ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం.
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. మరి మొబైల్ ఫోన్లలో రేడియో ఛానెళ్ల మాదిరిగా టీవీ ఛానెళ్లనూ చూస్తే? అదీ ఇంటర్నెట్ అవసరం లేకుండా. అలాంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి.
మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ప్రసారాలను ఆస్వాదిస్తూనే ఉన్నాం. వీటి తరహాలోనే టీవీ కార్యక్రమాలూ ప్రసారమయ్యే రోజులు త్వరలోనే సాకారం కానున్నాయి. ఇందుకు డైరెక్ట్-టు-మొబైల్ (డీ2ఎం) పరిజ్ఞానం వీలు కల్పించనుంది. దీని ప్రయోగ పరీక్షలను 19 పట్టణాల్లో ప్రారంభించనున్నట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. దీంతో ఇంటర్నెట్ సదుపాయం లేకుండానే మొబైల్ ఫోన్లలో వీడియో కార్యక్రమాలను చూడొచ్చు. ఐఐటీ కాన్పుర్, సాంఖ్య ల్యాబ్స్ ఈ పరిజ్ఞానాన్ని రూపొదించాయి. మనదేశంలో 80కోట్ల మంది మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కంటెంట్.. ముఖ్యంగా విద్య, అతవ్యసర హెచ్చరికల వంటివాటికి ప్రభుత్వం డీ2ఎం పరిజ్ఞానాన్ని వాడుకోవాలని భావిస్తోంది.
ఏంటీ పరిజ్ఞానం?
డైరెక్ట్ టు మొబైల్ పరిజ్ఞానాన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించారు. ఇలాంటి పరిజ్ఞానం ప్రపంచంలోనే ఇదే మొదటిది. ఒకరకంగా దీన్ని ఎఫ్ఎం రేడియో లాంటిదని చెప్పుకోవచ్చు. పరికరంలోని రిసీవర్ వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీలను గ్రహించి, ఆయా రేడియో కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది కదా. టీవీల్లోనూ ప్రస్తుతం డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) విధానంతో కార్యక్రమాలను చూస్తున్నాం. డిష్ యాంటెన్నాలు నేరుగా ఉపగ్రహాల నుంచి బ్రాడ్కాస్ట్ సంకేతాలను గ్రహించి సెట్టాప్ బాక్స్కు చేరవేస్తాయి. సెట్బాక్స్ నుంచి టీవీ వాటిని గ్రహించి కార్యక్రమాలను చూపిస్తుంది. డీ2ఎం కూడా దాదాపు ఇలాగే పనిచేస్తుంది. కాకపోతే ఇందులో టీవీకి బదులు ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి పరికరాలు సంకేతాలను గ్రహించి నేరుగా కార్యక్రమాలను చూపిస్తాయి. ఈ పరిజ్ఞానంలో బ్రాడ్బ్యాండ్, బ్రాడ్కాస్ట్లు రెండూ కలిసి ఉంటాయి. ప్రాంతీయ టెలీకమ్యూనికేషన్స్ వసతులు, కేటాయించిన స్పెక్ట్రమ్ సాయంతో నేరుగా డేటా సంకేతాలు మొబైల్ ఫోన్లకు అందుతాయి. ఇందుకోసం ప్రభుత్వం 470-582 ఎంహెచ్జెడ్ స్పెక్ట్రమ్ను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష క్రీడా ప్రసారాల వంటి మల్టీమీడియా కంటెంట్ నేరుగా ప్రసారం కావటానికిది తోడ్పడుతుంది. ఇంటర్నెట్ అవసరముండదు. కంటెంట్ ప్రసారంలో.. ముఖ్యంగా వీడియో ప్రసారాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని భావిస్తున్నారు.
ఎలా ఉపయోగపడుతుంది?
స్మార్ట్ఫోన్ వాడేవారికి, టెలికం ఆపరేటర్లకు.. ఇద్దరికీ డీ2ఎం పరిజ్ఞానం మేలు చేసే అవకాశముంది. దీంతో 25-30% వరకు వీడియో కంటెంట్ రద్దీ తగ్గుతుంది. ఫలితంగా 5జీ నెట్వర్క్ మీదా భారం తగ్గుతుంది. ఇది డిజిటల్ పరిణామ ప్రక్రియ వేగం పుంజుకోవటానికి తోడ్పడుతుంది. మనదేశంలో స్మార్ట్ఫోన్లు వాడుతున్నవారిలో 69% కంటెంట్ను వీడియోలే ఆక్రమిస్తున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. డీ2ఎం పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే వీడియోలను.. ముఖ్యంగా టీవీ కార్యక్రమాలను చూసేవారి మరింత పెరగగలదని ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్లా వాడుకుంటే సరి. మ్యాక్లోనైతే- ఫొటో బూత్ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్ను వెబ్క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్టాప్లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్వర్డ్ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్వర్డ్లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టారు. -
పాత ప్రింటర్ను అమ్ముతున్నారా?
ప్రింటర్తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్బాట్స్ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్