కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం.. సాగర్
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 16 అవుట్లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తీర్మానం చేసింది. గెజిట్ అమలుకు అనుగుణంగా 14వ తేదీలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాన్ని పంపేందుకు
మొదటిదశలో బోర్డు కిందకు 16 అవుట్లెట్లు!
జల విద్యుత్ కేంద్రాలు అప్పగించబోమన్న తెలంగాణ
ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
ఈనాడు, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 16 అవుట్లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తీర్మానం చేసింది. గెజిట్ అమలుకు అనుగుణంగా 14వ తేదీలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాన్ని పంపేందుకు నిర్ణయించింది. రాష్ట్రాలు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తే గానీ గెజిట్ అమల్లోకి రాదు. ఈ ఉత్తర్వుల విడుదలకు ఏపీ సానుకూలత వ్యక్తం చేసింది. జల విద్యుత్ కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి తెలంగాణ నిరాకరించింది. దీంతో గడువులోపు గెజిట్ అమలుపై అనిశ్చితి నెలకొంది. మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బోర్డు 15వ సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, బోర్డు సభ్యులు రవికుమార్ పిళ్లై, ముతాంగ్, రాయ్పురే పాల్గొన్నారు. ఉప సంఘం 30 కేంద్రాలకు సంబంధించి రూపొందించిన నివేదికపై బోర్డు సమావేశంలో చర్చించారు.
రాష్ట్రాలు ఆమోదించాల్సిన ప్రాజెక్టులివే...
కేంద్ర గెజిట్లోని షెడ్యూల్-2లో పేర్కొన్న ప్రాజెక్టుల్లో మొదటి విడతగా కొన్నిటిని బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు కేఆర్ఎంబీ నిర్ణయించింది. తీర్మానంలో వాటిని పొందుపరిచింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద మొత్తం 16 డైరెక్ట్ అవుట్లెట్లను ప్రతిపాదించవచ్చని సమాచారం. గడువులోపు గెజిట్ అమలుకు వీలుగా శ్రీశైలం, సాగర్ల పరిధిలో ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను రాష్ట్రాలు అప్పగించాలని కోరుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బోర్డు పేర్కొంది.
తెలంగాణ ససేమిరా.. ఏపీ సమ్మతి
బోర్డు జాబితాలో జల విద్యుత్ కేంద్రాలు కూడా ఉండటంతో తెలంగాణ అంగీకరించలేదని తెలిసింది. కృష్ణా జలాల కేటాయింపుల అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఇప్పుడు గెజిట్ అమలు చేయడం సరికాదని పేర్కొన్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిందని పేర్కొన్నట్లు తెలిసింది. హంద్రీ నీవా, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను కూడా చేర్చాలని తెలంగాణ సూచించగా, ఏపీ అంగీకరించలేదని సమాచారం. గెజిట్ అమలుకు ఉత్తర్వులిచ్చేందుకు తాము అనుకూలంగా ఉన్నామని ఏపీ స్పష్టం చేసినట్లు తెలిసింది. తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలను చేర్చితేనే ఏపీ పరిధిలోని రెండు కేంద్రాలను బోర్డు అధీనంలోకి వెళ్లడానికి అంగీకరిస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం. సీడ్మనీపైనా రెండు రాష్ట్రాలు బోర్డు నుంచి స్పష్టత కోరినట్లు తెలిసింది.
రాష్ట్రాల ఉత్తర్వులు కీలకం
ప్రాజెక్టుల పరిధిలోని సిబ్బంది, నిధులు, భద్రత, ఆస్తుల (అసెట్స్) వివరాలు కూడా రాష్ట్రాలు అప్పగించాల్సి ఉండగా ఏపీ పూర్తిస్థాయిలో అందజేసినట్లు పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టుల నిర్వహణ (ఆపరేషన్, మెయింటెనెన్స్) మాత్రమే బోర్డు చేపడుతుంది. ప్రాజెక్టు యాజమాన్య (ఓనర్షిప్) హక్కులు ప్రభుత్వాల పరిధిలోనే ఉండనున్నాయి. ప్రాజెక్టులపై రుణాలు పొందడానికి రాష్ట్రాలకు ఆటంకాలేవీ ఉండవని తెలిసింది.
పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం: తెలంగాణ
కృష్ణా బోర్డు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాక ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ తెలిపారు. బోర్డు సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ లేవనెత్తుతున్న సమస్యను కృష్ణా జల వివాద ట్రైబ్యునల్కు పంపేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సమయంలో గెజిట్ నోటిఫికేషన్ అమలు వద్దని తెలంగాణ కోరుతోంది. శ్రీశైలం నిర్మించిందే జల విద్యుత్ కోసం. తెలంగాణ అధికారికంగానే ఉత్పత్తి చేస్తోంది. విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ అంటోంది. రాయలసీమ అవసరాలకు అనుగుణంగా సాగునీటిని తీసుకువెళ్లడం ఆ రాష్ట్రానికి అలవాటుగా మారింది. ప్రాజెక్టులు విస్తరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండా ప్రాజెక్టులను బోర్డు తీసుకోదు. నిర్వహణ నిధుల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని సమావేశంలో సూచించాం’ అని రజత్కుమార్ వివరించారు.
అనధికారిక విద్యుదుత్పత్తే కారణం: ఏపీ
శ్రీశైలం నుంచి తెలంగాణ అనధికారికంగా జల విద్యుదుత్పత్తి చేపట్టడంతో కేంద్రం గెజిట్ జారీ చేయాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జల విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ నిర్దేశించినా, వారు పట్టించుకోలేదు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేంద్రం వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జల విద్యుదుత్పత్తి కేంద్రాలు మినహా ప్రాజెక్టులను తీసుకోవాలని బోర్డును తెలంగాణ కోరింది. ఇది ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. శ్రీశైలం కేవలం విద్యుదుత్పత్తికే అయితే తెలంగాణ సాగునీటిని ఎలా తీసుకుంటోంది? బోర్డుకు ప్రాజెక్టుల సమాచారం అంతా అందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఉత్తర్వులు జారీ చేస్తుంది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం