Joe Root: ప్రస్తుత తరంలో ఈ ఇద్దరు భారత క్రికెటర్లే అత్యుత్తమం: జో రూట్
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరు? అని అడిగితే ఫలానా తమకిష్టమైన ఆటగాడి పేరును అభిమానులు చెబుతారు. అదే ఓ స్టార్ ప్లేయర్ను ఇదే ప్రశ్న అడిగితే ఏం చెబుతాడు? అనేది ఆసక్తికరం. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్కు ఈ ప్రశ్న ఎదురవగా దానికి సమాధానం ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లపై ఇంగ్లాండ్ ఆటగాడు జోరూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాళ్లని వ్యాఖ్యానించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఆడలేదు. మిగతా టెస్టులకూ అందుబాటులో ఉండటం కష్టమే. ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రాక్టీస్ కోసం అబుదాబి వెళ్లారు. మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో రూట్ మాట్లాడాడు.
‘‘టెస్టు సిరీస్లో భారత్ కూడా దూకుడుగానే ఆడుతోంది. విరాట్ కోహ్లీ జట్టులో లేకపోయినా టీమ్ఇండియా బలంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ ఆటగాళ్లు. అందులో ఎలాంటి సందేహం లేదు. జట్టులో సీనియర్లు అయిన వీరిద్దరూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తారు. వారు భారీ స్కోర్లు చేయకుండా ఆపేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాం. త్వరగా ఔట్ చేయగలిగితే దాదాపు మ్యాచ్పై పట్టు సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వారు ఒక్కసారి క్రీజ్లో కుదురుకుంటే ఆపడం చాలా కష్టం’’ అని వ్యాఖ్యానించాడు.
మిగతా టెస్టులకు విరాట్ లేకపోవడం లోటే: నాజర్ హుస్సేన్
‘‘తర్వాత మ్యాచ్లకు కూడా విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది తప్పకుండా భారత్కు నష్టమే అవుతుంది. కేవలం ఈ సిరీస్కు మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్కే లోటు. ఐదు టెస్టుల సిరీస్ ఎంతో ప్రత్యేకమైంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఎలా జరిగాయో మనం చూశాం. కనీసం చివరి టెస్టుకైనా కోహ్లీ వస్తాడని ఆశిస్తున్నా. దాదాపు 15 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న అతడికి వ్యక్తిగత జీవితం కోసం కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది’’ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తెలిపాడు.
భారత పేస్ బౌలింగ్పై కోహ్లీ ప్రభావం ఎక్కువ: ఫిలాండర్
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొమ్మిది వికెట్లతో అదరగొట్టాడు. ఇటీవల భారత్ పేస్ దళం బలంగా మారింది. దీనికి విరాట్ కోహ్లీ కూడా కారణమేనని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు వెర్నన్ ఫిలాండర్ వ్యాఖ్యానించాడు. ‘‘భారత్ ఎప్పుడు దక్షిణాఫ్రికాకు వెళ్లినా సరే మెరుగైన బౌలింగ్ ఎటాక్తో బరిలోకి దిగేది. ఉపఖండంలో వారి స్పిన్ను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ పేస్ బౌలింగ్కూ ఆదరణ రావడానికి కోహ్లీ నాయకత్వమే కారణం. ఉత్తమంగా రాణించేందుకు తన బౌలర్లలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతుంటాడు’’ అని ఫిలాండర్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!