Praveen Kumar: గూగుల్లో శోధించి.. పారాలింపిక్స్లో రజతం ముద్దాడి..!
బాల్యం నుంచీ ఆటలే ప్రాణంగా పెరిగాడు. వైకల్యం ఉందని తెలిసినా ముందుకే సాగాడు. ఆటల్లో రాణించగలడా తన బడిలో అనుమానించినా పట్టుదల ప్రదర్శించాడు....
ఇంటర్నెట్ డెస్క్: బాల్యం నుంచీ ఆటలే ప్రాణంగా పెరిగాడు. వైకల్యం ఉందని తెలిసినా ముందుకే సాగాడు. ఆటల్లో రాణించగలడా తన బడిలో అనుమానించినా పట్టుదల ప్రదర్శించాడు. గూగుల్లో పారాలింపిక్స్ గురించి తెలుసుకొని నేడు రజత పతకం పొందాడు. అతడే పారా హైజంపర్ ప్రవీణ్ కుమార్. 18 ఏళ్లకే పతకం ముద్దాడి సరికొత్త ఘనత అందుకున్నాడు.
దిల్లీలోని గౌతమబుద్ధనగర్ జిల్లాలోని జెవర్ సమీప గ్రామంలో ప్రవీణ్ కుమార్ జన్మించాడు. అతడి తండ్రి రైతు. వారిది పేద కుటుంబం. చిన్నప్పటి నుంచీ ప్రవీణ్కు ఆటలంటే ప్రాణం. వైకల్యం ఉన్నప్పటికీ అందులోనే ఆనందం వెతుక్కొనేవాడు. అలాంటిది ఇప్పుడు టీ64/టీ44 విభాగంలో పురుషుల హైజంప్లో 2.07మీ మీటర్లు దూకి ఏకంగా రజతం ముద్దాడాడు.
‘నేను బడికెళ్లే రోజుల్లో ఆటలే ప్రాణంగా బతికాను. కానీ ఈ స్థాయికి వస్తానని మాత్రం ఊహించలేదు. మొదట్లో నేను పాఠశాలలో వాలీబాల్ ఆడేవాడిని. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్ గురించి తెలుసుకొని హై జంప్ ఎంచుకున్నాను. నిజానికి గూగుల్లో శోధించిన తర్వాతే పారాలింపిక్స్ గురించి తెలుసుకున్నాను’ అని ప్రవీణ్ అన్నాడు.
తాను ఈ స్థాయికి రావడానికి గురువులే కారణమని ప్రవీణ్ పేర్కొన్నాడు. ‘నేను జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనప్పుడు అశోక్ సైని సర్ను కలిశాను. ఆయన నాకు సత్యపాల్ సర్ ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆయనను కలిశాక నేను ఏ విభాగంలో పోటీపడొచ్చో వివరించారు. నన్ను శిష్యుడిగా స్వీకరించారు. ఇదంతా 2018లో జరిగింది’ అని అతడు తెలిపాడు.
అంతర్జాతీయ క్రీడల్లో ప్రవీణ్ రెండేళ్ల కిందటే అరంగేట్రం చేశాడు. అతడు విశ్వ వేదికల్లో పోటీపడతానంటే చదువుకున్న పాఠశాల వారే నమ్మలేదు. 2019, జూనియర్ పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్లో రజతం గెలిచాక వారు అండగా నిలిచారు. ఈ ఏడాది దుబాయ్లో పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో స్వర్ణం గెలిచాడు.
శుక్రవారం పారాలింపిక్స్ హైజంప్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం కాస్త తగ్గినట్టు అనిపించిందని ప్రవీణ్ తెలిపాడు. ‘రెండో దఫాలో 1.97 మీటర్లు ఎగిరినప్పుడు నా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంది. 2.01 మీటర్లు దూకిన తర్వాత పుంజుకున్నాను. ఏదేమైనా అత్యుత్తమంగా ఆడాలని అనుకున్నాను. 2.10 మీటర్లు ఎగిరినప్పుడు ఒత్తిడికి గురయ్యా. ల్యాండింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని అతడు పేర్కొన్నాడు.
కరోనా మహమ్మారి వల్ల ప్రవీణ్ ఇబ్బందులు పడ్డాడని కోచ్ సత్యపాల్ తెలిపాడు. హైజంప్లో ల్యాండయ్యే సమయంలో భారీ దిండ్లు అవసరమని పేర్కొన్నాడు. స్టేడియాలు మూసేయడంతో సాధన సరిగ్గా చేయలేకపోయాడని వెల్లడించాడు. పైగా కరోనా బారిన పడ్డాడని వివరించాడు. ప్రవీణ్ పొడగరి కావడం, ఒక కాల్లో కండరాలు బలంగా ఉండటం కలిసొచ్చిందని పేర్కొన్నాడు. పారిస్ ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డులో స్వర్ణం సాధించడమే తమ తర్వాతి లక్ష్యమని ఆయన ప్రకటించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్. -
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్, శ్రేయస్పై వేటుపడిన సంగతి తెలిసిందే. -
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.