జల సంస్కారం!
అంత్యక్రియలంటేనే ఆచార వ్యవహారాలు, నమ్మకాలతో ముడిపడిన వ్యవహారం. కొందరు సమాధి చేస్తే, కొందరు దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు.
అంత్యక్రియలంటేనే ఆచార వ్యవహారాలు, నమ్మకాలతో ముడిపడిన వ్యవహారం. కొందరు సమాధి చేస్తే, కొందరు దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. మరి జల సంస్కారం గురించి తెలుసా? అక్వామేషన్, వాటర్ క్రిమేషన్, కెమికల్ క్రిమేషన్, గ్రీన్ క్రిమేషన్.. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆల్కలైన్ హైడ్రాలిసిస్.. పేరేదైనా ఉద్దేశం ఒక్కటే. నీటితోనే భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించటం. ఈ సంవత్సరం ఆరంభంలో నోబెల్ పురస్కార గ్రహీత, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు అంత్యక్రియలు జరిగింది ఈ పద్ధతిలోనే. మన కాలపు అతిపెద్ద నైతిక సవాళ్లలో వాతావరణ మార్పు ఒకటని భావించే ఆయన సంప్రదాయ అంత్యక్రియలకు బదులు దీన్ని ఎంచుకోవటం అప్పట్లోనే ఆశ్చర్యపరచింది. పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛ అంత్యక్రియగా పేరొందింది. క్రమంగా ప్రాచుర్యమూ పొందుతోంది.
శరీరం పాంచ భౌతికం. మరణించిన తర్వాత కలిసేదీ పంచ భూతాల్లోనే. నేలలో పూడ్చినా, చితి మీద కాల్చినా చివరికి కలిసిపోయేది ప్రకృతిలోనే. మరి అది పర్యావరణానికి హాని చేయనిదైతే? వాతావరణ మార్పు ఇలాంటి ఆలోచనలనే రేకెత్తిస్తోంది. నిరంతరం వాతావరణ పరిరక్షణ గురించి పరితపించిన డెస్మండ్ టుటు నిర్ణయానికి కారణమూ ఇదే. ఇంతకీ అక్వామేషన్ ఎలా చేస్తారు? ముందుగా భౌతిక కాయాన్ని పొడవైన స్టెయిన్లెస్ స్టీల్ పెట్టెలో పెట్టి సీల్ చేస్తారు. తర్వాత 95% నీరు, 5% సోడియం హైడ్రాక్సైడ్తో చేసిన వేడి ద్రావణాన్ని లోపలికి పంపిస్తారు. ఈ ద్రావణం భౌతిక కాయం చుట్టూ తిరుగుతూ కణజాలంలోని బంధాలను సడలిస్తుంది. చివరికి అమైనో ఆమ్లాలు, పెప్టయిడ్లు, లవణాలు, చక్కెరలు, సబ్బుల మిశ్రమంతో కూడిన శుద్ధ ద్రవం మాత్రం మిగులుతుంది. ఇది హైడ్రాలిసిస్ కేంద్రం డ్రెయిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. దహన క్రియల అనంతరం బూడిదను అప్పగించినట్టుగా అన్నమాట. ఇదంతా నాలుగు నుంచి ఆరు గంటల్లో పూర్తవుతుంది. ఈ ప్రక్రియలోనూ నేలలో పూడ్చిపెట్టినప్పటి మాదిరిగానే భౌతిక కాయం విచ్ఛిన్నమవుతుంది. కాకపోతే రసాయనాల వాడకంతో చాలా త్వరగా జరిగిపోతుంది. ఇది పూర్తిగా నీటితో ముడిపడినది కావటం వల్ల ‘అగ్ని రహిత అంత్యక్రియ’గా, పర్యావరణ హితమైందిగా పేరు పొందుతోంది.
130 ఏళ్ల కిందటే..
అక్వామేషన్ ప్రక్రియను అమోస్ హెర్బర్ట్ హ్యాన్సన్ అనే ఆంగ్ల రైతు అభివృద్ధి చేశారు. దీనికి ఆయన 1888లోనే పేటెంట్ పొందారు. అయితే దీనికి అంత్యక్రియలతో ఎలాంటి సంబంధం లేదు. దేశీయ పద్ధతిలో జంతు కళేబరాల నుంచి ఎరువులను తయారు చేయాలన్నది ఆయన ఉద్దేశం. కాస్టిక్ పొటాష్ వంటి క్షారాన్ని నీటిలో కలిపి, అందులో జంతు కళేబరాలను వేసి వేడి చేస్తూ తిప్పితే 8-9 గంటల్లో జెలటిన్, జిగురు వంటి పదార్థం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. దీంతో మంచి ఎరువును తయారు చేయొచ్చని కనుగొన్నారు. ఇది రైతులకు గొప్ప వరంగా ఉపయోగపడింది. మరో వందేళ్లు గడిచాక అల్బనీ మెడికల్ కాలేజీ ఉద్యోగులు దీన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. పరిశోధనల కోసం ఉపయోగించిన జంతువులను సురక్షితంగా విసర్జించటానికిది తోడ్పడగలదని ప్రతిపాదించారు. తమ పరిశోధనలు ఫలించటంతో 1994లో పేటెంట్ తీసుకున్నారు. ఇందుకోసం యంత్రాలూ తయారుచేశారు. వీటికి టిష్యూ డైజెస్టర్ అని పేరు పెట్టారు. ఇదీ జంతు కళేబరాలను విచ్ఛిన్నం చేయటానికి ఉద్దేశించిందే. బయో-రెస్పాన్స్ సొల్యూషన్స్, రెసోమేషన్ లిమిటెడ్ వంటి సంస్థలు ముందుకొచ్చాకే అక్వామేషన్ ప్రక్రియ అంత్యక్రియలకు వాడుకోవటం ఆరంభమైంది.
అరుదే అయినా..
అక్వామేషన్ ప్రక్రియ అరుదే అయినా క్రమంగా వాడకం పెరుగుతోంది. పదేళ్ల క్రితం అమెరికాలో ప్రజావసరాలకు దీన్ని వాడుకోవటానికి అనుమతించారు. ప్రస్తుతం అక్కడ కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత సంవత్సరంలో 2వేల వరకు అక్వామేషన్ అంత్యక్రియలు జరిగాయి. గణాంకాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇది పెద్ద ముందడుగేనని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో తొలి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇవి 5 శాతానికి చేరుకోవటానికి వందేళ్లు పట్టింది. కానీ అనంతరం 50 ఏళ్లలోనే 50 శాతానికి పైగా పెరిగింది. మున్ముందు ఇది మరింత విస్తరించగలదనీ ఆశిస్తున్నారు.
పర్యావరణ హితంగా..
అక్వామేషన్ ప్రక్రియలో మిగిలే ద్రవాన్ని నగర మురుగునీటి వ్యవస్థలో కలపటం సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికిది మురుగునీటిని మరింత బాగా శుధ్ధి చేయటానికీ తోడ్పడుతుంది. ఎందుకంటే మురుగునీటిలోని వ్యర్థాలను విడగొట్టే బ్యాక్టీరియాకు ఈ ద్రవం మంచి పోషకంగా ఉపయోగపడుతుంది. ఎలాంటి కాలుష్యం వెలువడకపోవటం వల్ల ఇది పర్యావరణానికీ మేలే. శరీరంలో కీమోథెరపీ మందుల వంటివి ఉన్నా త్వరగా విచ్ఛిన్నమైపోతాయి. కొన్నిచోట్ల పెద్ద చెక్కపెట్టెల్లో భౌతిక కాయాన్ని పెట్టి పూడ్చేస్తుంటారు. ఇందుకోసం కొన్ని రసాయనాలు, పదార్థాలూ వాడుతుంటారు. అమెరికాలో సంప్రదాయ అంత్యక్రియల కోసం ఏటా 3 కోట్ల అడుగుల చెక్కలు.. 2,700 టన్నుల రాగి, ఇత్తడి.. 1.5 లక్షల టన్నుల స్టీలు, 16.4 లక్షల టన్నుల కాంక్రీటు వాడుతున్నారని అంచనా. ఇక దహనక్రియల మూలంగా అక్కడ 3.6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వెలువడుతోంది. పాదరసం వంటి విష పదార్థాలూ గాల్లో కలుస్తుంటాయి. అక్వామేషన్తో ఇలాంటి దుష్ప్రభావాలేవీ ఉండవు. దహనక్రియలకు అవసరమయ్యే శక్తిలో 10 శాతమే దీనికి అవసరమవుతుంది. ఎలాంటి ఉద్గారాలు వెలువడవు. కాబట్టి పర్యావరణ హిత అంత్యక్రియగా ఇది స్థిరపడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే