WI vs IND: అలా చేసినా నష్టం లేదు.. ఇక్కడెవరికీ గర్వం లేదు: జడేజా
భారత జట్టులో (Team India) ప్రయోగాలపై సర్వత్రా ఆందోళన నెలకొన్న వేళ.. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే కపిల్ దేవ్ చేసిన ‘ఆటగాళ్లలో గర్వం’ వ్యాఖ్యలపైనా జడ్డూ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో వన్డే సిరీస్ (WI vs IND) విజేతను తేల్చే కీలక పోరుకు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం..) మ్యాచ్ జరగనుంది. గత రెండు వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో ప్రయోగాలు చేసిన భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది. తొలి వన్డేలో శ్రమించి విజయం సాధించగా.. రెండో వన్డేలో బొక్కబోర్లా పడింది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) లేకుండానే రెండో వన్డేలో భారత్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ ఆర్డర్లోనూ భారీగా మార్పులు చేసింది. తాజాగా ఇదే అంశంపై టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. ఇలాంటి మార్పులు చేయడం వల్ల పెద్దగా నష్టం ఉండదని పేర్కొన్నాడు. అదే విధంగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన ఆటగాళ్లలో ‘గర్వం’ వ్యాఖ్యలపైనా స్పందించాడు.
హెచ్సీఏ పెద్దలకు షాక్.. 57 క్లబ్లపై వేటు
‘‘ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ముందు మేం ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే. దీనిని ప్రయోగాలకు వేదికగా చేసుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మార్పులు చేశాం. మెగా టోర్నీల్లో ఎక్కువగా ప్రయోగాలు చేసే ఆస్కారం ఉండదు. అలా చేయలేం. రెండో వన్డేలో సీనియర్లు ఇద్దరు లేకుండానే బరిలోకి దిగాం. ఫలితం ఎలా ఉన్నా.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసేందుకు ప్రయత్నించాం. అయితే, ఈ కారణంగా మ్యాచ్ ఓడిపోయినా నష్టం ఏమీ ఉండదు. మెగా టోర్నీల్లో ఎలాంటి కాంబినేషన్తో వెళ్లాలనే దానిపై ఓ అవగాహన వస్తుంది. ఈ విషయంలో ఏం చేయాలనేది మేనేజ్మెంట్, కెప్టెన్కు తెలుసు. కాబట్టి, ఎలాంటి గందరగోళం లేదు. ఆటగాడిగా ప్రతి మ్యాచ్ ఆడాలని నాకూ ఉంటుంది. అయితే, జట్టు అవసరాలనుబట్టి కొత్త ప్లేయర్ను తీసుకోవాలని అనుకుంటే.. దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటా.
బుమ్రా వచ్చేశాడు.. ఐర్లాండ్తో టీ20లకు సారథ్యం
వెస్టిండీస్ జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉన్నారు. నిరంతరం నేర్చుకుంటూ మెరుగవుతున్నారు. ఎక్కువగా ఆడుతూ ఉంటే మరింత నాణ్యమైన జట్టుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. వారిలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. టీమ్ఇండియా నుంచి తప్పకుండా మరిన్ని విషయాలను నేర్చుకుంటారు. మంచి భవిష్యత్తు ఉంది. టీమ్ఇండియాలోని ప్రతి ఆటగాడు చాలా శ్రమిస్తాడు. ఎవరూ కూడా సునాయాసంగా అవకాశం వచ్చిందని భావించరు. వందశాతం కష్టపడతారు. అయితే, ఓడిపోయినప్పుడే వారి ప్రదర్శనపై ప్రశ్నలు వస్తాయి. ఇక కపిల్ దేవ్ ఎప్పుడు మాట్లాడారో నాకు తెలియదు. అయితే, క్రికెట్ దిగ్గజం తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది. అయితే జట్టులో ఎవరికీ గర్వం లేదని మాత్రం చెప్పగలను’’ అని జడేజా తెలిపాడు. వన్డేల్లో 200 వికెట్ల మైలురాయి చేరుకునేందుకు జడేజాకు ఆరు వికెట్లు అవసరం. అలాగే కపిల్ తర్వాత వన్డేల్లో 2000 పరుగులతో పాటు 200 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా జడేజా నిలుస్తాడు. ప్రస్తుతం 176 వన్డేల్లో 2,552 పరుగులు, 194 వికెట్లతో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