Babar Azam: కెప్టెన్సీ నుంచి బాబర్ దిగిపోవాలన్న మాలిక్.. ఈ కామెంట్లు ఇప్పుడెందుకంటూ మరో దిగ్గజం ఆగ్రహం!
ఒకే ఒక్క ఓటమి (IND vs PAK) పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది. కొందరు అతడికి మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు సారథ్యం నుంచి దిగిపోవాలనే డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ సూచించగా.. మరో దిగ్గజ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ మాత్రం ఇలాంటి కామెంట్లు చేయడం సరైంది కాదని కొట్టిపడేశాడు. అదే సమయంలో వసీమ్ అక్రమ్ తీరును కూడా యూసఫ్ తప్పుబట్టాడు. పాకిస్థాన్ ఓటమిపై వేర్వేరు క్రీడా ఛానళ్లలో వీరిద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
బ్యాటింగ్పైనే బాబర్ దృష్టిపెట్టాలి: మాలిక్
‘‘బాబర్ అజామ్ తక్షణమే కెప్టెన్సీని వదులుకోవాలి. ఇదే విషయాన్ని ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూల్లోనూ చెప్పా. ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది. బ్యాటర్గా బాబర్ అజామ్ అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ వల్ల వ్యక్తిగతంగా, జట్టుకూ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే, కెప్టెన్సీని వదిలిపెట్టేసి బ్యాటింగ్పై దృష్టిపెట్టాలి. ఒకవేళ బాబర్ తన సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తే తర్వాత పాక్ వన్డే జట్టుకు షహీన్ను కెప్టెన్గా ఎంపిక చేయాలి. అయితే, ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దాని కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందని తెలుసు. కానీ, జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నాయకుడిగా బాబర్ దూకుడైన నిర్ణయాలు తీసుకోవడం విఫలమవుతున్నాడు. బ్యాటింగ్ నైపుణ్యాలతో తన నాయకత్వ పటిమను కలపడంలోనూ తేలిపోయాడు. చాలా కాలంగా కెప్టెన్సీ చేస్తున్నా ఇంకా మెరుగు కాలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించాడు.
వరల్డ్ కప్ మధ్యలో ఇలాంటివి ఎందుకు?: యూసఫ్
షోయబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై మహమ్మద్ యూసఫ్ స్పందించాడు. వరల్డ్ కప్ మధ్యలో ఇలాంటి కామెంట్లు చేయడం మంచిది కాదని.. అక్కడే వసీమ్ అక్రమ్ కూడా షోయబ్ను అడ్డుకోకపోవడం తనకు షాకింగ్గా అనిపించిందని వ్యాఖ్యానించాడు. ఇదే క్రమంలో మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ను ఉదాహరణగా పేర్కొన్నాడు.
‘‘వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ జరుగుతున్నప్పుడు కెప్టెన్ను నిరుత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు. మాజీ సారథి ఇమ్రాన్ నాయకత్వంలో పాక్ 1992లో విజేతగా నిలిచింది. అయితే, అంతకుముందు రెండుసార్లు (1983, 1987లో) విఫలమైన సంగతి గుర్తుంది కదా. ఇమ్రాన్ కూడా మూడో ప్రయత్నంలో పాక్ను ఛాంపియన్గా నిలిపాడు. నాణ్యమైన ఆటగాడిని సుదీర్ఘకాలం కెప్టెన్గా కొనసాగించడం ఉత్తమం. బాబర్ అద్భుతమైన సారథి. అతడిలో ఆ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయి. పీసీబీ ఛైర్మన్కు బంధువు కావడం వల్ల అతడేమీ కెప్టెన్గా ఎంపిక కాలేదు. బాబర్ మంచి సారథి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత్తో మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఓటమి గురించే మాట్లాడాలి. కానీ, కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని చెప్పడం ఏంటి? వసీమ్ అక్రమ్ అక్కడే ఉన్నా.. షోయబ్ వ్యాఖ్యలకు అడ్డు చెప్పకపోవడం నన్ను మరింత షాక్కు గురి చేసింది’’ అని యూసఫ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట