ICC : ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్‌-2లో మనోళ్లే.!

ఐసీసీ తాజాగా ఆటగాళ్ల ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో టెస్టు ఆల్ రౌండర్ల కేటగిరీలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. వెస్టిండీస్‌ ఆల్ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ని వెనక్కినెట్టి....

Published : 31 Mar 2022 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఐసీసీ తాజాగా ఆటగాళ్ల ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో టెస్టు ఆల్ రౌండర్ల కేటగిరీలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. వెస్టిండీస్‌ ఆల్ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ని వెనక్కినెట్టి.. టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానం దక్కించుకున్నాడు. జేసన్ హోల్డర్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరోవైపు, టెస్టు ర్యాంకింగ్‌ బ్యాటింగ్‌ కేటగిరీలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (754 పాయింట్లతో) ఎనిమిదో స్థానం, విరాట్‌ కోహ్లీ (742 పాయింట్లతో) పదో స్థానానికి పడిపోయారు. బౌలర్ల విభాగంలో అశ్విన్‌ రెండు, బుమ్రా నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా, వన్డే ర్యాంకింగ్స్‌లో మాత్రం కోహ్లీ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. 811 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. కెప్టెన్‌ రోహిత్ శర్మ (794 పాయింట్లతో) నాలుగో స్థానం దక్కించుకున్నాడు. పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజామ్ (872 పాయింట్లతో) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బౌలర్లలో భారత్‌ నుంచి బుమ్రా ఒక్కడే టాప్‌ -10లో నిలిచాడు. 679 పాయింట్లతో అతడు ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని