AP 3 Capitials: ఏపీలో 3 రాజధానులపై మళ్లీ బిల్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాలుగు గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వరదలపై సీఎం జగన్ సమీక్ష.. అంతలోనే అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారంటూ సమాచారం.. సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరుగుతుండగానే.. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయనుందని హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్.. ఈ కీలక పరిణామాలన్నీ సుమారు నాలుగు గంటల వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాల్ని ఉపసంహరించుకోబోతున్న విషయం ఏ మాత్రం బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ప్రస్తుత చట్టాల ఉపసంహరణ
ఈనాడు - అమరావతి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాలుగు గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వరదలపై సీఎం జగన్ సమీక్ష.. అంతలోనే అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారంటూ సమాచారం.. సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరుగుతుండగానే.. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయనుందని హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్.. ఈ కీలక పరిణామాలన్నీ సుమారు నాలుగు గంటల వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాల్ని ఉపసంహరించుకోబోతున్న విషయం ఏ మాత్రం బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. మంత్రివర్గం అత్యవసరంగా ఎందుకు సమావేశమైందన్న ఉత్కంఠ కొనసాగుతుండగానే ఉదయం 11.30 గంటల సమయంలో రెండు చట్టాల రద్దు గురించి ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. సచివాలయంలో సుమారు 11.50కి మంత్రివర్గ సమావేశం ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభమైన కాసేపటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు (ఆంధ్రప్రదేశ్ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి) ఏర్పాటు చేస్తూ 2020లో తీసుకొచ్చిన చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) రద్దు చట్టాన్నీ ఉపసంహరించుకుంటూ బిల్లు ప్రవేశపెట్టారు. సభాపతి తమ్మినేని సీతారాం సూచన మేరకు దానిలో ముఖ్యాంశాల్ని వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం .. మూడు రాజధానుల అవసరాన్ని ప్రజలకు వివరించి, మరింత సమగ్రంగా మెరుగైన బిల్లు ప్రవేశపెట్టేందుకే ఆ రెండు చట్టాల్ని ఉపసంహరించుకుంటున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఆ వెంటే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. మండలి ఆమోదం కూడా పొందాక దాన్ని గవర్నర్కు పంపనున్నారు. మరోవైపు మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సమాచారంతో ఆశావహ దృక్పథంతో కనిపించిన అమరావతి రైతులు వికేంద్రీకరణపై మెరుగైన బిల్లు ప్రవేశపెడతామన్న ప్రభుత్వ ప్రకటనతో నిరుత్సాహపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేవరకూ రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాజా బిల్లులో ఏముందంటే..
2014లో ఆమోదించిన సీఆర్డీఏ చట్టం మళ్లీ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తాజా బిల్లులో పేర్కొంది. ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ)కి చెందిన అన్ని రకాల ఆస్తులు, అప్పులు సీఆర్డీఏకి బదిలీ అవుతాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే.. ప్రస్తుతం ఏఎంఆర్డీఏలో ఉన్న ఉద్యోగులంతా సీఆర్డీఏ ఉద్యోగులుగా మారిపోతారు’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. ‘భాగస్వాములు (స్టేక్హోల్డర్స్) అందరితో మరోసారి సంప్రదింపులు జరిపేందుకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకుని, చట్ట నిబంధనల్ని మరింత మెరుగుపరుస్తూ మరోసారి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా..ఇంతకుముందున్న రెండు చట్టాల్ని ప్రభుత్వం రద్దు చేస్తోంది. బహుళ రాజధానుల ద్వారా పాలనా వికేంద్రీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వెనకున్న సదుద్దేశాల్ని అందరికీ వివరిస్తాం’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు, శ్రీబాగ్ ఒప్పందంలోని హామీల్ని నెరవేర్చేందుకు, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ప్రాంతీయ ఉద్యమాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం అప్పట్లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని తీసుకొచ్చిందన్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలోని ప్రజల ప్రయోజనాల్నీ కాపాడేందుకు ఆ చట్టాల్లో చర్యలు తీసుకున్నామన్నారు. భాగస్వాముల అభిప్రాయాన్ని వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ఆ చట్టాలపై ఫిర్యాదులు వచ్చాయని, కోర్టుల్లో కేసులు నమోదయ్యాయని బుగ్గన పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోనే మరింత సమగ్రంగా బిల్లు ప్రవేశపెట్టేందుకు.. ఆ చట్టాల్ని రద్దు చేస్తున్నామన్నారు.
మెరుగైన బిల్లు తెస్తాం
వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు.. చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాల్ని బిల్లులోనే పొందుపరిచేందుకు.. ఈ బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు.. అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా వివరించేందుకు.. ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు.. ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని.. మళ్లీ పూర్తి సమగ్రమైన, మెరుగైన బిల్లు సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.
- ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా