ఉద్యోగార్థులకు ఫీజుల భారం
ప్రభుత్వ ఉద్యోగాలకు కోటి ఆశలతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజులు భారంగా మారాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. పేదలు, రిజర్వుడు అభ్యర్థుల నుంచి కేవలం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంటే, నియామక బోర్డులు అధికఫీజులు
కమిషన్లో తక్కువ.. బోర్డుల్లో ఎక్కువ
నిర్వహణ ఖర్చులకు నిధుల కొరతే కారణం
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు కోటి ఆశలతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజులు భారంగా మారాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. పేదలు, రిజర్వుడు అభ్యర్థుల నుంచి కేవలం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంటే, నియామక బోర్డులు అధికఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటుగా కోచింగ్ తీసుకోలేక లైబ్రరీల్లో, మొబైల్ డేటాతో యూట్యూబ్ పాఠాలు వింటూ చాలీచాలని భోజనంతో నెట్టుకొస్తున్న అభ్యర్థులకు ఈ ఫీజులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం సత్వర ఉద్యోగ నియామకాల కోసం వివిధ బోర్డుల్ని ఏర్పాటు చేసింది. కానీ వీటికి నిధులు, వసతులు, తగినంత మంది సిబ్బంది లేరు. దీంతో ఇవి ప్రశ్నపత్రం తయారీ సహా అన్ని ప్రక్రియలను యూనివర్సిటీలు, ఇతర ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఆ ఖర్చుల భారాన్ని నిరుద్యోగులపై వేస్తున్నాయి. ‘పోలీసు నియామక బోర్డు వ్యయంలో కేవలం 5 శాతమే ప్రభుత్వం నుంచి వస్తోంది. మిగతా 95 శాతాన్ని ఫీజులు, ఇతర మార్గాల్లో సర్దుబాటు చేస్తున్నాం’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘గురుకులాల్లో నియామకాలకు గ్రాంట్లు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం నియామక ఖర్చులను సర్దుబాటు చేస్తే ఫీజులు తగ్గించేందుకు వీలుంటుంది’ అని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఉదాహరణకు ఇలా...
ఒక అభ్యర్థి డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ అర్హతలు కలిగి ఉంటే ఆ అభ్యర్థికి ఫీజుల రూపంలో భారం ఇలా ఉండనుంది. ఇలాంటి అభ్యర్థికి పోలీసు ఉద్యోగాల్లో ఎస్సై, కానిస్టేబుల్, రవాణా, ఎక్సైజ్ పోస్టులు, గురుకులాల్లో పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్, పాఠశాల విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ (రెండు పోస్టులు), ఎస్జీటీ, గ్రూప్-1, 2, 3, 4 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఈ లెక్కన ఫీజులను లెక్కిస్తే కానిస్టేబుల్, ఎస్సై, రవాణా, ఎక్సైజ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రూ.3050 అవుతుంది. గురుకులాల్లో (గతంలో ఫీజు ప్రకారం) రూ.1200 చొప్పున 3 రకాల పోస్టులకు రూ.3600 అవుతుంది. విద్యాశాఖ పోస్టులను గతంలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది. కమిషన్ వసూలు చేసిన ఫీజులను పరిగణనలోకి తీసుకుంటే రూ.200 చొప్పున మూడు పోస్టులకు రూ.600, గ్రూప్స్ పోస్టులకు రూ.800 ఖర్చు అవుతుంది. మొత్తం కలిపితే రూ.8050 అవుతుంది. పాఠశాల విద్యాశాఖ పోస్టులను డీఎస్సీకి అప్పగిస్తే ఈ భారం మరింత పెరుగుతుంది.
పోలీసు పరీక్ష ఒకటే.. ప్రతి పోస్టుకూ ఫీజు
ప్రస్తుతం పోలీసు నియామకబోర్డు ఆరు రకాల పోస్టులకు ప్రకటన ఇచ్చింది. వీటన్నిటికీ ప్రిలిమినరీ పరీక్ష ఒకటే. కానీ ప్రతి పోస్టుకూ దరఖాస్తు చేయాలంటే రూ.800 ఫీజుగా బోర్డు నిర్ణయించింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే రెండో పోస్టు దరఖాస్తు ఫీజులో రూ.50 తగ్గింపు ఇస్తోంది. అంటే ఆరు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే రూ.4550 చెల్లించాలి.
టీఎస్పీఎస్సీ ఫీజులు కొంత నయం
టీఎస్పీఎస్సీకి ఏటా ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందుతున్నాయి. దీంతో కమిషన్ పేదవర్గాలకు ఉచిత దరఖాస్తుకు అవకాశం కల్పిస్తోంది. పరీక్ష ఫీజు రూ.150గా ఉంది. పేదలు, రిజర్వుడు కేటగిరీల వారికి పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లిస్తే చాలు. ఒకే పరీక్షతో వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి ఒకే దరఖాస్తు, ఒకటే ఫీజు కింద అనుమతించి, ఆప్షన్ల వారీగా పోస్టులు కేటాయించింది. కానీ ఈ పద్ధతి బోర్డుల్లో అమలు కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన