Ravindra Jadeja: నువ్వూ-నేనూ రజనీనే.. మీసం ఒక్కటే తేడా: అశ్విన్‌తో జోడీపై జడేజా

టీమ్‌ఇండియా స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా - రవిచంద్రన్‌ అశ్విన్ ఇటీవల అరుదైన ఘనత సాధించారు. అత్యధిక వికెట్లు తీసిన జోడీగా నిలిచారు.

Updated : 17 Mar 2024 15:27 IST

ఇంటర్నెట్ డెస్క్: రవిచంద్రన్ అశ్విన్‌ వంద టెస్టులు ఆడిన భారత క్రికెటర్. సుదీర్ఘ ఫార్మాట్‌లో 500+ వికెట్లు తీశాడు. తమిళనాడు క్రికెట్ సంఘం అతడిని సన్మానించింది. ఈ క్రమంలో తన బౌలింగ్‌ జోడీపై ప్రశంసలు కురిపిస్తూ భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరూ కలిసి దాదాపు 500+ వికెట్లు తీశారు. అనిల్‌ కుంబ్లే - హర్భజన్‌ సింగ్ రికార్డును అధిగమించారు. 

‘‘హాయ్‌ అశ్విన్ అన్న. వందో టెస్టులు ఆడటం.. 500 వికెట్లు తీసినందుకు శుభాకాంక్షలు. ఎంతో ఆనందంగా ఉంది. భారత క్రికెట్‌కు చేసిన సేవలు అద్వితీయం. భవిష్యత్తులోనూ వికెట్లు తీస్తూనే ఉండాలి. నీ మాస్టర్‌మైండ్‌తో నాకూ సూచనలు ఇస్తూనే ఉండాలి. నేను కూడా మరికొన్ని వికెట్లు తీసి నీ స్థాయికి చేరతా. ఈ సందర్భంగా నాకు ఓ సినిమా గుర్తుకొస్తోంది. మన ఇద్దరి పేర్లు ఒకటే. నేను రవి ఇంద్రన్‌.. నువ్వు రవి చంద్రన్. ఒకరేమో మీసమున్న ఇంద్రన్. మీసం లేని చంద్రన్’’ అని జడ్డూ వ్యాఖ్యానించాడు. 1981లో వచ్చిన రజనీకాంత్‌ సినిమా థిల్లు - ముల్లు క్యారెక్టర్లను జడేజా గుర్తు చేశాడు.


కోహ్లీ కావాల్సిందేనన్న రోహిత్‌: కీర్తి ఆజాద్

టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ తప్పకుండా జట్టులో ఉండాలని రోహిత్ శర్మ గట్టిగా పట్టుబడుతున్నట్లు మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వెల్లడించాడు. ‘‘విరాట్ గురించి జైషాను రోహిత్ శర్మ పట్టుబట్టాడు. ఎలాగైనా సరే కోహ్లీని ఆడించాలని కెప్టెన్ భావిస్తున్నాడు. జట్టు సెలక్షన్‌కు ముందే విరాట్ ఆడటంపై అధికారికంగా ప్రకటన చేయించాలని హిట్‌మ్యాన్‌ భావిస్తున్నట్లు సమాచారం’’ అని కీర్తి ఆజాద్ పోస్టు పెట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని