Remdesivir: రెమ్డెసివిర్ను ఆసుపత్రులే ఇవ్వాలి
కరోనా రోగులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ఆసుపత్రులే ఇవ్వాలని, బయట రిటైల్ మార్కెట్ నుంచి తెచ్చుకోమని రోగులు, వారి సహాయకులకు చెప్పకూడదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం జారీ చేసిన మార్గనిర్దేశాలలో పేర్కొంది. రోగికి వైద్యసేవలు అందించడంలో
బయటినుంచి తెచ్చుకోమని రోగులకు చెప్పొద్దు
కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తాజా మార్గనిర్దేశాలు
ఈనాడు, దిల్లీ: కరోనా రోగులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ఆసుపత్రులే ఇవ్వాలని, బయట రిటైల్ మార్కెట్ నుంచి తెచ్చుకోమని రోగులు, వారి సహాయకులకు చెప్పకూడదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం జారీ చేసిన మార్గనిర్దేశాలలో పేర్కొంది. రోగికి వైద్యసేవలు అందించడంలో నిమగ్నమైన సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్/స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే రెమ్డెసివిర్ను ప్రతిపాదించాలని పేర్కొంది. వేళ కాని వేళల్లో దీన్ని రోగికి అందించాలని సూచించినప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్.. సీనియర్ డాక్టర్తో టెలిఫోన్లో సంప్రదించిన తర్వాతే ఇవ్వాలని నిర్దేశించింది. ఈ మందును ప్రతిపాదించిన డాక్టర్ సదరు ప్రిస్క్రిప్షన్ మీద పేరు, సంతకం, స్టాంప్ తప్పనిసరిగా వేయాలని చెప్పింది. ఆసుపత్రిలో రెమ్డెసివిర్ వినియోగం గురించి ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా స్పెషల్ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇందులో వీలైనచోట ఫార్మకాలజీ ప్రొఫెసర్ను ఒక సభ్యుడిగా నియమించాలని పేర్కొంది. ఈ కమిటీ తమ అధ్యయనంలో తేలిన అంశాలను వైద్యసేవలు అందించే డాక్టర్లతో పంచుకొని రెమ్డెసివిర్ను హేతుబద్ధంగా ఉపయోగించేలా సూచనలు జారీ చేయాలని సూచించింది.
* రెమ్డెసివిర్ను కేవలం మధ్యస్థాయి, తీవ్రమైన లక్షణాలతో ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న రోగుల్లో ఎంపికచేసిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఇది అత్యవసర వినియోగం కోసం అనుమతిచ్చిన ఒక రిజర్వ్ డ్రగ్ మాత్రమే.
* ఇంట్లో ఏకాంతవాసంలో, కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న తేలికపాటి లక్షణాలున్న వారికి దీన్ని ప్రతిపాదించకూడదు.
* డాక్టర్లు రెమ్డెసివిర్ దుర్వినియోగాన్ని ఆపాలి. అధిక ధర, తక్కువ లభ్యత ఉన్న ఈ మందును ఇష్టానుసారం ప్రతిపాదించకూడదు. దానివల్ల నష్టాలు ఉంటాయి.
* ఇది మరణాలను ఆపకపోయినా 94% లోపు ఆక్సిజన్స్థాయి ఉన్న రోగులకు 7-10 రోజుల మధ్యలో దీన్ని ఇచ్చినప్పుడు త్వరగా కోలుకుంటారని అధ్యయనాల్లో తేలింది. సాధారణ రోగులు 15 రోజుల్లో కోలుకుంటే, ఇది ఇచ్చిన వారు 10 రోజుల్లోనే కోలుకుంటున్నట్లు అధ్యయనాలున్నాయి. ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం 17 నుంచి 12 రోగులకు తగ్గినట్లు వెల్లడైంది. కానీ మరణాలను అరికట్టడంలో మాత్రం ప్రభావం చూపలేదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.
తేలికపాటి లక్షణాలుంటే.. హైడ్రాక్సీ, ఐవర్మెక్టిన్ వాడొద్దు
లక్షణాలు లేని, తేలికపాటి లక్షణాలున్న కొవిడ్ రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్, మల్టీవిటమిన్ మాత్రలు వాడకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ మందులన్నింటినీ తొలగించింది. డాక్టర్లు సీటీ స్కాన్ లాంటి అనవసరమైన టెస్టులను ప్రతిపాదించొద్దని పేర్కొంది. లక్షణాలు తీవ్రమవుతున్నప్పుడు మాత్రమే హెచ్ఆర్సీటీ టెస్ట్ ప్రతిపాదించాలని పేర్కొంది. సీఎక్స్ఆర్ వరుసగా చేయకూడదని, రెండింటి మధ్య కనీసం 48 గంటల తేడా ఉండాలని తెలిపింది. సీఆర్పీ, డీడైమర్ 48 నుంచి 72 గంటలకోసారి, సీబీసీ, కేఎఫ్టీ, ఎల్ఎఫ్టీ పరీక్షలు 24 నుంచి 48 గంటలకోసారి చేయాలని సూచించింది. రోగులు జ్వరం, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల గురించి, రోగ లక్షణాలు ఏమైనా తీవ్రమవుతున్నాయా? అన్నది గమనిస్తూ ఉండాలని పేర్కొంది. ఉపశమనం కోసం యాంటీపైరెటిక్, యాంటీ టస్సివ్ తీసుకోవచ్చని తెలిపింది. దగ్గు ఉంటే బుడెసొనైడ్ (800 మాక్రోగ్రామ్స్) ఇన్హలేషన్ను రోజుకు రెండుసార్లు చొప్పున 5 రోజులపాటు కొనసాగించవచ్చని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...