ముంబయి విజయంతో..
డబ్ల్యూపీఎల్ గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్లో ముంబయి 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచింది. మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది.
ఓటమితో ఆర్సీబీ వీడ్కోలు
అమేలియా ఆల్రౌండ్ జోరు
డబ్ల్యూపీఎల్ గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్లో ముంబయి 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచింది. మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. ఆ జట్టులో ఎలీస్ పెర్రీ (29), రిచా ఘోష్ (29), స్మృతి మంధాన (24) మాత్రమే పర్వాలేదనిపించారు. అమేలియా కెర్ (3/22), నాట్ సీవర్ (2/24), ఇసీ వాంగ్ (2/26) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో 6 వికెట్లు కోల్పోయిన ముంబయి 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమేలియా (31 నాటౌట్) బ్యాట్తోనూ మెరిసింది. యాస్తిక (30) కూడా రాణించింది.
దూకుడుగా మొదలెట్టి..: ఓపెనర్లు హేలీ (24), యాస్తిక బౌండరీల వేటలో సాగడంతో స్వల్ప ఛేదనను ముంబయి దూకుడుగా మొదలెట్టింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో డివైన్ రెండు నోబాల్స్ వేయడంతో బతికిపోయిన హేలీ.. మధ్యలో వరుసగా 6, 4 బాదింది. యాస్తిక ఫోర్లతో చెలరేగడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. తొలి వికెట్కు హేలీ, యాస్తిక 53 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరితో పాటు సీవర్ (13), హర్మన్ప్రీత్ (2) వికెట్లు పడగొట్టిన ఆర్సీబీ మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చింది. 10 ఓవర్లకు 79/4తో నిలిచిన ముంబయిని.. పూజ (19) తోడుగా అమేలియా నడిపించింది. 16వ ఓవరో కనిక వరుస బంతుల్లో పూజ, వాంగ్ (0)ను ఔట్ చేసినా ముంబయికి ఇబ్బంది లేకపోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే జట్టును అమేలియా విజయతీరాలకు చేర్చింది.
అదే కథ..: డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో తమ చివరి మ్యాచ్లోనూ బ్యాటింగ్, బౌలింగ్లో ఆర్సీబీ వైఫల్యం కొనసాగింది. తొలి ఓవర్లోనే సోఫీ డివైన్ (0) అనవసరంగా రనౌటైంది. నెమ్మదిగా స్పందించిన పిచ్పై పరుగులు కష్టంగా వచ్చాయి. బౌండరీలతో మంధాన స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేసినా అమేలియా బంతి అందుకోగానే అంతా తారుమారైంది. వేగాన్ని తగ్గించి, ఊరించే బంతులతో ఆమె బ్యాటర్లను బుట్టలో వేసుకుంది. మంధాన, హెదర్ (12), కనిక (12)ను తన వరుస ఓవర్లలో ఔట్ చేసింది. 15 ఓవర్లకు స్కోరు 79/4. వరుసగా 4, 6తో రిచా దూకుడు ప్రదర్శించింది. కానీ ఒకే ఓవర్లో ఎలీస్, శ్రేయాంక (4)ను పెవిలియన్ చేర్చిన సీవర్ ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టింది. రిచా మెరుపుల కారణంగా ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
బెంగళూరు: 125/9 (ఎలీస్ పెర్రీ 29, రిచా 29, అమేలియా కెర్ 3/22, సీవర్ 2/24, వాంగ్ 2/26);
ముంబయి: 129/6 (అమేలియా నాటౌట్ 31, యాస్తిక 30, కనిక 2/5)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్. -
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్, శ్రేయస్పై వేటుపడిన సంగతి తెలిసిందే. -
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.