IND vs AUS: జడేజా స్పెల్ అద్భుతం.. కానీ ఆసీస్ ఓటమికి అసలైన కారణం మరొకటి: మాజీ సెలెక్టర్
వరల్డ్ కప్లో (ODI World Cup 2023) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ (IND vs AUS) విజయం సాధించి అద్భుత బోణీ కొట్టింది. ఆసీస్ మాత్రం తన స్థాయి దూకుడును ప్రదర్శించడంలో విఫలమైందని మాజీ సెలెక్టర్ వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) తొలి మ్యాచ్లో భారత్ విజయానికి విరాట్ కోహ్లీ - కేఎల్ రాహుల్ (Virat Kohli - KL Rahul) బ్యాటింగ్ ప్రదర్శన కీలకం. అంతకుముందు ఆస్ట్రేలియాను (IND vs AUS) భారత బౌలర్లు సమష్ఠిగా రాణించి అడ్డుకున్నారు. మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా అద్భుతమైన స్పెల్తో ఆసీస్ను కట్టడి చేశాడు. టీమ్ఇండియా గెలవడానికి కొన్ని కారణాలను వెల్లడించిన మాజీ సెలెక్టర్ సబా కరీం.. ఆసీస్ ఓడిపోవడానికి కూడా ఆ జట్టు దృక్పథమే కారణమని వ్యాఖ్యానించాడు. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితంపై విశ్లేషించాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంది..
భారత సారథి రోహిత్ శర్మ తన బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్ వేయించి ఫలితం రాబట్టాడు. రవీంద్ర జడేజా స్పెల్ మరింత స్పెషల్. లెంగ్త్, వేరియేషన్, లైన్కు కట్టుబడి బంతులను సంధించాడు. చాలా రోజుల వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టిన అశ్విన్కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ ఎటాక్ను రోహిత్ నడిపించిన తీరు బాగుంది.
బుమ్రాను మరవొద్దు
ముగ్గురు స్పిన్నర్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కీలక పాత్ర పోషించాడు. మిచెల్ మార్ష్ను ఔట్ చేసిన బుమ్రా భారత్కు శుభారంభం అందించాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్తో పునారగమనం చేసిన బుమ్రా తక్కువ వ్యవధిలోనే సెట్ అయిపోయాడు. అయితే, అతడి పని ఒత్తిడిని తట్టుకొనేలా చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది. అతడి శరీరంపై అధికంగా భారం మోపకుండా చూడాలి. టోర్నీ ఆసాంతం బుమ్రా ఇదే ఊపును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా.
మరీ రక్షణాత్మకంగా ఆసీస్ బ్యాటింగ్
ఆస్ట్రేలియా ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం వారి ఆటతీరే. వన్డే ప్రపంచకప్లో అదీనూ భారత్పై ఆడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దూకుడును ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ, ఆసీస్ ఆటగాళ్ల ఆటలో రక్షణాత్మక ధోరణి ఎక్కువైంది. డిఫెన్సివ్ గేమ్ ముఖ్యమే కానీ శ్రుతిమించిన డిఫెన్సివ్ ఆటతీరును ప్రదర్శించారు. చెన్నై పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురైనట్లు అనిపించింది. ఒకవేళ వారు కాస్త దూకుడుగా ఆడినా కనీసం 260-270 పరుగులైనా చేసేవారే. అప్పుడు మ్యాచ్ ఇంకాస్త ఆసక్తికరంగా మారేది’’ అని సబా కరీం వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్