IND vs PAK: విభిన్న జెర్సీతో పాక్పై భారత్ బరిలోకి దిగనుందా..? బీసీసీఐ ఏం చెప్పిందంటే?
టీమ్ఇండియా (Team India) జెర్సీ బ్లూ. కానీ, వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్తో మ్యాచ్లో మరొక జెర్సీతో బరిలోకి దిగనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటిపై బీసీసీఐ అధికారికంగా స్పందించడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లోనే (ODI World Cup 2023) అత్యంత ప్రజాదరణ కలిగిన మ్యాచుల్లో దాయాదుల పోరు కచ్చితంగా ఉంటుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్కు టీమ్ఇండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగుతుందనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత బ్లూ జెర్సీతో మ్యాచ్లను ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రాక్టీస్ సందర్భంగా డచ్ ఆరెంజ్ రంగులోని జెర్సీని భారత ఆటగాళ్లు ధరిస్తూ ఉన్నారు. పాక్తో మ్యాచ్ సందర్భంగా ఇదే జెర్సీతో టీమ్ఇండియా ఆడుతుందనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. తాజాగా ఇలాంటి వాటిపై బీసీసీఐ అధికారికంగా కీలక ప్రకటన జారీ చేసింది. అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది.
‘‘వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ జట్టు ఒక మ్యాచ్ కోసం ప్రత్యామ్నాయ కిట్ను ధరించడం ఉండదు. ఇలాంటి సోషల్ మీడియా కథనాలను ఖండిస్తున్నాం. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా.. ఊహాగానాలతో పోస్టులు చేయడం సరైంది కాదు. ‘ది మెన్ ఇన్ బ్లూ’ భారత క్రీడారంగానికి సంబంధించిన రంగు. ఐసీసీ వరల్డ్ కప్లోనూ ఇదే జెర్సీతో ఆడతాం’’ అని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, ఐసీసీ 2019 వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యామ్నాయ జెర్సీతో భారత్ ఆడింది. అప్పుడు ఇరు జట్లవీ బ్లూ కలర్లోనే ఉండేవి. దీంతో భారత్ బ్లూ డార్క్ షేడ్ షర్ట్కు ఆరెంజ్ స్లీవ్తో కూడిన జెర్సీతో బరిలోకి దిగింది. ఇప్పుడు టీమ్ఇండియా - పాక్ మ్యాచ్కు అలాంటి అవకాశాలు లేవు.
చెన్నైలో జార్వో ప్రత్యక్షం..
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో జార్వో ప్రత్యక్షమయ్యాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన డేనియల్ జార్విస్ ఇంగ్లాండ్ - భారత్ టెస్టు సిరీస్ సందర్భంగా బ్యాటర్ అవతారం ఎత్తి టీమ్ఇండియా జెర్సీతో క్రీజ్లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ కోసం ఇక్కడికి రావడమే కాకుండా వీఐపీ ప్రదేశంలో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఇదే అంశంపై ఐసీసీ అధికారిక ప్రతినిధి స్పందించారు. ‘‘ఈ టోర్నీలో మిగతా మ్యాచ్లకు హాజరు కాకుండా అతడిపై నిషేధం విధించాం. ఇప్పుడంతా భారత అధికారుల చేతుల్లోనే ఉంది. జార్వోను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది’’ అని వెల్లడించారు. జార్వోపై ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ మైదానాల్లో రాకుండా బ్యాన్ విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..