోడో’ పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కె.సి.వేణుగోపాల్, జైరాం రమేశ్ దిల్లీలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ మేరకు కీలక వివరాలు వెల్లడించారు.
ఘర్షణల గాయాలు మాన్పేందుకే మణిపుర్ నుంచి..
జోడో యాత్రకు కొనసాగింపుగా తూర్పు భారత్ నుంచి పశ్చిమానికి రాహుల్గాంధీ రెండో దశ యాత్ర మొదలుపెట్టాలని ఈ నెల 21న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించిన సంగతిని కె.సి.వేణుగోపాల్ గుర్తుచేశారు. జాతుల మధ్య ఘర్షణలతో అతలాకుతలమైన మణిపుర్ నుంచి న్యాయ్ యాత్రను మొదలుపెట్టడం ద్వారా అక్కడి గాయాలను మాన్పే ప్రక్రియను ప్రారంభించాలని రాహుల్గాంధీ భావిస్తున్నట్లు చెప్పారు. మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఈ యాత్ర ఉంటుందని వివరించారు. ఇందులో భాగంగా మహిళలు, యువత, అణగారిన వర్గాల ప్రజలతో రాహుల్ మాట్లాడతారని చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగిన సంగతి గమనార్హం.
న్యాయం కోసం పోరాటం
ప్రజలకు అన్ని రకాల న్యాయం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపడుతున్నట్లు జైరాం రమేశ్ తెలిపారు. జోడో యాత్ర ద్వారా ఆర్థిక అసమానతలు, విభజన, నియంతృత్వంలాంటి సమస్యలను రాహుల్గాంధీ ప్రస్తావించారని.. న్యాయ్ యాత్రతో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడనున్నారని చెప్పారు. ఈ యాత్రలో విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు పాలుపంచుకునే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. దానిపై కసరత్తు చేస్తామని వేణుగోపాల్ చెప్పారు. జోడో యాత్రలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారని జైరాం రమేశ్ గుర్తుచేశారు.
నినాదాలతో ప్రజలను మోసం చేయలేరు: భాజపా
భారత్ న్యాయ్ యాత్రను చేపట్టడం ద్వారా కాంగ్రెస్ సాధించేదేమీ ఉండదని భాజపా ఎద్దేవా చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు దేశ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తోందని.. తద్వారా అందరికీ న్యాయం చేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత మీనాక్షీ లేఖి పేర్కొన్నారు. అనేక ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ 1984 నాటి సిక్కు అల్లర్ల బాధితులకు న్యాయం చేయలేకపోయినవారు దేశ ప్రజలందరికీ ఎలా న్యాయం చేయగలరని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ కాంగ్రెస్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
రెజ్లర్లను కలిసిన రాహుల్గాంధీ
భారత రెజ్లింగ్ సమాఖ్య వివాదాల్లో కూరుకున్నవేళ వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హరియాణాలో పలువురు రెజ్లర్లను కలిశారు. ఝజ్జర్ జిల్లాలోని వీరేందర్ అఖాడాకు బుధవారం ఉదయం వెళ్లిన ఆయన.. ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా సహా పలువురు మల్లయోధులతో మాట్లాడారు. రాహుల్ తమ రెజ్లింగ్ సాధన చూసేందుకు వచ్చారని.. తమతో కాసేపు మల్లయుద్ధం కూడా చేశారని పునియా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్కు ఫిర్యాదు చేశారు. -
పీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి
తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి నియమితులయ్యారు. -
నిర్ణేతలు బీసీలే!
బలమైన రెండు కూటములు.. వర్గాలవారీగా విడిపోయిన ఓటర్ల మధ్య బిహార్లోని 8 నియోజకవర్గాలకు ఈ నెల 25వ తేదీన ఆరో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్హర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహరాజ్గంజ్లలో మొత్తం 86 మంది బరిలో ఉన్నారు. -
ప్రజా విశ్వాసమే నా సంపద
ప్రజలు తనపై ఉంచిన అపారమైన విశ్వాసమే తనవద్ద ఉన్న ఏకైక, అమూల్యమైన సంపద అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘నేనూ ఒక మనిషినే. -
మంచిరోజులు వస్తున్నాయి.. మోదీ వెళ్లిపోతున్నారు: కేజ్రీవాల్
త్వరలో దేశానికి ‘మంచిరోజులు రాబోతున్నాయి..మోదీజీ వెళ్లిపోతున్నారు’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో 59% పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ కింద ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం నిర్వహించిన పోలింగులో 59% మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
దేశం మార్పు తుపాను చూస్తోంది: రాహుల్
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారన్న సంగతి విస్పష్టమని, దేశం మార్పు తుపానును చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నవీన్ పట్నాయక్ చుట్టూ అవినీతి కోటరీ
రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నా.. పేదరికంలో మగ్గుతూ, వలసలకు మారుపేరుగా నిలిచిన ఒడిశా విధ్వంసం తనను ఆవేదనకు గురిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పాతికేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజూ జనతాదళ్ (బిజద) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందన్నారు. -
ఫరీద్కోట్ లోక్సభ ప్రత్యేక పరిశీలకుడిగా భట్టి
పంజాబ్లోని ఫరీద్కోట్ (ఎస్సీ) లోక్సభ ఎన్నిక ప్రత్యేక పరిశీలకుడిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్కే సీపీఐ మద్దతు
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఓ ప్రకటనలో విమర్శించారు. కేవలం సన్న రకం వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందన్నారు. -
సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలా?
పోలింగ్ అనంతర హింసపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించకుండా.. కేవలం సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్ అన్నారు. -
ఐప్యాక్తో పాటు ఖాళీ అయిన సీఐడీ కార్యాలయం
ఎన్నికల తర్వాత వైకాపా సోషల్ మీడియా, ఐప్యాక్ల బృందంతో పాటు జగన్ కనుసన్నల్లో నడిచిన సీఐడీ కార్యాలయం కూడా ఖాళీ అయిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.