జడ్డూ..పాండ్య.. కుల్చా.. చీకటి వెలుగుల కథ!
క్రికెట్ చాలా విచిత్రమైన ఆట! ఇది ఎప్పుడూ చెప్పే మాటే. కానీ ప్రతి సందర్భానికీ నప్పే మాట! ఎంతమంది అందుబాటులో ఉన్నా జట్టులోకి తీసుకొనేది 11 మందినే. అందుకే ఒకరి అవకాశం మరొకరికి...
ఒకరి ఆనందం మరొకరికి తీరని ఆవేదన
క్రికెట్ చాలా విచిత్రమైన ఆట! ఇది ఎప్పుడూ చెప్పే మాటే. కానీ, ప్రతి సందర్భానికీ నప్పే మాట! ఎంతమంది అందుబాటులో ఉన్నా జట్టులోకి తీసుకొనేది 11 మందినే. అందుకే ఒకరి అవకాశం మరొకరికి అశనిపాతమవుతుంది. పరిస్థితులను దారుణంగా మార్చేస్తుంది. ఐదేళ్లుగా ఐదుగురితో క్రికెట్ ఇలాగే ఆడుకుంటోంది. ఒక్కోసారి ఆనందాన్ని మరోసారి ఆవేదనను పంచుతోంది. ఆ ఐదుగురు ఎవరు? వారి చీకటి వెలుగుల కథ ఏంటి? తెలుసుకోవాలని ఉందా?
పాండ్యతో.. టర్నింగ్
హార్దిక్ పాండ్య.. టీమ్ఇండియా ఎన్నాళ్లుగానో వెతుకుతున్న పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్తో దుమ్మురేపుతున్న అతడిని చూసి దేశమంతా గర్వించింది. అదే సమయంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ మణికట్టు మాంత్రికులుగా స్థిరపడిపోయారు. దూకుడుగా బంతులేస్తూ వికెట్లు తీస్తున్న వారిని చూసి జట్టు యాజమాన్యం మురిసిపోయింది. సమతూకం దొరికిందని ఆనందపడింది. అదే సమయంలో ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు యువ ఆటగాడు అక్షర్పటేల్ తనకెప్పుడు చోటు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. పరిస్థితులు తారుమారయ్యాయి. జడ్డూ, అక్షర్ ఇప్పుడు దుమ్మురేపుతున్నారు. కుల్దీప్, చాహల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్వర్ణదశ పోయి గడ్డుకాలం అనుభవిస్తున్నారు.
టీ20ల్లో దక్కని చోటు
2016, జనవరి 26న ఆస్ట్రేలియాపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు హార్దిక్. వరుసగా 16 టీ20లు ఆడాడు. పనిభారం దృష్ట్యా ఆ తర్వాత అతడికి విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో జడ్డూకు కొన్ని మ్యాచుల్లో చోటు దక్కలేదు కానీ, 17 టీ20లు ఆడటం గమనార్హం. ఆ తర్వాత అతడి కెరీర్లో చీకటి రోజులు మొదలయ్యాయి. 2017లో వెస్టిండీస్తో తొలి టీ20 ఆడిన జడ్డూ ఇక పొట్టి క్రికెట్లో కనిపించలేదు. దాదాపు 33 టీ20ల్లో అతడిని దూరం పెట్టారు. అంటే 2017, జులై నుంచి 2019, ఆగస్టు వరకు కనిపించనే లేదు. ఈ సమయంలో పాండ్య ఏకంగా 24 టీ20లు ఆడటం గమనార్హం. మళ్లీ పాండ్య గాయపడే వరకు జడ్డూకు చోటు దొరకలేదు. 2019లో 6, 2020లో 4 మ్యాచులు ఆడాడు.
వన్డేల్లోనూ అంతే..
వన్డేల్లోనూ ఇదే సన్నివేశం పునరావృతమైంది. 2016లో ఆసీస్పై వరుసగా ఐదు వన్డేలు ఆడిన జడ్డూకు జింబాబ్వే, న్యూజిలాండ్ సిరీసుల్లో చోటు దక్కలేదు. 2017లో ఇంగ్లాండ్తో 3, ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచుల్లో అవకాశం దక్కింది. విండీస్లో ఐదు వన్డేలకు ఆఖరి రెండింట్లో చోటిచ్చారు. 50 ఓవర్ల ఫార్మాట్లో అతడిని చూడటం అదే ఆఖరు. 2017 జులై నుంచి 2018 సెప్టెంబర్ వరకు 27 వన్డేల్లో అతడికి అవకాశం రాలేదు. పాండ్య గాయపడటం వల్లే 2018 ఆసియాకప్లో చోటు దొరికింది. ఆ తర్వాత కివీస్ సిరీసుకు పక్కన పెట్టేశారు. ఆసీస్పై 5 వన్డేల్లో నాలుగింట్లో అవకాశం ఇచ్చారు. పాండ్యకు తుది జట్టులో చోటివ్వడంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019లో జడ్డూకు కేవలం రెండింట్లోనే అదృష్టం వరించింది. గాయం వల్ల ఆ తర్వాత పాండ్య 12 వన్డేలు ఆడకపోవడంతో జడ్డూ పునరాగమనం చేశాడు. ఆసీస్పై 3 వన్డేలాడిన జడ్డూకు టెస్టు సిరీసులో గాయం అవ్వడంతో ఇంటికొచ్చేశాడు. ఇంగ్లాండ్ సిరీసుకు దూరమయ్యాడు. అందులో పునరాగమనం చేసిన పాండ్య బ్యాటుతో ఆకట్టుకున్నా.. ఆల్రౌండర్గా సేవలు అందించలేదు.
నిద్రలేని రాత్రులు.. ఆపై విజయం
జట్టులో అవకాశాలు లేకపోవడం.. బయట నుంచి విమర్శలు రావడంతో జడ్డూ నిద్రలేని రాత్రులు గడిపాడు. మైదానంలో చిరుతలా పరుగెత్తే అతడికి పడకపై ఉదయం 3-4 వరకు కంటిమీద కునుకు ఉండేది కాదు. తుది జట్టులో చోటు ఎలా దక్కుతుంది? అందుకోసం ఏం చేయాలన్న తపనతోనే ఉండేవాడు. హార్దిక్ పాండ్య గాయపడటంతో జట్టులోకి వచ్చిన జడ్డూ ఆ తర్వాత రెచ్చిపోయాడు. బంతితో వికెట్లు తీయడం.. పరుగులు నియంత్రించడమే కాకుండా బ్యాటుతో మెరుపులు మెరిపించాడు. వేగంగా అర్ధశతకాలు బాదుతూ.. సిక్సర్లు కొడుతూ.. ‘బిట్స్ అండ్ పీసెస్’ విమర్శకులకు దీటుగా జవాబిచ్చాడు. బ్యాటుతో కత్తిసాము చేస్తూ ఆకట్టుకున్నాడు.
2019లో వన్డేల్లో 9 ఇన్నింగ్సుల్లోనే 34.33 సగటుతో 206 పరుగులు చేశాడు. ప్రపంచకప్ సెమీస్లో కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో అతడి తెగువను, ఆటను ఎంత ప్రశంసించినా తక్కువే. రాహుల్, కోహ్లీ, రోహిత్ ఒక్క పరుగుకే ఔటై కష్టాల్లో పడ్డ వేళ.. మహీ (50; 72 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి జడ్డూ (77; 59 బంతుల్లో 4×4, 4×6) చేసిన పరుగులు, నెలకొల్పిన భాగస్వామ్యం ఎంతో విలువైనవి. దాదాపు అతడు మ్యాచును గెలిపించినంత పనిచేశాడు. 2020లో 7 ఇన్నింగ్సుల్లోనే 55.75 సగటుతో 223 పరుగులు చేసి జడ్డూ తన చోటుకు ఢోకా లేకుండా చేసుకున్నాడు. ఈడెన్ పార్క్లో కివీస్పై 55, ఆసీస్పై మనుక ఓవల్లో 66*తో అదరగొట్టాడు. ఇక 2019లో 12, 2020లో 7 వికెట్లు పడగొట్టడం గమనార్హం.
‘కుల్చా’ స్వర్ణయుగం
ఏడాది వ్యవధిలో టీమ్ఇండియాలో అడుగుపెట్టారు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్. కుడి.. ఎడమ కూర్పు.. ఒకరిది చైనామన్ శైలి కావడం.. ఊరించే బంతులతో వికెట్లు తీస్తూ మణికట్టు ద్వయంగా జట్టులో స్థిరపడిపోయారు. ‘కుల్చా ఎఫెక్ట్’ ధాటికి ప్రత్యర్థులు నిజంగానే వణికిపోయారు. వారి బౌలింగ్లో ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. దాంతో ఈ జోడీకిక తిరుగులేదనే అంతా భావించారు. పాండ్య పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావడం, వీరిద్దరూ స్పిన్నర్లు కావడంతో జట్టుకు ఇక ఫింగర్ స్పిన్నర్లతో అవసరం లేకుండా పోయింది. 2017-2019 వరకు వీరిది స్వర్ణయుగమే అనాలి. ఎంఎస్ ధోనీ వికెట్ల వెనకాల సలహాలు ఇవ్వడం.. ఫీల్డర్లను మోహరించడం.. వ్యూహాలు రచించడంతో వీరి జోడీ హిట్టయ్యింది. అటువైపు జడ్డూకు నిద్రలేని రాత్రులు కొనసాగాయి.
పాండ్య గాయం.. ధోనీ పోకతో..
మూడు ఫార్మాట్లలో 91 మ్యాచులాడిన కుల్దీప్ 170 వికెట్లు తీశాడు. 2017లో 24 మ్యాచుల్లో 43; 2018లో 31 మ్యాచుల్లో 76; 2019లో 26 మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో 102 మ్యాచులాడిన చాహల్ 154 వికెట్లు తీశాడు. 2017లో 25 మ్యాచుల్లో 44; 2018లో 30 మ్యాచుల్లో 47; 2019లో25 మ్యాచుల్లో 37 వికెట్లు తీశాడు. కానీ ధోనీ వెళ్లిపోగానే వీరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. హఠాత్తుగా ఫామ్ కోల్పోయారు. 2020, 21లో వీరి ప్రదర్శన పేలవం. పాండ్య స్థానంలో వచ్చిన జడ్డూ స్పిన్నర్ కావడం.. వీరిని తీసుకుంటే సమతూకం కుదరకపోవడంతో క్రమంగా చోటు దక్కని పరిస్థితికి చేరుకున్నారు. ఎడమచేతి వాటమే కావడం.. ఫింగర్ స్పిన్నర్ ఆల్రౌండరే కావడంతో అక్షర్ పటేల్కూ ఇన్నాళ్లూ చోటుదొరకలేదు. జడ్డూ దూరమైన ఇంగ్లాండ్ సిరీసులో అతడు తన రెండు చేతులతో అవకాశం ఒడిసిపట్టడం మనందరికీ తెలిసిందే.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్స్మిత్.. కోల్కతా ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine)పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు క్రీజులో కుదురుకుంటే ప్రమాదకరంగా మారతాడని పేర్కొన్నాడు. -
Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు