Telangana News: తెలంగాణ.. స్టార్టప్ ‘సూపర్స్టార్’
దేశంలో స్టార్టప్స్ను ప్రోత్సహించే టాప్ పెర్ఫార్మర్స్ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం స్టార్టప్ స్టేట్ ర్యాంకులు విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు...
బెస్ట్పెర్ఫార్మర్స్ గుజరాత్, కర్ణాటక
చివరి స్థానంలో బిహార్ సరసన ఏపీ
ర్యాంకులు విడుదల చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
తెలంగాణలో బలమైన స్టార్టప్ వాతావరణం
కేంద్ర నివేదిక వెల్లడి
ఈనాడు - దిల్లీ
దేశంలో స్టార్టప్స్ను ప్రోత్సహించే టాప్ పెర్ఫార్మర్స్ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం స్టార్టప్ స్టేట్ ర్యాంకులు విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా వాటిని స్టార్టప్ మెగాస్టార్స్ (బెస్ట్ పెర్ఫార్మర్స్), సూపర్స్టార్స్ (టాప్ పెర్ఫార్మర్స్), స్టార్స్ (ది లీడర్స్), రైజింగ్ స్టార్స్ (యాస్పైరింగ్ లీడర్స్), సన్రైజర్స్ (ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్) పేరుతో అయిదు విభాగాలుగా విభజించారు. ‘‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్ రాష్ట్రంలోని స్టార్టప్స్ ఏర్పాటుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తోంది. స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తూ మార్గనిర్దేశం చేస్తోంది. తెలంగాణ ఓపెన్ డేటా పాలసీ 2016 ద్వారా విభిన్న డిపార్ట్మెంట్లకు చెందిన డేటాను బహిర్గతం చేస్తూ పరిపాలనలో పారదర్శకతకు పీట వేసింది. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్లను ప్రోత్సహించడానికి వి-హబ్ పేరుతో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేసి వారికి నిధులు, మార్గదర్శనం, ప్రణాళిక, వృద్ధి విషయంలో చేయూతనందిస్తోంది. స్టార్టప్స్కు నిధులు సమకూర్చడానికి టి-ఫండ్ పేరుతో ఒక ఫండ్ను ఏర్పాటు చేయడం, స్టార్టప్స్తో పెట్టుబడిదారులను అనుసంధానం చేయడానికి 15కిపైగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టి-ఫండ్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకుపైగా కేటాయించింది. ఇప్పటి వరకు 50కి పైగా స్టార్టప్లు రూ.కోటి నిధులను దీని ద్వారా అందుకున్నాయి. టి-ఫండ్కు అదనంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్జీఎస్టీ వాపసు చేస్తోంది. పనితీరు ఆధారంగా గ్రాంట్ మంజూరు చేస్తోంది. పేటెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంటర్నేషనల్ మార్కెట్ ఛార్జీలు, ఉద్యోగనియామకాల కోసం చేసే ఖర్చులను తిరిగి చెల్లించడం ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమంలో 800 స్టార్టప్స్, 150 మందికిపైగా భాగస్వాములయ్యారు. స్టార్టప్స్కు అవసరమైన మద్దతు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం 250మందికిపైగా అధికారులకు అవగాహన కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఏర్పడిన ఇంక్యుబేటర్లకు 100% శిక్షణ ఇస్తోంది. 350మందికిపైగా ప్రైవేటు పెట్టుబడిదారులను స్టార్టప్లకు మద్దతిచ్చేలా ప్రోత్సహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పదికిపైగా డిపార్ట్మెంట్లు స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాయి’’ అని కేంద్రం తాజా నివేదికలో వివరించింది. రాష్ట్రాల పనితీరును లెక్కించడానికి కేంద్రం పరిగణనలోకి తీసుకున్న ఏడు అంశాల్లో నాలుగింట తెలంగాణ లీడర్ జాబితాలో చోటు సంపాదించుకొంది.
