అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు.
అభ్యర్థులంతా మంచివారని జగన్ కితాబు
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి ఎన్నికల బాధ్యతలా!
ప్రకృతి వనరులను దోచేస్తున్నది ఎవరని ప్రశ్నిస్తున్న ప్రజలు
ఈనాడు, అమరావతి: కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. వారిని పేరుపేరునా మేమంతా సిద్ధం సభలో పరిచయం చేశారు. మరి ఈ అయిదేళ్లలో ఆ నియోజకవర్గాల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలకు బాధ్యులెవరో కనుక్కోవాలని స్థానికులే అడుగుతున్నారు. చెప్పగలరా జగన్?
సౌమ్యుడు-1 ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
‘కాకినాడ సిటీ నుంచి పోటీచేస్తున్న చంద్ర (ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి) మంచివాడు.. సౌమ్యుడు. పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు’ అంటూ సీఎం జగన్ ఆకాశానికెత్తేశారు. మరి కాకినాడ సిటీలో అయిదేళ్లుగా అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేదు. రేషన్ మాఫియాకు కాకినాడే కేంద్రస్థానంగా పేరుపడింది. ఆ మాఫియా నేత ఎవరో కాస్త అడిగి చెబుతారా? భూముల కబ్జాలకు అంతే లేదు. పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తి ప్రాంతాల్లో మట్టిని మింగేసిన ఘనులూ ఉన్నారు. విశాఖ మన్యం నుంచి గంజాయి తెచ్చే ముఠాకు నాయకుడెవరో కూడా ఆరా తీస్తారా? గతంలో ప్రతిపక్షాలకు చెందిన అగ్రనేతలను మహిళా ప్రతినిధుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించారన్న సంగతైనా మీ అభ్యర్థికి తెలుసేమో అడిగారా? కాస్త కనుక్కుని ప్రజలకు వివరించి చెప్పొచ్చుగా?
సౌమ్యుడు-2: దాడిశెట్టి రాజా
‘తుని నుంచి పోటీచేస్తున్న రాజా మంచివాడు, నాకు స్నేహితుడు. సౌమ్యుడంటూ జగన్ ప్రశంసల్లో ముంచెత్తారు. మూడుముక్కలాటలు, గానాబజానాల్లో మునిగితేలే నేతలెవరో ఆయనకు బాగా తెలుసని నియోజకవర్గంలోని వారంతా అంటున్నారు. అయిదేళ్లుగా నియోజకవర్గంలో అరాచకాలకు అంతే లేదు. లాటరీ టికెట్లు, గుట్కా వ్యాపారం చేయిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. మట్టి, ఇసుకను కొల్లగొడుతున్నారు. వాళ్లంతా ఎవరో మీ స్నేహితుడికి తెలుసా? దళితుల సాగుభూముల్నీ వదలకుండా కబ్జా చేసిన ఘనులెవరోకూడా మీ స్నేహితుడ్ని అడిగి చెప్పండి.
సౌమ్యుడు-3: కురసాల కన్నబాబు
మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందే ఉంటారంటూ... కాకినాడ రూరల్ నుంచి పోటీచేస్తున్న కన్నబాబును జగన్ వెనకేసుకొచ్చారు. ఆయన ఎంతో సౌమ్యుడని కొనియాడారు. అంతులేని అక్రమాలెన్నింటికో ఆయన ప్రాతినిధ్యం వహించే కాకినాడ గ్రామీణ నియోజకవర్గం కేంద్రమైంది. ఇంటిపట్టా ఇవ్వాలంటే రూ.60వేల నుంచి రూ.1.50లక్షలు కట్టాలని పేదలను వేధించారు. రియల్ఎస్టేట్ వెంచర్లు వేసుకోవాలన్నా.. కాంట్రాక్టు పనులు చేయాలన్నా రూ.లక్షల్లో వసూలుచేశారు. వివాదాస్పద భూములు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని బెదిరించి వాటిని కబ్జా చేశారు. సౌమ్యుడంటూ మీరు కితాబిచ్చిన కన్నబాబుకు ఇవన్నీ తెలుసో లేదో, ఎవరు చేశారో ఆయన్ని అడిగి చెబుతారా? భూ వివాదాల కారణంగా ఇటీవల ఒక వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇన్ని దారుణాలు జరుగుతుంటే మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుండే కన్నబాబు చూస్తూ ఊరుకుంటున్నారా? ఎందుకో మరి?
సౌమ్యుడు, మంచి స్నేహితుడు: చలమలశెట్టి సునీల్
‘కాకినాడ నుంచి లోక్సభకు పోటీచేస్తున్న సునీల్ మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు’ అని జగన్ పరిచయం చేశారు. ఇద్దరి మధ్య అంత బంధానికి కారణాలేంటో కూడా కాస్త వివరంగా చెప్పి ఓట్లడిగితే.. ప్రజలంతా తెలుసుకునేవారు కదా? ఆయనకు చెందిన ఇంటిగ్రేటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు కర్నూలు జిల్లాలో 7,466 ఎకరాలను కేటాయించారు. ఎన్నికల కోడ్ వచ్చే కొద్దిరోజుల ముందు 1,985 ఎకరాలు గంపగుత్తగా అమ్మేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే కదా? పరిచయం చేసేటప్పుడే ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సింది.
మంచివాడు-2: వరుపుల సుబ్బారావు
‘ప్రత్తిపాడు నుంచి బరిలో ఉన్న సుబ్బారావు. పొట్టివాడైనా.. గట్టివాడు. మనసున్నవాడు’ అని సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. దళిత డ్రైవర్ను హత్యచేసి డోర్ డెలివరీ చేశారనే కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఈయనకు బంధువేనట కదా? సుబ్బారావు గెలుపు బాధ్యతలు ఆయనకే అప్పగించారంటున్నారు.. నిజమేనా? ఆ సంగతులేంటో ఓటర్లకు వివరించి చెప్పి ఉండాల్సింది. అక్రమ మైనింగ్తో రూ.కోట్లు కొట్టేస్తున్నదెవరో ఈ మనసున్న మనిషికి తెలుసేమో ఆరా తీయండి.
మంచివాడు-1: దవులూరి దొరబాబు
‘పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీలో ఉన్న దొరబాబు యువకుడు, ఉత్సాహవంతుడు. మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తున్నారు’ అని జగన్ కితాబిచ్చారు. అధికారపార్టీ అండగా అరాచకాలు చేస్తున్న నాయకులెవరో.. ఈ ఉత్సాహవంతుడికి ఏమైనా తెలుసేమో అడిగారా? అక్కడ జరిగే సెటిల్మెంట్ల వెనక ఎవరున్నారో, రామేశ్వరం మెట్టలో 826 ఎకరాల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేసిందెవరో కనుక్కోండి జగన్! స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండానే.. అధికారం చెలాయించే నాయకులూ ఈ నియోజకవర్గంలో ఉన్నారంట. వారెవరో కాస్త తెలుసుకుని ఓటర్లకు చెప్పండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ వైకాపా వస్తే మీ భూములు వదులు కోవాల్సిందే: చంద్రబాబు
నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
జగన్.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకు?: పవన్
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని జగన్కు అధికారం ఎందుకని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. -
గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ వాయిదా
గాజు గ్లాసు గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ తెదేపా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా?: చంద్రబాబు
జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయి -
వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్ కల్యాణ్
రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనా తెలిపారు. -
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. -
నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉంది: నితిన్ గడ్కరీ
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
ఐదేళ్లలో జగన్ అవినీతి రూ.8 లక్షల కోట్లు: తెదేపా నేత పట్టాభిరామ్
ఐదేళ్లలో వైఎస్ జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘నవ సందేహాల’ పేరుతో జగన్కు షర్మిల మరో లేఖ
‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. -
వైకాపా ప్రచారంలో ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు ఇంజిన్
దెందులూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు. -
చంద్రబాబు రోడ్షోలో వైకాపా కవ్వింపు చర్యలు
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన రోడ్షోలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. -
ప్రచారం పేరుతో.. కొడాలి నాని డబ్బుల పంపిణీ!
ఎన్నికల ప్రచారం పేరుతో గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు పంచుతున్నా నియమావళి అమలు కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ల పంపిణీలో మాజీ వాలంటీర్లు.. వైకాపాకు అనుకూలంగా ఓట్ల అభ్యర్థన!
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం మాజీ వాలంటీర్లు పింఛన్ల సొమ్మును పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. -
నీటి సమస్య మాటేంటి?.. వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డిని నిలదీసిన గ్రామస్థులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. -
పెద్దిరెడ్డి ప్రమేయంతో వైకాపా గూండాల దాడి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షగట్టి తన ఇంటిపై దాడికి వైకాపా గూండాలను పురికొల్పారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన పూర్వ జడ్జి ఎస్.రామకృష్ణ ఆరోపించారు. -
7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ
ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
తొడకొట్టి.. జోగి తనయుడి వీరంగం
మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడి రాజకీయాలు ప్రశాంతతకు నిలయమైన కృష్ణా జిల్లా పెనమలూరును దౌర్జన్యాలు, దాడులకు కేంద్రంగా మారుస్తున్నారు. -
ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించం
రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆయా లోక్సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకుగానీ, స్వతంత్ర అభ్యర్థులకుగానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించదు. -
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చా: అంబటి రాయుడు
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చినట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో జనసేన మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు.. వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ల తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాయుడు బుధవారం అవనిగడ్డ వచ్చారు.
తాజా వార్తలు
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా