Disha Case: సజ్జనార్ను విచారించాలనిపించలేదా?
‘దిశ’ అత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్కౌంటర్పై దర్యాప్తు జరిపేందుకు నియమించిన సిట్ చీఫ్ మహేశ్ భగవత్ను కమిషన్ శుక్రవారం విచారించింది.
కాల్పుల్లో గాయపడిన పోలీసుల వివరాలెందుకు లేవు
మహేశ్భగవత్కు జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ప్రశ్న
ఈనాడు, హైదరాబాద్: ‘దిశ’ అత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్కౌంటర్పై దర్యాప్తు జరిపేందుకు నియమించిన సిట్ చీఫ్ మహేశ్ భగవత్ను కమిషన్ శుక్రవారం విచారించింది. నలుగురు నిందితుల ఎన్కౌంటర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగినందున అప్పటి కమిషనర్ సజ్జనార్ను, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్రెడ్డిని విచారించారా? అని భగవత్ను కమిషన్ ప్రశ్నించింది. ఆయన లేదని జవాబిచ్చారు. సంచలనం సృష్టించిన కేసుల్లో వారిని విచారించాలని అనిపించలేదా? అని అడగ్గా.. ఆ అవసరం లేదనిపించిందన్నారు. ఘటనాస్థలంలో వెలుతురు ఉందని దర్యాప్తు అధికారి (షాద్నగర్ ఏసీపీ) రికార్డు చేశారని, అదే అధికారి చీకటి ఉందనిపించేలా శబ్దం వచ్చిన వైపు కాల్చాలని పోలీస్ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నట్లు కమిషన్ పేర్కొంది. వైరుధ్యాలు కలిగిన ఈ రెండు అంశాలపై సిట్ దర్యాప్తులో గుర్తించారా? అని ప్రశ్నించగా.. లేదని భగవత్ బదులిచ్చారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం 5వ గట్టు అని మీకెలా తెలిసిందని అడిగితే.. సిట్ దర్యాప్తు అధికారి సురేందర్రెడ్డి అభిప్రాయమని చెప్పారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువుల్ని ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచే స్వాధీనం చేసుకున్నట్లు మీకు ఎలా తెలుసు అని అడగ్గా.. అది సిట్ పరిధిలో లేని అంశంగా పేర్కొన్నారు. నిందితులను విచారణ నిమిత్తం ఉంచిన రవి గెస్ట్హౌస్ యజమానికి సంబంధించి రెండు విధాలుగా వాంగ్మూలం ఎలా నమోదు చేశారనగా సరైన జవాబు లభించలేదు. ఎన్కౌంటర్కు సంబంధించి సిట్ సొంత స్కెచ్ రూపొందించిందా? అని అడిగితే లేదన్నారు. ఠాణాలో ఆయుధ సామగ్రి సంబంధిత రిజిస్టర్ ఉంటుందా? అన్న ప్రశ్నకు ఉంటుందన్నారు. నివేదికలో ఆ అంశం ఎందుకు రాయలేదని అడిగితే సమాధానం ఇవ్వలేదు.
పొరపాటున అలా అనుకున్నాను
సిట్ కేస్ డైరీ రాసిన వనపర్తి ఎస్పీ అపూర్వారావును కమిషన్ విచారించింది. ‘ఎదురుకాల్పుల సమయంలో కానిస్టేబుల్ అరవింద్గౌడ్కు గాయాలయ్యాయని మీరు చెప్పారు. ఆసుపత్రి నివేదికలో హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు రక్తగాయాలైనట్లు ఉంది’ అని కమిషన్ ప్రశ్నించింది. పొరపాటున అనుకున్నానని అపూర్వారావు బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. -
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. -
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మోదీ, అమిత్షా నాపై పగబట్టారు: సీఎం రేవంత్రెడ్డి
కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. -
తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
Telangana ICET | తెలంగాణలో ఐసెట్ దరఖాస్తుల గడువును మే 7 వరకు పొడిగించారు. -
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు.. బరిలో 525 మంది: సీఈవో వికాస్రాజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. -
మెదక్ భారాస అభ్యర్థిపై తప్పుడు ప్రచారం సరికాదు: హరీశ్రావు
భారాస అభ్యర్థిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగటం సమంజసం కాదని.. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’: సీఎం రేవంత్ ఎద్దేవా
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం.. వాళ్లు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్, భారాస ప్రచారాన్ని ప్రజలు నమ్మరు: భాజపా ఎంపీ లక్ష్మణ్
ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆయన మాటల్లో పస లేదని ప్రజలు గుర్తించారన్నారు. -
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్