icon icon icon
icon icon icon

Nitin Gadkari: నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉంది: నితిన్‌ గడ్కరీ

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

Published : 02 May 2024 14:07 IST

పార్వతీపురం: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. వీలున్న ప్రతి చోటా నీటిని సంరక్షించుకోవాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 90 శాతం ప్రజలు పల్లెల్లోనే ఉండేవారని.. ఇప్పుడు 30 శాతం మంది నగరాలకు వలస వెళ్తున్నారన్నారు. దీంతో పల్లెల్లో సాగు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి రూ.లక్షల కోట్లు చెల్లిస్తున్నట్లు నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img