Kohli-Abd: మన బంధం విడదీయరానిది బ్రదర్.. ‘ఐ లవ్ యూ’: విరాట్ కోహ్లీ
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ ఆటకే....
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ ఆటకే వీడ్కోలు చెబుతున్నట్లు ‘మిస్టర్ 360’ ఇవాళ ప్రకటించాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సహ ఆటగాళ్లు. వీరిద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం విడదీయరానిది. దీంతో ఏబీడీ తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘ఈ నిర్ణయం నా మనస్సును ఎంతో గాయపరిచింది. వ్యక్తిగత జీవితం, కుటుంబం కోసం సమయం కేటాయించేందుకు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందేనని అనుకుంటున్నా. ఐ లవ్ యూ బ్రదర్ ఏబీడీ. మన తరంలో నువ్వు అత్యుత్తమ ఆటగాడివి. నేను కలిసిన వారిలో స్ఫూర్తివంతమైన వ్యక్తివి నువ్వే. ఆర్సీబీ కోసం నువ్వు చేసిన, అందించిన సహకార పట్ల ఎప్పుడూ నువ్వు గర్విస్తావని భావిస్తున్నాను బ్రదర్. మన అనుబంధం ఆటలోనే కాదు.. ఎల్లవేళలా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
2004లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన ఏబీ డివిలియర్స్ దాదాపు 14 ఏళ్లపాటు జాతీయ జట్టుకు సేవలందించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే జట్టు అవసరంరీత్యా 2019 వన్డే ప్రపంచకప్కు అందుబాటులో ఉండాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కోరినా.. ఏబీడీ అంగీకరించలేదు. తన స్థానంలో యువకులను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే మరికొంతకాలం టీ20 లీగుల్లో ఆడతానని అప్పుడే వెల్లడించాడు. ఇప్పుడు ఆటకే వీడ్కోలు పలకడంతో ఏబీడీని ఆటగాడిగా కాకుండా వేరే పాత్రలో చూసే అవకాశం ఉండొచ్చు. 2011 నుంచి గత ఐపీఎల్ వరకు ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టుకు ఆడాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీకి ఎదురు దెబ్బ తగిలినట్లే. మైదానంలో నలువైపులా షాట్లు కొట్టగలిగే ఏబీడీ క్రీజ్లో ఉన్నాడంటే ప్రత్యర్థికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 2011, 2016లో ఆర్సీబీ ఫైనల్కు చేరడంలో కోహ్లీ, ఏబీడీ కీలక పాత్ర పోషించారు. అయితే టైటిల్ను సాధించాలనే కల నెరవేరకుండానే ఏబీడీ ఆటకు వీడ్కోలు చెప్పడం సగటు ఆర్సీబీ జట్టు అభిమానిని బాధ పెట్టే అంశం.
ఏబీడీ సాధించిన గణాంకాలు ఇవే..
* 114 టెస్టుల్లో 8,765 పరుగులు. అందులో 22 శతకాలు, 46 అర్ధశతకాలు. బ్యాటింగ్ సగటు 50.68. అత్యధిక స్కోరు 278 నాటౌట్ (అబుదాబి వేదికగా పాకిస్థాన్పై)
* 228 వన్డేల్లో 25 శతకాలు, 53 అర్ధశతకాలతో 9,577 పరుగులను 53.50 సగటుతో సాధించాడు. అత్యధిక స్కోరు 176 (బంగ్లాదేశ్పై)
* 78 టీ20ల్లో 1,672 పరుగులు. పది అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 26.14. అత్యధిక స్కోరు 79 నాటౌట్ (స్కాట్లాండ్ మీద)
* వన్డేల్లో అత్యధిక వేగవంతమైన అర్ధశతకం: 16 బంతుల్లో (విండీస్పై)
* వన్డేల్లో అత్యధిక వేగవంతమైన శతకం: 31 బంతుల్లో (విండీస్పై)
* ఐపీఎల్: 184 మ్యాచుల్లో 5,162 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలు, 40 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 133 నాటౌట్
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్. -
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్, శ్రేయస్పై వేటుపడిన సంగతి తెలిసిందే. -
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం