BCCI: టెస్టు మ్యాచ్లు ఆడితే అదనంగా రూ.45లక్షలు.. ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రకటించిన జైషా
టెస్టులపై ఆటగాళ్లలో ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం వల్ల ప్రతిఒక్కరూ టెస్టులు ఆడేందుకు ముందుకొస్తారని భావిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ(BCCI) చర్యలు చేపట్టింది. టీ20 లీగ్ల వైపు మొగ్గు చూపే క్రికెటర్లను అడ్డుకొనేందుకు తాజాగా ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. దీనికోసం రూ.40 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ప్లేయర్లు అందుకొన్న ఫీజుతోపాటు అదనంగా ప్రతీ టెస్టు మ్యాచ్కు ఇన్సెంటివ్గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకే ఇలాంటి స్కీమ్ను అమల్లోకి తెచ్చారు.
‘‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. టెస్టు క్రికెట్ ఆడేవారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముందడుగు వేశాం. 2022-23 సీజన్ నుంచే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చినట్లే. టెస్టు మ్యాచ్ ఆడే ప్లేయర్లకు అదనంగా భత్యాలను చెల్లిస్తాం. అది కనీసం రూ.15 లక్షలు ఉంటుంది’’ అని జై షా పోస్టు చేశారు. బీసీసీఐ కార్యదర్శి చేసిన పోస్టు ప్రకారం.. ఒక సీజన్లో కనీసం 50 శాతం కంటే మ్యాచుల్లో ఆడాల్సి ఉంటుంది. రిజర్వ్ బెంచ్కు పరిమితమైనప్పటికీ.. స్క్వాడ్కు ఎంపికైనా సరిపోతుంది. అంతకంటే తక్కువ ఆడితే మాత్రం ఎలాంటి అదనపు భత్యం దక్కదు.
ఉదాహరణకు.. ఒక సీజన్లో 9 టెస్టులు ఆడారనుకుందాం.. ఎవరైనా ఆటగాడు 4 అంతకంటే తక్కువ మ్యాచ్ల్లో పాల్గొంటే ఎలాంటి ఇన్సెంటివ్ రాదు. అదే 50 శాతం కంటే ఎక్కువ అంటే 5-6 టెస్టుల్లో ఆడితే ప్రతీ మ్యాచ్కు కనీసం రూ.15 లక్షలు దక్కుతాయి. తుది జట్టులో ఉంటే రూ.30 లక్షలు ఇస్తారు. ఒకవేళ 7 కంటే ఎక్కువ (75 శాతం) టెస్టుల్లో ఆడి తుది జట్టులో ఉంటే ప్రతీ మ్యాచ్కు రూ.45 లక్షలు దక్కుతాయి. రిజర్వ్బెంచ్కు పరిమితమైనా సరే రూ.22.5 లక్షలు వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!