చాహర్ అద్భుతం.. భారత్ ఘన విజయం
దీపక్ చాహర్ మాయ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ను సొంతం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ
ఇంటర్నెట్డెస్క్: దీపక్ చాహర్(69 నాటౌట్; 82 బంతుల్లో 7x4, 1x6) మాయ చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేశాడు. భువనేశ్వర్ కుమార్(19; 28 బంతుల్లో 2x4)తో కలిసి భారత్కు ఊహించని విజయం అందించాడు. దాంతో గబ్బర్సేన మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్లో గెలుపొందడమే కాకుండా 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన చాహర్, భువనేశ్వర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వికెట్లు కాపాడుకుంటూ చివరి వరకూ క్రీజులో పాతుకుపోయారు. ఈ క్రమంలోనే చాహర్ 64 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివరికి 49.1 ఓవర్కు విన్నింగ్ షాట్ కొట్టి భారత్కు మరిచిపోలేని విజయం అందించాడు. అంతకుముందు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ (53: 44 బంతుల్లో 4X6), కృనాల్ పాండ్యా (35: 54 బంతుల్లో 3X4) రాణించారు. అయితే, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా(13), శిఖర్ ధావన్(29), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు. మధ్యలో మనీశ్ పాండే (37; 31 బంతుల్లో 3x4) ఉన్నంతసేపు బాగా ఆడినా అనుకోని పరిస్థితుల్లో ఔటయ్యాడు.
ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (50; 71 బంతుల్లో 4x4, 1x6), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ చారిత్ అసలంక (65; 68 బంతుల్లో 6x4) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నె(44 నాటౌట్; 33 బంతుల్లో 5x4) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి ఆతిథ్య జట్టుకు మంచి స్కోర్ అందించాడు. మరోవైపు ఈ మ్యాచ్లోనూ లంక ఓపెనర్లు ఫెర్నాండో, భానుక (36; 42 బంతుల్లో 6x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడి తొలి వికెట్కు 77 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరిని చాహల్ విడదీశాడు. 14వ ఓవర్లో వరుస బంతుల్లో భానుకతో పాటు వన్డౌన్ బ్యాట్స్మన్ రాజపక్స(0)ను ఔట్ చేశాడు. దాంతో భారత్కు ఉపశమనం కలిగించాడు. తర్వాత ధనంజయ (32; 45 బంతుల్లో 1x4)తో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ 47 పరుగులు జోడించాక ఫెర్నాండో ఔటయ్యాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్నాక భువనేశ్వర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. కాసేపటికే ధనంజయ సైతం ఔటయ్యాడు. అప్పటికి శ్రీలంక స్కోర్ 134/4గా నమోదైంది.
ఈ నేపథ్యంలోనే మరోసారి జోడీ కట్టిన అసలంక, కెప్టెన్ దాసున్ షనక (16; 24 బంతుల్లో 1x4) నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, చాహల్ బౌలింగ్లో షనక బౌల్డయ్యాక.. కాసేపటికే హసరంగా(8)ను దీపక్ చాహర్ బోల్తా కొట్టించాడు. ఆపై అసలంక, కరుణరత్నె మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 50 పరుగులు జోడించారు. అయితే, చివర్లో అసలంక ధాటిగా ఆడే క్రమంలో భువి బౌలింగ్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ దేవ్దత్ చేతికి చిక్కాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసిన కరుణరత్నె చివరివరకు బ్యాటింగ్ చేశాడు. దాంతో శ్రీలంకకు మరోసారి విలువైన పరుగులు అందించాడు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్. -
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్, శ్రేయస్పై వేటుపడిన సంగతి తెలిసిందే. -
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్