Sunil Gavaskar: 23 ఓవర్లకే అలసిపోతారా..
కొన్ని రోజుల క్రితం సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లుగానే రంజీ ట్రోఫీలో ఆడలేదనే కారణంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు.
సునీల్ గావస్కర్
కొన్ని రోజుల క్రితం సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లుగానే రంజీ ట్రోఫీలో ఆడలేదనే కారణంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. రంజీల్లో జార్ఖండ్కు ఇషాన్ ఎందుకు ఆడలేదన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు సెమీస్ కోసం ముంబయి జట్టుతో శ్రేయస్ చేరాడు. భారత జట్టు మేనేజ్మెంట్ సూచన మేరకు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందూ అతను రంజీ మ్యాచ్ ఆడాడు. అంటే రంజీల్లో ఆడేందుకు అతనెప్పుడూ నిరాకరించలేదు. క్వార్టర్స్ మ్యాచ్కు దూరమయ్యాడు సరే.. కానీ అతను వెన్నెముక నొప్పితో ఇంగ్లాండ్తో మూడో టెస్టులోనూ ఆడలేనని చెప్పాడు. ఎన్సీఏలోని శిక్షకులు మాత్రం శ్రేయస్ మ్యాచ్ ఫిట్నెస్తోనే ఉన్నాడని పేర్కొన్నారు. ఇదే అతనికి ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. నొప్పి తీవ్రత అనేది వ్యక్తిగతమైంది. దీన్ని ఏ శిక్షకుడు కూడా నిర్ధరించలేడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 15, రెండో ఇన్నింగ్స్లో 8 ఓవర్లే వేసినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాంచి మ్యాచ్కు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రెండో, మూడో టెస్టుకు మధ్య 9 రోజులు విరామం వచ్చిందనే విషయం మర్చిపోవద్దు. దీని తర్వాత టెస్టులో 23 ఓవర్లే వేయడం అంటే అలసిపోయినట్లు కానేకాదు. మరి అలాంటప్పుడు బుమ్రాకు ఎందుకు విశ్రాంతినిచ్చారు? నాలుగో టెస్టు తర్వాత చివరి మ్యాచ్కు ముందు మరో 8 రోజుల వ్యవధి ఉంది. అత్యుత్తమ ఫిట్నెస్తో ఉన్న అథ్లెట్లకు తిరిగి కోలుకుని, దేశం కోసం ఆడేందుకు సిద్ధమవడానికి ఈ సమయం సరిపోతుంది. నాలుగో టెస్టు కూడా కీలకమైందే. ఇందులో ఇంగ్లాండ్ గెలిచి ఉంటే సిరీస్ ఫలితం నిర్ణయాత్మక పోరుకు మళ్లేది. విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయం ఎన్సీఏ లేదా బుమ్రా.. ఎవరు తీసుకున్నా ఇది భారత జట్టు ఆసక్తికి సంబంధించింది కాదు. యువ పేసర్ ఆకాశ్దీప్ అద్భుత బౌలింగ్తో బుమ్రా లేని లోటు లేకుండా చేశాడు. పెద్ద ఆటగాళ్లు ఆడకపోయినా యువ క్రికెటర్లు సంతోషంగా బాధ్యతలు తీసుకుంటారని మరోసారి చాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లు.. భారత్కు ఆడాలనే ఆకలితో ఉండాలి. ఆ గౌరవం కోసం ఎంతటి భారమైనా మోయాలి. ఇక ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఇప్పటివరకూ అద్భుతంగా సాగింది. అమోఘమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలతో ఇది క్రికెట్పై ఆసక్తి పెంచింది. ఇంగ్లాండ్ దూకుడైన బ్యాటింగ్, ఎదురుదాడితో సాగుతోంది. భారత్ మాత్రం సంప్రదాయ బ్యాటింగ్తో రాంచి టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగుల ఆధిక్యమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్, ధ్రువ్ జూరెల్ సంకల్పంతో భారత్ సిరీస్లో 3-1తో ఆధిక్యం సంపాదించింది. భారత్లో క్రికెట్ నైపుణ్యాలకు కొదవలేదనే దానికి రాంచి టెస్టే రుజువు. 2021 బ్రిస్బేన్ టెస్టులో మాదిరే రాంచి టెస్టులోనూ పెద్ద ఆటగాళ్లు లేకుండానే భారత్ ఆడింది. ఏ బాధ్యతలైనా తీసుకుంటామని, ఎంతటి భారమైనా మోస్తామని యువ ఆటగాళ్లు చాటారు. అనుభవం లేని ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించిన నాయకులకూ ఘనత దక్కాలి. ప్రధాన ఆటగాళ్ల ఖాళీలను యువ క్రికెటర్లు భర్తీ చేసేలా ప్రోత్సహించడంతో పాటు వీళ్లపై నమ్మకముంచారు. అంచనాలకు మించి రాణించిన ఈ ఆటగాళ్లు చిరస్మరణీయ విజయాలు సాధించారు. ఒత్తిడితో కంటే ఆస్వాదిస్తూ ఆడటంతో విజయాలు దక్కుతాయి. బ్రిస్బేన్, రాంచిలో జరిగిన సిరీస్ల్లోని నాలుగో టెస్టు మ్యాచ్లు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగినవి. దేశంపై ప్రేమ.. సవాళ్లను ఎలా అధిగమించిదనేందుకు ఈ విజయాలు నిదర్శనం. ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అక్కడి (ధర్మశాల) పరిస్థితులు భారత్ కంటే ఇంగ్లాండ్కే నప్పేలా ఉన్నాయి. బంతి ఎక్కువగా స్వింగ్, సీమ్ అవుతుంది. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న నేపథ్యంలో ఈ నామమాత్రమైన మ్యాచ్ను భారత్ తేలికగా తీసుకోవచ్చనే ఆలోచనలున్నాయి. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్నూ గెలుస్తూ, పాయింట్లు సాధించడం ముఖ్యం. కాబట్టి ఈ మ్యాచ్ను తేలికగా తీసుకునే ఛాన్స్ లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!