IND vs PAK: భారత్ X పాక్ మ్యాచ్ హీట్.. వీరి మధ్య పోరే హైలైట్!
వన్డే సంగ్రామంలో భారత్ కీలక మ్యాచ్ ఆడేందుకు (IND vs PAK) సిద్ధమైంది. దాయాది దేశం పాక్తో తలపడనుంది. గత ఆసియా కప్లో పాక్ను చిత్తు చేసిన అనుభవం భారత్ సొంతం. ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్పై ఏడుసార్లు విజయం సాధించిన భారత్ ఇప్పుడు ‘8’పై కన్నేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) మరింత ఊపు తెచ్చే మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. శనివారం భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్లోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పోరు ఇంకా రసవత్తరంగా ఉండటం ఖాయం.
భారత ఓపెనర్లు X షహీన్ అఫ్రిది
భారత్, పాక్ మ్యాచ్ అనగానే మన బ్యాటింగ్కు వారి పేస్ దళానికి పోరాటంగానే చూస్తాం. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని అంతా భావిస్తున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడితోపాటు ఈసారి ఓపెనర్గా గిల్ వస్తాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డెంగీ కారణంగా గిల్ గత రెండు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. ఒకవేళ గిల్ ఆడలేకపోతే ఇషాన్ కిషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్లో అఫ్గాన్పై భారీ సెంచరీ చేసిన రోహిత్ను షహీన్ ఏమాత్రం అడ్డుకోగలడో చూడాలి. గతేడాది టీ20 వరల్డ్ కప్లో భారత బ్యాటింగ్ లైనప్ను షహీన్ బెదరగొట్టాడు. కానీ, ఇటీవల ఆసియా కప్లో పాక్పై 356/2 భారీ స్కోరు చేసిన భారత్.. పాక్ను 128 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్లో షహీన్ బౌలింగ్లో భారత్ బ్యాటర్లు చెలరేగిపోయారు. పది ఓవర్లలో వికెట్ మాత్రమే తీసి 79 పరుగులు సమర్పించాడు.
విరాట్ కోహ్లీ X హారిస్ రవూఫ్
విరాట్, హారిస్ మధ్య పోరంటే మనకు గతేడాది టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ గుర్తుకు రావడం సహజమే. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో రవూఫ్ను కోహ్లీ రఫ్పాడించాడు. పేస్కు అనుకూమైన ఆ పిచ్పైనా కీలకమైన సమయంలో వరుసగా రెండు సిక్స్లు కొట్టడం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఆసీస్పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి, ఈసారి కూడా రవూఫ్కు చెక్ పెట్టే సత్తా కోహ్లీకి ఉంది. వన్డౌన్లో వచ్చే కోహ్లీ సహజంగానే పాక్ బౌలింగ్లో శివాలెత్తుతాడు.
భారత పేస్ X బాబర్ అజామ్-రిజ్వాన్
భారత స్టార్ పేసర్ బుమ్రా ఈసారి వరల్డ్ కప్లో నిప్పులు చెరిగే బౌలింగ్తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా మరోసారి పాక్పైనా అదే దూకుడును కొనసాగించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక ఆ జట్టులో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, రిజ్వాన్ కీలక బ్యాటర్లు. వారితోపాటు సౌదీ షకిల్, అబ్దుల్లా కూడా ధాటిగా ఆడుతున్నారు. వీరిని ఎదుర్కోవాలంటే బుమ్రాతోపాటు సిరాజ్ లేదా షమీ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. మిడిల్ ఓవర్లలో పాండ్య కీలకం కానున్నాడు.
కుల్దీప్ X ఇఫ్తికార్-సౌద్ షకీల్
పాకిస్థాన్ టాప్ ఆర్డర్ను భారత పేసర్లు అడ్డుకోగలిగితే మ్యాచ్పై సగం పట్టు సాధించినట్లే. ఇక కీలకమైన మిడిలార్డర్ వంతు తేల్చాల్సిందే స్పిన్నర్లే. మంచి ఫామ్లో ఉన్న షకిల్తోపాటు ఇఫ్తికార్ అహ్మద్ను త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ భారత్ వశం కావడం సులువు కానుంది. గత ఆసియా కప్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో పాక్ నడ్డి విరిచిన కుల్దీప్ యాదవ్ మరోసారి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అతడితోపాటు రవీంద్ర జడేజా, అశ్విన్ కూడా తమవంతు భాగస్వామ్యం అందించాలి. పాక్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ను క్రీజ్లో కుదురుకోనీయకుండా చేయాలి. అప్పుడే పాక్ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
భారత మిడిలార్డర్ X పాక్ స్పిన్నర్లు
భారత మిడిలార్డర్ ఎంత పటిష్ఠంగా ఉందో గత రెండు మ్యాచుల్లో తెలిసింది. మరీ ముఖ్యంగా ఆసీస్పై టాప్ ఆర్డర్లోని ముగ్గురు బ్యాటర్లు డకౌట్గా పెవిలియన్కు చేరినా జట్టును విజయపథంలో నడిపించారు. దీనికి కారణం కేఎల్ రాహుల్ నిలకడైన ఆటతీరు. అతడితోపాటు శ్రేయస్ కూడా అఫ్గాన్పై ఫామ్లోకి రావడం భారత్కు శుభసూచికం. కానీ, అహ్మదాబాద్ కాస్త స్పిన్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాక్ స్పిన్నర్లు నవాజ్, షాదాబ్ ఖాన్తోపాటు పార్ట్టైమ్ బౌలర్ ఇఫ్తికార్ అహ్మద్ను ఎదుర్కోవడంలో జాగ్రత్త తీసుకోవాలి. వీరంతా భారత్తో మ్యాచ్ అంటేనే తమ పూర్తిస్థాయి శక్తియుక్తులను కూడదీసుకొని మరీ ఆడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!