Fuel Prices: పేదింట చమురు మంట
పెట్రోలు, డీజిల్ ధరల మంటతో సామాన్య, పేద కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పేదలు అల్లాడిపోతున్నారు. పోషకాహారం మాట అటుంచి ఏదో విధంగా ఆకలి తీరితే చాలనే పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు పలువురు వివరించారు. ‘‘కొవిడ్ వంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇతరత్రా జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ పెరిగిన కూరగాయలు, వంటనూనెలు, పప్పుల వంటివాటి ధరలతో కడుపు నిండడమే కష్టంగా ఉంది. ఇక పోషకాహారం ఎక్కడ’’ అని సామాన్య, పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అందని పోషకాహారం
మండిపోతున్న నిత్యావసరాలు
పెట్రో ధరలతో అన్నింటిపైనా ప్రభావం
ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబం నెలలో ఒకసారి చికెన్, మటన్ కిలో కొని తింటే రూ.1,000కి పైగా చెల్లించాల్సి వస్తోంది. నిత్యావసరాలకు రూ.2 వేలు పెట్టినా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. కోడిగుడ్డు కూడా ఒక్కోటి రూ.5 నుంచి రూ.6కి అమ్ముతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ ధరల మంటతో సామాన్య, పేద కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పేదలు అల్లాడిపోతున్నారు. పోషకాహారం మాట అటుంచి ఏదో విధంగా ఆకలి తీరితే చాలనే పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు పలువురు వివరించారు. ‘‘కొవిడ్ వంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇతరత్రా జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ పెరిగిన కూరగాయలు, వంటనూనెలు, పప్పుల వంటివాటి ధరలతో కడుపు నిండడమే కష్టంగా ఉంది. ఇక పోషకాహారం ఎక్కడ’’ అని సామాన్య, పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు కూరగాయలు కొనడం కూడా తగ్గించారని హైదరాబాద్ రైతుబజార్ల అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. గతంలో కిలో, 2 కిలోలు కొనేవారు ఇప్పుడు అందులో సగమే కొంటున్నారని వివరించారు. పప్పులు, వంటనూనెల అమ్మకాలూ తగ్గినట్లు హైదరాబాద్ మలక్పేట టోకు మార్కెట్ వ్యాపారి రాజేష్ చెప్పారు. ఇక్కడ నుంచి రోజూ పలు జిల్లాల చిల్లర వ్యాపారులు నిత్యావసర సరకులు లారీల్లో తీసుకెళ్తారని, ధరల పెరుగుదల వల్ల వారు కొనుగోళ్లు తగ్గించారని వివరించారు. ‘‘నాలుగైదు నెలల్లోనే కందిపప్పు, మినప్పప్పు, వంటనూనెల వంటి వాటి కిలో ధర రూ.10 నుంచి రూ.30 దాకా పెరిగింది. ఇంత వేగంగా పెరుగుదల ఇటీవల ఎప్పుడూ చూడలేదు’’ అని ఇక్కడి టోకు వ్యాపారులు తెలిపారు.
పది కుటుంబాలను ఆరా తీస్తే...
పెట్రో ధరల ప్రభావం పేద, సాధారణ కుటుంబాలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈనాడు ప్రయత్నించింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లలో పది కుటుంబాలను ఆరా తీస్తే ఆవేదనే సమాధానమైంది. రోజూ పోషకాహారం తింటున్నారా అని అడిగితే ఒక్క కుటుంబమైనా ‘తింటున్నాం’ అని చెప్పలేదు.
ఒక్కోరోజు పచ్చడి, మజ్జిగతోనే భోజనం
- మునిగెల లక్ష్మీనారాయణ, ఆటోడ్రైవర్, స్టేషన్ ఘన్పూర్, జనగామ
నేను 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఏడాది క్రితం లీటరు రూ.65 ఉన్నప్పుడు రోజుకు రూ.600 నుంచి రూ.700 ఆదాయం వచ్చేది. ఇప్పుడు అందులో సగం కూడా రావడం లేదు. కరోనా రాకముందు వారానికి ఒకట్రెండుసార్లు గుడ్లు, చికెన్, మటన్ వంటి ఆహారం తెచ్చుకున్నా డబ్బులుండేవి. ఇప్పుడు అవి అంతగా తినడం లేదు. ఒక్కోరోజు పచ్చడి, మజ్జిగతోనే భోజనం ముగిస్తున్నా.
ఎలా బతకాలో తెలియడం లేదు
నాకు ముగ్గురు సంతానం. బైక్ మెకానిక్ని. రోజూ రూ.400 నుంచి రూ.500 వస్తుంది. కరోనా రాకముందు వాటిలో రూ.100 నుంచి రూ.200 పొదుపు చేసుకునే వాళ్లం. ఇప్పుడు కూరగాయలు కొనాలన్నా ఒక్కోసారి చేతిలో డబ్బులుండటం లేదు. పెట్రోలు ధరల పెరుగుదలతో బైకుల వాడకం తగ్గిస్తున్నారు. నాకు ఆదాయం అంతగా రావడం లేదు. ఇక పోషకాహారం మాకు ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎలా బతకాలో తెలియడం లేదు.
- డి. వెంకటేష్, బైక్ మెకానిక్, వరంగల్
టమాటాలు, బీరకాయలు కొనలేం!
నేను నెలకు రూ.15 వేల జీతానికి వాచ్మెన్గా పనిచేస్తున్నా. గతంలో పెద్దగా అప్పులు చేసేవాడిని కాదు. ఇప్పుడు వైద్యం, ఇంటి ఖర్చులకే అప్పులు చేయాల్సి వస్తోంది. టమాటాలు, బీరకాయల వంటివి కిలో రూ.40 నుంచి రూ.50 చెబుతున్నారు. మాలాంటి చిన్న కుటుంబాలు ఏం కొనగలవు? అవి తినే ఆర్థిక స్థోమత చాలా కుటుంబాలకు లేనేలేదు.
- పెండ్యాల అశోక్, వాచ్మెన్, హన్మకొండ
జీతం చాలక అప్పులపాలు
నేను సింగరేణి ఓపెన్కాస్ట్ బొగ్గు గనిలో కాంట్రాక్టు కార్మికుడిగా నెలకు రూ.9 వేలకు పనిచేస్తున్నా. పెరుగుతున్న ధరలతో జీతం సరిపోక అవసరమైతే అప్పులు తెచ్చుకుంటున్నా. గతంలో రూ.500కి వచ్చిన సరకులు ఇప్పుడు రూ.800 పెట్టినా రావడం లేదు. ధరలు తగ్గించకుండా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా పేద కుటుంబాలు బతకలేవు.
- జిముడ శంకర్, బొగ్గు గని కాంట్రాక్టు కార్మికుడు, జయశంకర్ భూపాలపల్లి
బస్పాస్ తీసుకుని తిరుగుతున్నా
కొవిడ్కు ముందు మా షోరూంలో రోజుకు 25 నుంచి 30 బైకులు అమ్మేవాళ్లం. ఇప్పుడు 10 కూడా అమ్మలేకపోతున్నాం. పెట్రో ధరలకు భయపడి బైకుల వాడకం తగ్గిస్తున్నారు. నెలకు నాకొచ్చే రూ.15 వేలతో బతకడం చాలా కష్టంగా ఉంది. గతంలో బైకుపై తిరిగేవాడిని. ఇప్పుడు బస్పాస్ తీసుకుని తిరుగుతున్నా. కడుపు నిండడమే కష్టంగా ఉంది.
- రవి, బైకు షోరూం ఉద్యోగి, హైదరాబాద్
బతుకుల్ని ఆగం చేస్తున్న ధరలు
నేను ప్రైవేటు ఆఫీసులో నెలకు రూ.10 వేలకు అటెండర్గా పనిచేస్తున్నా. భార్య గృహిణి. మాకు ఇద్దరు పిల్లలు. పెట్రోలు, డీజిల్ ధరలు మాలాంటి చిన్న కుటుంబాల బతుకును ఆగం చేస్తున్నాయి. ఏడాదిలోనే ఇంటి ఖర్చులు 30 నుంచి 40 శాతం పెరిగాయి. ఇంతకుముందు బైక్పైనే తిరిగేవాడిని. ఇప్పుడు 2, 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తే సైకిలు వాడుతున్నా. ఇంట్లో సరకుల వాడకం, కొనుగోలు తగ్గించాం.
- స్వామిరాజు, చిరుద్యోగి, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
బొగ్గు తరలింపుపై ప్రతిష్టంభన
సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొంది. వర్షాకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రేపు ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. -
ఉచిత పరీక్షలతో పేద రోగులకు ఊరట
క్యాన్సర్ ఉన్న వారిలో దాని మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) ఎలా ఉందని గుర్తించేందుకు నిమ్స్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మాలిక్యులర్ జెనెటిక్ పరీక్షలు ఉచితంగా చేస్తుండడంతో ఎంతో మంది పేద రోగులకు ఉపశమనం కలుగుతోంది. -
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది.