IND vs PAK: పాకిస్థానా.. పసికూనా?
కానీ శనివారం పాక్ ఇంత ఘోరంగా ఆడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ మ్యాచ్కు రెండు జట్లూ పక్కా ప్రణాళికతోనే సిద్ధమై ఉంటాయి. కానీ ఆ ప్రణాళికల్ని అనుకున్న ప్రకారం మైదానంలో అమలు చేయడం, ఒత్తిడిని జయించడం కీలకం. ఈ విషయంలో రోహిత్ సేనకు నూటికి నూరు మార్కులు పడతాయి.
ఈనాడు క్రీడావిభాగం
పాకిస్థాన్తో పోలిస్తే బలహీనంగా ఉన్న రోజుల్లోనూ ప్రపంచకప్లో ఆ జట్టును ఓడించింది భారత్. 1992, 1996, 1999, 2003.. ఈ ప్రపంచకప్లు వేటిలోనూ భారత్.. పాక్ను ఓడిస్తుందని మ్యాచ్లకు ముందు మన అభిమానుల్లో ధీమా ఉండేది కాదు. కానీ ఆయా సమయాల్లో అన్నీ కలిసొచ్చి, కొందరు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలతో విజయాలు మన సొంతమయ్యాయి. కానీ 2011 నుంచి ప్రతిసారీ పాక్తో ప్రపంచకప్ మ్యాచ్ అంటే మనోళ్లే ఫేవరెట్లు. 2011లో కొంత పోటీ ఇచ్చిన చిరకాల ప్రత్యర్థి తర్వాతి రెండు టోర్నీల్లో భారత్ జోరును తట్టుకోలేకపోయింది. ప్రస్తుత మ్యాచ్లో అయితే రోహిత్ సేన ముందు బాబర్ బృందం ఓ పసికూనలా మారిపోయింది. రెండేళ్ల కిందట టీ20 ప్రపంచకప్లో పది వికెట్ల తేడాతో భారత్ను ఓడించిన పాకిస్థాన్ జట్టుకు, ప్రస్తుత జట్టుకు పెద్ద తేడా ఏమీ లేదు.
కానీ శనివారం పాక్ ఇంత ఘోరంగా ఆడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ మ్యాచ్కు రెండు జట్లూ పక్కా ప్రణాళికతోనే సిద్ధమై ఉంటాయి. కానీ ఆ ప్రణాళికల్ని అనుకున్న ప్రకారం మైదానంలో అమలు చేయడం, ఒత్తిడిని జయించడం కీలకం. ఈ విషయంలో రోహిత్ సేనకు నూటికి నూరు మార్కులు పడతాయి. పాక్ ఇక్కడే తడబడి.. కుప్పకూలిపోయింది. మ్యాచ్ను ఆరంభించిన తీరు.. సగం వరకు ఇన్నింగ్స్ను నడిపించిన తీరు చూస్తే.. భారత్ను ఎదుర్కోవడానికి బాగానే సన్నద్ధమైనట్లు కనిపించింది. ఇక ఒత్తిడంతా భారత్ మీదే అన్న భావన కలిగింది ఒక దశలో. కానీ ఇన్నింగ్స్కు ఇరుసులా వ్యవహరించిన బాబర్ ఔటవ్వగానే ఆ జట్టు కుదేలైపోయింది. బాబర్, రిజ్వాన్ల భాగస్వామ్యం విడిపోయే వరకు ఓపిగ్గా ఎదురు చూసిన భారత్.. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. వికెట్ పడ్డ ఊపులో దాడిని తీవ్రతరం చేసి పాక్ను కోలుకోలేని దెబ్బ తీసింది. గొప్పగా బౌలింగ్ చేసిన కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం పాక్కు తగిలిన అతి పెద్ద దెబ్బ. ఇక ఆరంభం నుంచి డాట్ బాల్స్తో పాక్ను ఒత్తిడిలోకి నెడుతూ వచ్చిన బుమ్రా.. రెండో స్పెల్లో రెండు మెరుపు బంతులతో చేయాల్సిన నష్టం చేసేశాడు. సరైన సమయంలో సిరాజ్కు రెండో స్పెల్కు దించి బాబర్ వికెట్ తీయడం.. ఆ వెంటనే బుమ్రాను రంగంలోకి దించి పాక్ను దెబ్బ కొట్టడం.. రోహిత్ నాయకత్వ పటిమకు రుజువులు. మూడో వికెట్ పడ్డాక భారత్ ముప్పేట దాడి చేసింది. నీలిరంగు జెర్సీలతో నిండిపోయిన స్టేడియాన్ని చూసి భారత జట్టు ఉత్తేజితమైతే.. పాక్ ఆ వాతావరణాన్ని చూసి మరింత ఒత్తిడిలో పడినట్లే కనిపించింది. తర్వాతి బ్యాటర్లలో ఒకరిద్దరు నిలబడి ఓ భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే.. మళ్లీ పాక్ పుంజుకునేదే. కానీ ఒత్తిడికి చిత్తయి ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరిపోవడంతో ఆ జట్టుకు అవకాశమే లేకపోయింది. కెప్టెన్సీతోనే కాక బ్యాటింగ్తోనూ ఎదురుదాడి మంత్రమే పఠించిన రోహిత్.. పాక్ కథ ముగించి ఈ మ్యాచ్లో హీరోగా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం