Virat Kohli : ఆటలోనూ కింగే.. నాయకత్వంలోనూ తిరుగులేని రికార్డులే
టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన మూడేళ్లకే నాయకత్వం వహించే స్థాయికి...
టెస్టు ఫార్మాట్ కెప్టెన్గా వైదొలిగిన విరాట్
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు జట్టులోకి అరంగేట్రం (2011) చేసిన మూడేళ్లకే నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. అత్యంత వేగంగా 23వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2014లో ఎంఎస్ ధోనీ గాయపడటంతో తొలిసారిగా సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. అదీనూ ఆసీస్ గడ్డపై. విదేశాల్లో టెస్టు సిరీస్లను అందించిన విరాట్ కోహ్లీ తన చివరి సారథ్య బాధ్యతలకూ వీడ్కోలు పలికేశాడు. ఆటలోనూ, కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండే కోహ్లీ భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
- భారత టెస్టు జట్టు సారథిగా కోహ్లీ 68 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. అందులో 40 విజయాలు నమోదు కాగా.. 17 టెస్టుల్లో ఓటమి, మరో 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
- 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం ముగ్గురు మాత్రమే విరాట్ కంటే కెప్టెన్గా అధిక విజయాలను నమోదు చేశారు. గ్రేమీ స్మిత్ (దక్షిణాఫ్రికా) 109 మ్యాచుల్లో 53 విజయాలు. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 77 మ్యాచుల్లో 48 విజయాలు. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) 57 మ్యాచుల్లో 41 విజయాలు.
- ముఖ్యంగా తొలిసారి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్ గడ్డ మీదనే విరాట్ సిరీస్ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇగ్లాండ్ మీద ఆధిక్యత ప్రదర్శించడం మరొక ఎత్తు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం సాధించాలనే కోరిక అలానే మిగిలిపోయింది.
- ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు విదేశీ మైదానాల్లో టెస్టు విజయాలను నమోదు చేసిన అరుదైన ఘనతను కోహ్లీ రెండు సార్లు అందుకున్నాడు. గతేడాది బ్రిస్బేన్, లార్డ్స్, ఓవల్, సెంచూరియన్ స్టేడియాల్లో విజయం సాధించగా.. 2018లో జోహెన్నెస్బర్గ్, నాటింగ్హామ్, అడిలైడ్, మెల్బోర్న్ మైదానాల్లో టీమ్ఇండియా గెలిచింది.
- సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA ) జట్ల మీద ఎక్కువ విజయాలను నమోదు చేసిన ఆసియా ఖండానికి చెందిన సారథి కూడా విరాట్ కోహ్లీనే. 23 మ్యాచుల్లో ఏడు విజయాలను నమోదు చేయగా.. 13 పరాజయాలు, మూడు డ్రాగా ముగిశాయి.
- దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ మైదానంలో (2021-22) విజయం సాధించిన ఏకైక ఆసియా సారథి కోహ్లీ.. అంతేకాకుండా అంతర్జాతీయంగా మూడో కెప్టెన్. 2000వ సంవత్సరంలో ఇంగ్లాండ్ సారథి నాస్సర్ హుస్సేన్, 2014లో ఆస్ట్రేలియా కెప్టెన్ మైకెల్ క్లార్క్ మాత్రమే అక్కడ విజయాలను నమోదు చేశారు.
- దాదాపు 42 నెలల పాటు విరాట్ నాయకత్వంలోని టీమ్ఇండియా టెస్టు జట్టు నంబర్వన్ ర్యాంక్లో కొనసాగింది. అక్టోబర్ 2016 నుంచి మార్చి 2020 వరకు భారత్దే నంబర్ వన్ ర్యాంక్. ఆ తర్వాత కిందికి దిగజారినా.. ప్రస్తుతం కోహ్లీ గుడ్బై చెప్పే నాటికి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా మళ్లీ నంబర్వన్కు చేరుకుంది.
- విరాట్ నాయకత్వంలోని టీమ్ఇండియా తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. అయితే తుది పోరులో కివీస్ చేతిలో ఓటమిపాలైంది. క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో విజయాలతో భారత్ను డబ్ల్యూటీసీ ఫైనల్కు చేర్చాడు.
- స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్గానూ విరాట్ రికార్డు సృష్టించాడు. మన దేశంలో 24 టెస్టుల్లో, విదేశాల్లో 16 టెస్టు విజయాలతో గత సారథులకు అందనంత ఎత్తులో కోహ్లీ ఉన్నాడు.
- విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 99 టెస్టుల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బ్యాటింగ్లో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. అందులో 27 శతకాలు, 28అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 254 నాటౌట్. ఇక టెస్టు కెప్టెన్గా 5,864 పరుగులు చేయడం విశేషం.
- టెస్టుల్లో కెప్టెన్గా ఆడిన మొదటి మూడు మ్యాచ్ల్లోని తొలి ఇన్నింగ్స్ల్లో శతకాలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు