అంతరిక్షంలో భూ అంతర్భాగం!
భూమి వంటి గ్రహాల్లో లోహంతో కూడిన అంతర్భాగం ఉంటుందన్నది శాస్త్రవేత్తల భావన. మన భూమి మీద రాళ్లతో కూడిన గట్టి పొర (క్రస్ట్), దీని కింద మ్యాంటిల్, అన్నింటికన్నా లోపల అంతర్భాగం ఉంటాయి.
భూమి వంటి గ్రహాల్లో లోహంతో కూడిన అంతర్భాగం ఉంటుందన్నది శాస్త్రవేత్తల భావన. మన భూమి మీద రాళ్లతో కూడిన గట్టి పొర (క్రస్ట్), దీని కింద మ్యాంటిల్, అన్నింటికన్నా లోపల అంతర్భాగం ఉంటాయి. ఈ అంతర్భాగం వెలుపలి పొర ద్రవ లోహమైతే లోపలి భాగం ఘన లోహం. ఇది మన చంద్రుడి సైజులో సుమారు 70 శాతం ఉంటుంది. ఇప్పటికీ దీని తీరుతెన్నులు రహస్యమే. అక్కడికి చేరుకోవటం, నేరుగా పరిశోధనలు చేయటం అసాధ్యం. పరోక్ష పద్ధతుల్లో అధ్యయనం చేయటం తప్ప మరో మార్గం లేదు. మరెలా? భూమి అంతర్భాగాన్ని పోలిన గ్రహ శకలం సాయం తీసుకుంటే? నాసా శాస్త్రవేత్తలు ఇలాగే ఆలోచించారు. సైకీ గ్రహ శకలం మీదికి ఇటీవలే వ్యోమనౌకను ప్రయోగించారు. అందుకే దీన్ని భూ అంతర్భాగ ప్రయాణంగానూ అభివర్ణిస్తున్నారు. మరి దీని వివరాలు, విశేషాలేంటో చూద్దామా!
భూమి మీద జీవజాతులు సురక్షితంగా మనగలుగుతున్నాయంటే అంతా అంతర్భాగం చలవే. దీన్నుంచి పుట్టుకొచ్చే అయస్కాంత క్షేత్రం భూమికి రక్షణ కవచంగా నిలుస్తూ.. సూర్యుడి వేడి దుష్ప్రభావాల నుంచి కాపాడుతోంది. భూ అంతర్భాగం తిరగటం నెమ్మదిస్తోందని, వెనక్కి తిరుగుతోందని పరిశోధనల్లో వెల్లడి కావటం చూస్తున్నదే. భూ అంతర్భాగాన్ని అధ్యయనం చేయటానికి ప్రస్తుతం పరోక్ష పద్ధతులను అనుసరిస్తున్నారు. ఒకటి- ఉల్కలు. అప్పుడప్పుడు లోహ ఉల్కలు భూమిపై పడుతుంటాయి కదా. వీటిల్లో సౌర మండలం, మన భూమి తొలినాళ్ల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అయితే వీటితో లభించే సమాచారం పరిమితం. భూ అంతర్భాగాన్ని అధ్యయనం చేయటానికి సీస్మాలజీని ఉపయోగించుకోవటం రెండో పద్ధతి. భూకంపాలు ఏర్పడినప్పుడు పుట్టుకొచ్చిన ప్రకంపనాలు భూమి అంతర్భాగం నుంచి ప్రయాణించే తీరును పరిశీలించటం దీనిలోని కీలకాంశం. అల్ట్రాసౌండ్ సాయంతో డాక్టర్లు మన శరీరంలోని అవయవాలను పరీక్షించినట్టుగా అన్నమాట. అయితే సీస్మోగ్రాఫ్లు తక్కువగా ఉండటం వల్ల అంత ఎక్కువ సమాచారం లభించటం లేదు. పైగా భూ అంతర్భాగం పైపొరలకు చాలా లోతున ఉంటుంది. నిశితంగా పరిశీలించటం సాధ్యం కాదు. సీస్మాలజీ విషయంలోనూ- ప్రయోగశాలలో భూ అంతర్భాగం ఉష్ణోగ్రతలు, అధిక పీడనాలను పునఃసృష్టించి పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీటి ద్వారా వెల్లడైన అంశాలను కంప్యూటర్ సిమ్యులేషన్ సాయంతో విశ్లేషించటానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో సైకీ గ్రహ శకలంపై ప్రత్యక్ష అధ్యయనం ఆసక్తి రేపుతోంది.
