IND v ENG: ఉప్పల్ గుట్టు ఏమిటో?
‘‘ఉప్పల్ పిచ్ స్పిన్కు అనుకూలించొచ్చు. భారత్లో పరిస్థితులు ఇంగ్లాండ్కు సవాలే’’
‘‘ఉప్పల్ పిచ్ స్పిన్కు అనుకూలించొచ్చు. భారత్లో పరిస్థితులు ఇంగ్లాండ్కు సవాలే’’
టీమ్ఇండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
‘‘భారత్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాం’’
ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్
ఈనాడు - హైదరాబాద్
భారత్, ఇంగ్లాండ్ (IND v ENG) మధ్య అయిదు మ్యాచ్ టెస్టు సిరీస్కు ముందు ఇరు జట్ల శిబిరాల నుంచి దూసుకొచ్చిన మాటల అస్త్రాలివి! సొంతగడ్డపై సంప్రదాయ పిచ్లపై ఎదురులేని భారత్.. ‘బజ్బాల్’ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లాండ్ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికగా నిలువనున్న ఉప్పల్ స్టేడియం పిచ్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఉప్పల్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందా? బౌన్స్తో కూడిన పేస్కు సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది.
టెస్టుల్లో టీమ్ఇండియాకు కలిసొచ్చిన వేదికల్లో హైదరాబాద్ ఒకటి. ఉప్పల్ స్టేడియంలో అయిదు టెస్టులాడిన భారత్.. నాలుగింట్లో గెలుపొందింది. 2010లో న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టు డ్రా కాగా.. అనంతరం వరుసగా కివీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్లపై భారత్ విజయాలు నమోదు చేసింది. 2018లో ఉప్పల్లో చివరి సారిగా విండీస్తో టెస్టు జరిగింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లతో విజృంభించిన పేసర్ ఉమేశ్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఆ మ్యాచ్లో భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కలిసి 10 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు భారత్ గెలిచిన మూడు మ్యాచ్ల్లో మాత్రం స్పిన్నర్లదే సంపూర్ణ ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్! 2010లో మొదటి టెస్టు మినహాయిస్తే.. తర్వాత జరిగిన నాలుగింట్లోనూ అశ్విన్ ఆడటం.. అన్నింట్లోనూ భారత్ గెలవడం విశేషం. ఉప్పల్లో తిరుగులేని రికార్డు అశ్విన్ సొంతం. ఇక్కడ నాలుగు మ్యాచ్లాడిన అశ్విన్ మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. చెరో 15 వికెట్లతో రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ప్రజ్ఞాన్ ఓజా (9), హర్భజన్సింగ్ (7) కూడా ప్రభావం చూపారు.
మొత్తంగా ఉప్పల్ పిచ్పై స్పిన్ ఆధిపత్యం స్పష్టం. మొదటి రెండ్రోజులు బ్యాటర్లు, పేసర్లకు మధ్య మంచి పోరాటం కనిపిస్తుంది. కానీ మూడో రోజు నుంచి స్పిన్నర్లకు స్వర్గధామంగా మారుతుంది. ఇప్పటి వరకు ఉప్పల్లో జరిగిన మ్యాచ్లే ఇందుకు నిదర్శనం. నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. 2017 టెస్టులో బంగ్లా రెండో ఇన్నింగ్స్లో 250 పరుగులకు ఆలౌటవగా.. అశ్విన్, జడేజా నాలుగేసి వికెట్లతో తిప్పేశారు. 2013లో ఆసీస్ 131 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. అశ్విన్ 5, జడేజా 3 వికెట్లతో చెలరేగారు. 2012లో కివీస్దీ అదే పరిస్థితి. రెండో ఇన్నింగ్స్లో కివీస్ 164 పరుగులకే కుప్పకూలగా.. అశ్విన్ (6/54), ఓజా (3/48) ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమయ్యే తొలి టెస్టులోనూ స్పిన్నర్లదే హవా అనడంలో సందేహం లేదు. ఉప్పల్లో అత్యంత విజయవంతమైన అశ్విన్.. జడేజా ద్వయంతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టులో ఉన్నారు. సొంతగడ్డపై భారత్ ఎక్కువ శాతం ముగ్గురు స్పిన్నర్ల వైపే మొగ్గుచూపుతుంది. అశ్విన్, జడేజాతో పాటు కుల్దీప్ లేదా అక్షర్ బరిలో దిగడం దాదాపు ఖాయమే! ‘బజ్బాల్’తో పేసర్లపై విరుచుకుపడే ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోవాలంటే స్పిన్నాస్త్రమే సరైందని భారత జట్టు మేనేజ్మెంట్ కూడా భావిస్తోంది. మరి ఉప్పల్ వేదికగా ‘బజ్బాల్ × స్పిన్నాస్త్రం’ పోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి