IND vs PAK: లక్ష గళాలు ఒక్కటై...
జాతీయ గీతం ఆలపిస్తుంటే సహజంగానే ఉద్వేగం పొంగుకొస్తుంది. అదే.. సుమారు లక్ష మంది కలిసి ‘జనగణమన’ అంటూ గొంతు కలిపితే.. ఆ శబ్దం చెవుల నుంచి నరాల్లోకి పారి రక్తాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. శరీరం ఊగిపోతుంది.
అహ్మదాబాద్
జాతీయ గీతం ఆలపిస్తుంటే సహజంగానే ఉద్వేగం పొంగుకొస్తుంది. అదే.. సుమారు లక్ష మంది కలిసి ‘జనగణమన’ అంటూ గొంతు కలిపితే.. ఆ శబ్దం చెవుల నుంచి నరాల్లోకి పారి రక్తాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. శరీరం ఊగిపోతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. హృదయం ఉప్పొంగిపోతుంది. శనివారం అదే జరిగింది. అటు నరేంద్ర మోదీ స్టేడియంలో జాతీయ గీతాలాపన చేస్తున్న ప్రేక్షకులు.. ఇటు టీవీల ముందు కూర్చున్న అభిమానులు ఇదే అనుభూతికి లోనయ్యారు. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియం వైపే అహ్మదాబాద్ దారులన్నీ. భారత్- పాక్ మెగా పోరును వీక్షించాలనే ఆత్రుతే అందరిలోనూ. దేశంలో ప్రపంచకప్ జరుగుతున్న వేళ.. అహ్మదాబాద్ క్రికెట్ జ్వరంతో ఊగిపోయింది. టీమ్ఇండియా జెర్సీలు, టోపీలతో స్టేడియం నీలి సంద్రంగా మారిపోయింది. త్రివర్ణ పతాకాలు సగర్వంగా రెపరెపలాడాయి. పాకిస్థాన్ వికెట్లు పడ్డప్పుడు.. మన బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదినప్పుడు స్టేడియం హోరెత్తింది. ‘భారత్ మాతా కీ జై’, ‘ఇండియా ఇండియా’ అనే నినాదాలతో మార్మోగింది. ‘‘ప్రపంచకప్ ఫైనల్ కంటే ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్ కోసం చండీగఢ్ నుంచి వచ్చాం. ఇది గెలిస్తే చాలు.. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓడినా పట్టించుకోం. ఈ గెలుపుతో ఇప్పుడే దీపావళి చేసుకుంటాం. 2011 మాయను మరోసారి భారత జట్టు పునరావృతం చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని డీపీ సింగ్ అనే అభిమాని చెప్పాడు. ‘‘నేను రాహుల్ ద్రవిడ్ వీరాభిమానిని. నాకు క్రికెట్పై ఉన్న ప్రేమను ఇష్టపడే ద్రవిడ్.. నాకు టికెట్లు ఇప్పించాడు’’ అని కోల్కతాకు చెందిన మనోజ్ జైస్వాల్ పేర్కొన్నాడు.
భారతీయులు, ఎన్నారైలతో పాటు అమెరికా, న్యూజిలాండ్ తదితర దేశాల అభిమానులు కూడా స్టేడియంలోకి అడుగుపెట్టేందుకు ఉదయం నుంచే ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ మ్యాచ్ కోసం విదేశీయుల కూడా భారీ సంఖ్యలో తరలిరావడం భారత్- పాక్ పోరుకు ఉన్న విశిష్టతను చాటేదే. ‘‘భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ నుంచి వచ్చాం. శుక్రవారమే ఇక్కడికి చేరుకున్నాం. మ్యాచ్లో భారత్కే మా మద్దతు. అందుకు టీమ్ఇండియా జెర్సీలు వేసుకున్నాం’’ అని ప్యాట్రిక్ అనే విదేశీయుడు చెప్పాడు. ఈ మ్యాచ్కు అయిదుగురు పాకిస్థాన్ పాత్రికేయులు కూడా హాజరయ్యారు. మ్యాచ్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా హోటల్ గదులు ఒక్క రాత్రి కోసం రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేశాయి. మరోవైపు మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్లో కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో కూడా భారత్- పాక్ సందడి కనిపించింది. పెద్ద తెరలు ఏర్పాటు చేసి మ్యాచ్ను ప్రసారం చేయడంతో అభిమానులు ఈ పోరును మరింతగా ఆస్వాదించారు. అలాగే క్రికెటర్ల పేర్ల మీద ఆహార పదార్థాలు, పాకిస్థాన్ వికెట్ పడ్డప్పుడల్లా ఉచితంగా మద్యం, ఆహారం.. భారత్ గెలవడంతో బిల్లులో పది శాతం రాయితీ లాంటివి అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు