Virat Kohli: టీ20 ప్రపంచ కప్.. కోహ్లీని పక్కనపెడతారా?
Virat Kohli - T20 World Cup: టీమ్ఇండియా కింగ్ విరాట్ కోహ్లీని పొట్టి క్రికెట్ ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశాలు లేవా? యువ ఆటగాళ్ల కోసం అతడిని పక్కనపెడతారా?
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ టోర్నీ (T20 Worlcup 2024) మరికొన్ని నెలల్లో జరగనుంది. ఈక్రమంలో జట్టులో ఎవరుంటారు, ఎవరుండరు అనే విషయంలో చర్చలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. గత కొంతకాలంగా టీమ్ఇండియా (Team India)కు, ముఖ్యంగా టీ20లకు దూరంగా ఉన్న మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)ని జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనేదే ఇప్పుడు చర్చ. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం విరాట్ను పక్కనపెడతారన్న కథనాలు వినిపిస్తున్నాయి.
టీమ్ఇండియా సీనియర్లు కెప్టెన్ రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు ఏడాదిపాటు అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్లో మూడు మ్యాచ్ల సిరీస్కు జట్టులో చేరారు. టోర్నీలో రోహిత్ శతకంతో అదరగొట్టగా.. కోహ్లీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. అఫ్గాన్తో తొలి టీ20కి దూరమైన విరాట్.. రెండో మ్యాచ్లో 29 పరుగులు చేశాడు. మూడో గేమ్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో పొట్టి ప్రపంచకప్లో వీరిద్దరికి చోటు కల్పించడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా ప్రపంచకప్లో తలపడుతుందని చెప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. కోహ్లీ గురించి స్పష్టత ఇవ్వలేదు. దీని గురించి తర్వాత చర్చిస్తామని అన్నారు. దీంతో టీ20 ప్రపంచకప్లో విరాట్ స్థానంపై సందిగ్ధం నెలకొంది. ఈక్రమంలోనే తుది నిర్ణయాన్ని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీకి బీసీసీఐ వదిలేసినట్లు తెలుస్తోంది.
అఫ్గాన్తో టీ20 సిరీస్ సమయంలో కోహ్లీతో అగార్కర్ మాట్లాడినట్లు సమాచారం. టీ20ల్లో మరింత దూకుడుగా ఆడాలని అతడికి సూచించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం రాబోయే ప్రపంచకప్లో విరాట్ను పక్కనపెట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కోహ్లీకి నచ్చజెప్పే బాధ్యతను అగార్కర్కు బోర్డు అప్పగించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఒకవేళ, కోహ్లీని జట్టులోకి తీసుకోకపోతే.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి వారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
ఐపీఎల్పై ఆధారపడి..
కోహ్లీపై ఎంపిక కమిటీ ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఐపీఎల్లో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉందని సమాచారం. గతేడాది ఐపీఎల్లో కోహ్లీ 639 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన అతడు.. త్వరలోనే ఆర్సీబీ క్యాంప్లో చేరతాడని తెలుస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో 4,037 పరుగులతో కోహ్లీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత 3,974 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్