ఇటలీ దేవత పేరుతో
అటు గ్రహాలు కావు. ఇటు తోక చుక్కలు కావు. అయినా గ్రహ శకలాల మీద శాస్త్రవేత్తలకు అంతులేని ఆసక్తి. అంగారకుడు, గురుడి కక్ష్యల మధ్యలోని ఆస్టరాయిడ్ బెల్ట్లో కోట్లాది గ్రహ శకలాలు ఉన్నాయి. కొన్ని మరుగుజ్జు గ్రహం సెరెస్ అంత పెద్దగా ఉంటే.. మరికొన్ని గులకరాళ్లకన్నా చిన్నగానూ ఉంటాయి. వీటిల్లో సైకీ ప్రత్యేకమైంది. సగటున సుమారు 226 కి.మీ. వ్యాసంతో.. బంగాళాదుంప ఆకారంలో కనిపించే ఇది అతిపెద్ద ‘ఎం’ రకం గ్రహశకలం. అంటే లోహ రకానికి చెందిందన్నమాట. ఇది చాలావరకు ఐరన్, నికెల్తో ఏర్పడింది. మన భూమి అంతర్భాగం మాదిరిగా. ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త యానిబలే డి గాస్పరిస్ 1852లో సైకీని గుర్తించారు. గ్రీకుల ఆత్మ దేవత పేరునే దీనికి పెట్టారు.
సహజ ప్రయోగశాల
సైకీ లాంటి గ్రహ శకలాలను సహజ ప్రయోగశాలలని చెప్పుకోవచ్చు. సౌర మండలం ఏర్పడిన తొలినాళ్లలో క్షీణించిన గ్రహాల అవశేషాలుగా వీటిని భావిస్తుంటారు. ఇలాంటి గ్రహ శకలాల్లో లోహాల వంటి భార మూలకాలు అంతర్భాగంలోకి వెళ్తే.. తేలికైన మూలకాలు బయటి పొరలకు చేరువగా వస్తాయి. వీటికి ఇతర అంతరిక్ష వస్తువులు ఢీకొన్నప్పుడు పైపొరలు ఛిద్రమవుతాయి. దీంతో చాలా పదార్థం అంతరిక్షంలోకి వెలువడుతుంది. అప్పుడు లోహంతో నిండిన అంతర్భాగం మాత్రమే మిగులుతుంది. అందువల్ల గ్రహాల అంతర్భాగాల తీరుతెన్నుల మీద అధ్యయనం చేయటానికివి ఎంతో అనువుగా ఉంటాయి. సైకీ అలాంటి గ్రహ శకలమే. పైపొరలు ఛిద్రం కావటం వల్ల భూ అంతర్భాగం మాదిరిగానే ఉంటుంది. అందుకే ఇది భూ అంతర్భాగ రహస్యాలను అందిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల నాసా ప్రయోగించిన సైకీ వ్యోమనౌక ఉద్దేశం ఇదే.
దఫదఫాలుగా..
సైకీ వ్యోమనౌక ఆరేళ్ల పాటు సుమారు 360 కోట్ల కి.మీ. దూరం ప్రయాణించి అక్కడికి చేరుకుంటుంది. ఇది సుమారు 100 రోజుల వరకు ప్రాథమిక తనిఖీ పనుల్లోనే మునుగుతుంది. పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకొని, తర్వాత థ్రస్టర్లను పనికి పురమాయిస్తుంది. ప్రయోగించిన తర్వాత సుమారు 2.5 ఏళ్లకు వ్యోమనౌక అంగారకుడి సమీపంలోకి వచ్చి గురుత్వాకర్షణ బలంతో ఉత్తేజితం అవుతుంది. ఇప్పటి నుంచి 5.5 ఏళ్లకు ప్రయాణ సమయం ముగుస్తుంది. వ్యోమనౌకలోని కెమెరాలు 2029, జూన్లో సైకీ గ్రహ శకలం ఫొటోలు తీయటం ఆరంభించొచ్చు. వ్యోమనౌక 2029, ఆగస్టులో సైకీ చుట్టూ తిరగటం మొదలెట్టి.. 26 నెలల పాటు దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది.
అత్యాధునిక పరికరాలు
ఇప్పటివరకూ రాళ్లు, మంచుతో కూడిన అంతరిక్ష వస్తువుల మీదికే నాసా ప్రయోగాలు చేపట్టింది. భారీ లోహంతో కూడిన అంతరిక్ష వస్తువుల వద్దకు నాసా పంపిస్తున్న మొట్టమొదటి వ్యోమనౌక ఇదే. బ్రాడ్ స్పెక్ట్రమ్ కెమెరాలు, స్పెక్ట్రోమీటర్లు, మాగ్నెటోమీటర్లు, గ్రావిమీటర్లు, ఇతర పరికరాల సాయంతో సైకీ పరిశోధనలు చేపట్టనుంది. ఇది డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ (డీసీఓఎస్) వ్యవస్థనూ పరీక్షించనుంది. ఇదో అధునాతన లేజర్ కమ్యూనికేషన్ పరిజ్ఞానం. రేడియో తరంగాలకు బదులు కంటికి కనిపించని నియర్-ఇన్ఫ్రారెడ్ తరంగధైర్ఘ్యాల సాయంతో ఫొటోల్లోని సమాచారాన్ని విడమరచుకొని సుదూర అంతరిక్షం నుంచి భూమికి చేరవేస్తుంది. ఇలా రేడియో తరంగాలకు బదులు కాంతిని ఉపయోగించుకోవటం వల్ల వ్యోమనౌక నుంచి భూమికి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సమాచారం అందుతుంది. అదీ అత్యంత నాణ్యతతో.
పరిశోధనలో ఏం తేలుతుంది?
నిజంగా సైకీ శిథిల గ్రహం అంతర్భాగమా? మన భూమి అంతర్భాగం లాగా మొదట్లో వేడిగా, కరిగిన స్థితిలో ఉండి నెమ్మదిగా చల్లారుతూ గట్టిపడిందా? అనేది గుర్తించటానికి తాజా అధ్యయనం తోడ్పడుతుంది. లేదూ ఎప్పటికీ కరగకుండా ఉండిపోయిన పదార్థంతో ఏమైనా సైకీ ఏర్పడిందా? అనేదీ తేలుతుంది.
- సైకీ ఉపరితలం వయసును తెలుసుకోవటమూ నాసా ఉద్దేశాల్లో ఒకటి. దీంతో శకలం పైపొరలు క్షీణించటానికి ఎంత కాలం పట్టిందనేది బయటపడుతుంది. గ్రహ శకలం రసాయన మిశ్రమాల తీరుతెన్నులనూ సైకీ విశ్లేషిస్తుంది. ఐరన్, నికెల్తో పాటు తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్, సిలికాన్, సల్ఫర్ వంటి మూలకాలు ఉన్నాయేమో పరీక్షిస్తుంది. వీటి ఉనికి ఆధారంగా భూమి పరిణామ క్రమాన్ని అంచనా వేసే అవకాశముంది.
- సైకీ ఆకారం, ద్రవ్యరాశి, గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్నీ సేకరిస్తుంది. మున్ముందు ఖనిజాల తవ్వకానికి ఆస్కారముందేమో కూడా అధ్యయనం చేస్తుంది. ఇదే సాధ్యమైతే 10,000,000,000,000,000,000 డాలర్ల విలువైన ఐరన్, నికెల్, బంగారాన్ని తవ్వి తీయొచ్చు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు