Virat Kohli vs Joe Root: లాంగ్రూమ్లో తిట్టేసుకున్న కోహ్లీ, రూట్..
భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టుకు ముందు ఓ సంచలన విషయం తెలిసింది. దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ, ప్రశాంతంగా కనిపించే జో రూట్ తీవ్ర వాగ్వివాదానికి పాల్పడారని సమాచారం....
బృందాలుగా దూషించుకున్న ఆటగాళ్లు
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టుకు ముందు ఓ సంచలన విషయం తెలిసింది. దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ, ప్రశాంతంగా కనిపించే జో రూట్ తీవ్ర వాగ్వివాదానికి పాల్పడ్డారని సమాచారం. రెండో టెస్టులో విజయం సాధించిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. అంతేకాదు.. రెండు జట్ల ఆటగాళ్లు గుంపులు గుంపులుగా చేరి ఒకర్నొకరు దూషించుకున్నారని తెలుస్తోంది.
ఇదంతా లార్డ్స్ టెస్టు మూడో రోజు నుంచి మొదలైంది. తొలి ఇన్నింగ్స్లో రూట్ అజేయంగా 180 పరుగులు చేశాడు. అప్పుడు ఆఖరి బ్యాట్స్మన్గా వచ్చిన అండర్సన్కు బుమ్రా షార్ట్పిచ్ బంతులు వేశాడు. గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసరడంతో కొన్ని అతడి దేహానికి తగిలాయి. జట్టు ఆలౌట్ కాగానే అండర్సన్.. బుమ్రాను బూతులతో దూషించాడు. అక్కడి నుంచి రెండు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
నిజానికి బుమ్రా పది బంతుల ఓవర్ ముగిశాక రెండు జట్ల ఆటగాళ్లు బృందాలుగా విడిపోయి లార్డ్స్ లాంగ్రూమ్లో తిట్టుకున్నారని డైలీ టెలిగ్రాఫ్లో ఓ కథనం వచ్చింది. అదే సమయంలో రెండు జట్ల కెప్టెన్లు విరాట్కోహ్లీ, జో రూట్ నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధంలో తలపడ్డారట. ఒకర్నొకరు కవ్వించుకున్నారని తెలిసింది.
లార్డ్స్ లాంగ్రూమ్ను పవిత్రంగా భావిస్తారు! ఎందుకంటే మాజీ క్రికెటర్లు ఇక్కడకు వస్తుంటారు. మ్యాచును వీక్షిస్తుంటారు. కరోనా నిబంధనల వల్ల మాజీలను లాంగ్ రూమ్లోకి అనుమతించడం లేదు. దాంతో మైదానం నుంచే పరస్పరం దూషించుకుంటూ వచ్చిన ఆటగాళ్లు.. లాంగ్రూమ్లో బహిరంగంగా తిట్టుకున్నారట. మరింత రెచ్చిపోయారట. భోజనం చేసేటప్పుడూ ఇదే వాతావరణం కనిపించిందని తెలిసింది.
చివరికి ఈ వ్యవహారాలన్నీ టీమ్ఇండియాకే కలిసొచ్చాయి. ఆఖరి రోజు బుమ్రా, షమి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో కోహ్లీసేనకు భారీ స్కోరు లభించింది. అప్పటికే జరిగిన సంఘటనలతో కసితో ఉన్న ఆటగాళ్లు ఆంగ్లేయులకు నరకం చూపించేందుకు సిద్ధమయ్యారు. కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్ చేసేసి 151 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే