Bengaluru X Hyderabad: ఆకట్టుకున్న బెంగళూరు పోరాటం.. హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది.
బెంగళూరు: ఐపీఎల్ 2024లో హైదరాబాద్ (Hyderabad) హ్యట్రిక్ విజయం నమోదు చేసింది. బెంగళూరు(Bengaluru)ను వారి సొంతగడ్డపై 25 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 287/3 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో బెంగళూరు గట్టిగానే పోరాడింది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) (83; 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్లు) వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. డుప్లెసిస్ (Faf Du Plessis) (62; 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు), విరాట్ కోహ్లీ కోహ్లీ (Virat Kohli) (42; 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ మూడు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. మయాంక్ మార్కండే రెండు, నటరాజన్ ఒక వికెట్ తీశారు.
డీకే మెరిపించినా
లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ధనాధన్ ఆటతో మెరుపు ఆరంభానిచ్చారు. వీరిద్దరూ చెలరేగడంతో పవర్ ప్లే ముగిసేసరికి 79/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాత బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీని మార్కండే ఏడో ఓవర్లో క్లీన్బౌల్డ్ చేశాడు. వీల్ జాక్స్ (7), రజత్ పటీదార్ (9) ఇలా వచ్చి అలా వెళ్లారు. కమిన్స్ ఒకే ఓవర్లో డుప్లెసిస్, సౌరభ్ చౌహన్ (0)ను వెనక్కి పంపాడు. దీంతో 10 ఓవర్లకు బెంగళూరు 122/5 స్కోరుతో నిలిచి కష్టాల్లో పడింది. ఈ దశలో మహిపాల్ లామ్రోర్ (19), అనుజ్ రావత్ (25*; 14 బంతుల్లో 5 ఫోర్లు) సాయంతో దినేశ్ కార్తిక్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కమిన్స్ వేసిన 17 ఓవర్లో తొలి బంతికి డీకే సిక్సర్ బాది హాఫ్ సెంచరీ (23 బంతుల్లో) అందుకున్నాడు. నటరాజన్ వేసిన 19 ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ బాది సెంచరీ చేసేలా కనిపించిన కార్తిక్.. అదే ఓవర్లో ఐదో బంతికి వికెట్ కీపర్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చాడు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 44 రన్స్ అవసరం కావడంతో హైదరాబాద్ విజయం ఖాయమైపోయింది. చివరి ఓవర్లో అనుజ్ రావత్ నాలుగు ఫోర్లు బాదాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (102; 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్లు) వీరవిహారం చేశాడు. వన్డౌన్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (67; 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లు) సిక్సర్ల వర్షం కురిపించాడు. ట్రావిస్ హెడ్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు మరో 19 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 23 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. చివర్లో అబ్దుల్ సమద్ (37*; 10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ రికార్డు స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో ఫెర్గుసన్ 2, టాప్లే ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?