వెతికినా కనిపించని ఆంధ్రప్రదేశ్
స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఉత్తమ పద్ధతులు అనుసరిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పదం వెతికినా కనిపించలేదు. కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో చివరి విభాగంలో నిలిచిన బిహార్ పలు ఉత్తమ పద్ధతులను అమలు చేస్తున్నట్లు స్టార్టప్ నివేదిక పేర్కొంది. కానీ ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులేమీ ఇందులో కనిపించలేదు. బిహార్ 2017 స్టార్టప్ పాలసీ విడుదల చేసి రాష్ట్రంలో ఏర్పాటయ్యే స్టార్టప్లకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 10 స్టేట్ సపోర్టెడ్ మెంటార్స్తో 250కిపైగా సంస్థలు అనుసంధానమైనట్లు తెలిపింది. దేశంలో వెనుకబడిన బిహార్లో కనిపించిన పద్ధతులు కూడా ఏపీలో కనిపించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రెండురోజుల క్రితం కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన సులభతర వాణిజ్యంలో తొలిగ్రూప్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్స్ ప్రోత్సాహంలో మాత్రం వెనకబడిపోయినట్లు ఈ నివేదిక ద్వారా వెల్లడైంది.
సామర్థ్యం పెంపు, మార్గనిర్దేశం, నిధులు, ఇంక్యుబేషన్, సంస్థాగత విషయాల్లో మద్దతు, మార్కెట్ అందుబాటు, నవకల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహం ఆధారంగా రాష్ట్రాల స్థాయిని లెక్కించారు. 26 కార్యాచరణ సూత్రాల కొలమానంగా 100 మార్కులకు ఈ ర్యాంకులు ప్రకటించారు.
స్టార్టప్ల సాధికారతకు తెలంగాణ కృషి
తెలంగాణలో బలమైన స్టార్టప్ వాతావరణం ఉన్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇక్కడ ఏర్పాటైన స్టార్టప్లకు మారదర్శకత్వం, ఇంక్యుబేషన్, నిధుల మద్దతు ద్వారా సాధికారత కల్పిస్తున్నట్లు ప్రశంసించింది. 2016-21 తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ నవకల్పన, ప్రయోగాలు, రిస్క్ తీసుకొనే ధైర్యాన్ని నూరిపోసి రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు తెలిపింది.
1. మెగాస్టార్స్.. గుజరాత్, కర్ణాటక
2. సూపర్స్టార్స్.. తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా. కేంద్రపాలిత ప్రాంతం నుంచి జమ్మూకశ్మీర్
3. స్టార్స్.. తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, అస్సాం. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అరుణాచల్ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, గోవా
4. రైజింగ్ స్టార్స్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్గఢ్. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హిమాచల్ప్రదేశ్, చండీగఢ్, త్రిపుర, దాద్రానగర్హవేలి, మణిపుర్, నాగాలాండ్, పుదుచ్చేరి
5. సన్రైజర్స్.. బిహార్, ఏపీ. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మిజోరం, లద్ధాఖ్
* స్టార్టప్స్ ద్వారా 7,50,704 మంది ఉపాధి పొందుతున్నారు.
* దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచి నిధుల మద్దతు పొందుతున్న స్టార్టప్లు: 571
* 648 జిల్లాల్లో కనీసం ఒక గుర్తింపు పొందిన స్టార్టప్ ఉంది. దేశవ్యాప్తంగా ఇలాంటి వాటి సంఖ్య 70,809కి చేరింది. వీటిలో 47% స్టార్టప్లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
- ఎం.శ్రీనివాస్రావు, సీఈఓ, టి-హబ్
స్టార్టప్ ర్యాకింగ్స్లో తెలంగాణ ముందువరుసలో నిలవడం హర్షణీయం. అంకుర వ్యవస్థను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఇక్కడ అమలు చేస్తున్న పలు విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ను ప్రారంభించిన సందర్భంగా, రానున్న అయిదేళ్ల కాలంలో 20వేలకు పైగా అంకురాలకు సేవలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..